Page Loader
Airtel: రెండు రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్ 
Airtel: రెండు రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్

Airtel: రెండు రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్ 

వ్రాసిన వారు Stalin
Mar 11, 2024
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ అతిపెద్ద టెలికాం సంస్థ 'ఎయిర్‌ టెల్' తన వినియోగదారులకు షాకిచ్చింది. రెండు రీఛార్జ్ ప్లాన్‌లను పెంచేసింది. 'ఎయిర్‌టెల్' కంపెనీ తన రూ. 118 ప్లాన్‌తో పాటు రూ. 289 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను సవరించింది. ఈ మేరకు కొత్త ధరలను కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఎయిర్‌టెల్ రూ.118 ప్లాన్‌ను ఇప్పుడు రూ.129 ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ. 289 ప్లాన్‌ను రూ. 329 ధరకు విక్రయించబోతోంది. ఈ రెండు కూడా 4జీ ప్లాన్స్ కావడం గమనార్హం. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లలో వినియోగదారులు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో ఓసారి పరిశీలిద్దాం.

ఎయిర్ టెల్

ఎయిర్‌టెల్ రూ.129 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.129 ప్లాన్‌ 12GB ఇంటర్నెట్ డేటాతో వస్తుంది. వినియోగదారులు తమ ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటులో ఎప్పుడైనా ఈ డేటాను ఉపయోగించవచ్చు. ఈ 12 GB డేటా చెల్లుబాటు వినియోగదారుల ప్రస్తుత ప్రీపెయిడ్ ప్లాన్ వలే ఉంటుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు ఇతర ప్రయోజనాలను పొందలేరు. రూ.329 ప్లాన్ గతంలో ఈ ప్లాన్ ధర రూ.289గా ఉండేది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీని వినియోగదారులు 35 రోజుల వరకు ఉంటుంది. ఇందులో, వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్, 4GB డేటా, 300 SMS సౌకర్యాన్ని పొందుతారు. ఇది కాకుండా, ఈ ప్లాన్‌లో, వినియోగదారులు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా Airtel థాంక్స్ సౌకర్యాన్ని పొందుతారు.