LOADING...
Mahindra Hiroi.ev: భారత మార్కెట్లో త్వరలో విడుదల కానున్న మహీంద్రా ఎలక్ట్రిక్ బస్సు 'హిరోయి.ev'
భారత మార్కెట్లో త్వరలో విడుదల కానున్న మహీంద్రా ఎలక్ట్రిక్ బస్సు 'హిరోయి.ev'

Mahindra Hiroi.ev: భారత మార్కెట్లో త్వరలో విడుదల కానున్న మహీంద్రా ఎలక్ట్రిక్ బస్సు 'హిరోయి.ev'

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 21, 2026
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ కమర్షియల్ వాహన తయారీ సంస్థ SML Mahindra ఎలక్ట్రిక్ బస్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. 'హిరోయి.ev'అనే కొత్త ఎలక్ట్రిక్ బస్సును ఈ ఆర్థిక సంవత్సరంలో(FY27)ఆవిష్కరించనున్నట్లు సంస్థ ప్రకటించింది. స్వచ్ఛమైన రవాణా పరిష్కారాలపై ప్రభుత్వ ప్రోత్సాహం పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ ఛైర్మన్ వినోద్ సహాయ్(Vinod Sahay)మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం ప్రధానంగా రాష్ట్ర రవాణా సంస్థల(STUs)వల్లే పెరుగుతోందని, అధిక ఖర్చులు, చార్జింగ్ సౌకర్యాల లోపం కారణంగా ప్రైవేట్ రంగం ముందుకు రావడంలో వెనుకంజ వేస్తోందని చెప్పారు. FY26లో మొత్తం బస్సుల అమ్మకాలలో ఎలక్ట్రిక్ బస్సుల వాటా కేవలం 4.5 శాతమే ఉండటం ఈ రంగంలో ఉన్న సవాళ్లను స్పష్టం చేస్తోంది.

వివరాలు 

FY26లో 18.3 శాతం పెరిగిన ఆదాయం

అయితే టెండర్ల ఆధారంగా వాణిజ్య లాభదాయకతను పరిశీలిస్తూ అవకాశాలను వినియోగించుకోవాలని సంస్థ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న ప్రముఖ కంపెనీలు PMI Electro, JBM Auto, Olectra Greentech, EKA Mobilityలతో పోటీ మరింత పెరగనుంది. ఇక కంపెనీ ఆర్థిక ఫలితాల విషయానికి వస్తే FY26లో ఆదాయం 18.3 శాతం పెరిగి ₹2,837.92 కోట్లకు చేరగా, నికర లాభం 31.3 శాతం పెరిగి ₹159.75 కోట్లుగా నమోదైంది.

Advertisement