NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Pakistan Stock Market: భారత్ దెబ్బకు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కుదేల్.. ప్రారంభమైన 5 నిమిషాల్లోనే భారీ నష్టాలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pakistan Stock Market: భారత్ దెబ్బకు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కుదేల్.. ప్రారంభమైన 5 నిమిషాల్లోనే భారీ నష్టాలు
    Pakistan Stock Market: భారత్ దెబ్బకు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కుదేల్..

    Pakistan Stock Market: భారత్ దెబ్బకు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కుదేల్.. ప్రారంభమైన 5 నిమిషాల్లోనే భారీ నష్టాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 24, 2025
    03:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రభుత్వం పాక్‌పై తీసుకున్న కఠిన చర్యలు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి.

    గురువారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే మార్కెట్ సూచీలు గణనీయంగా పడిపోయాయి.

    కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ (KSE-100) బెంచ్ మార్క్ సూచీ ఏకంగా 2.12 శాతం క్షీణించింది.

    అంటే 2,485 పాయింట్లు తగ్గి 114,740.29 స్థాయికి పడిపోయింది.

    భౌగోళిక స్థితిగతులపై ఆందోళనలతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించుకోవడం వల్ల ఈ పతనం చోటుచేసుకుంది.

    మార్కెట్ ప్రారంభమైన మొదటి 5 నిమిషాల్లోనే ఈ స్థాయిలో నష్టాన్ని నమోదు చేసింది.

    వివరాలు 

    పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి లోనైంది

    పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై వెంటనే కఠిన నిర్ణయాలు తీసుకుంది.

    ముఖ్యంగా సింధు జలాల పంపకాన్ని నిలిపివేయడంతో పాటు, పాకిస్తాన్‌కు చెందిన దౌత్యవేత్తలను దేశం నుంచి వెళ్లగొట్టింది.

    అంతేకాకుండా పాక్ పౌరులకు ఇచ్చిన వీసాలను కూడా రద్దు చేసింది. వాఘా-అటారీ సరిహద్దును కూడా తాత్కాలికంగా మూసివేసింది.

    ఈ వరుస చర్యల ప్రభావంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి లోనైంది.

    వివరాలు 

    కాశ్మీర్‌ మొత్తం బంద్‌

    ఇదిలా ఉండగా, మంగళవారం పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.

    అనేక మంది గాయపడ్డారు. మృతుల దేహాలను అధికారులు వారి స్వస్థలాలకు తరలించారు.

    ఈ ఘటనతో జమ్మూకాశ్మీర్‌ ప్రాంతం నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో వెనుదిరుగుతున్నారు.

    ఈ దాడికి నిరసనగా గురువారం కాశ్మీర్‌ మొత్తం బంద్‌కు పిలుపునిచ్చింది.

    చిక్కుకున్న పర్యాటకుల కోసం స్థానిక హోటళ్లు ముందుకొచ్చి 15 రోజులు ఉచితంగా బస కల్పిస్తామని ప్రకటించాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    పాకిస్థాన్

    ICC Champions Trophy 2025: పాక్‌ క్రికెట్ పతనం.. బాబర్ అజామ్ నేతృత్వంపై మాజీ క్రికెటర్ల అసంతృప్తి ఐసీసీ
    Pakistan team: పతనదిశలో పాక్ క్రికెట్.. గట్టెక్కాలంటే టీమిండియా మోడలే పరిష్కారమా? క్రికెట్
    India-Pakistan: 'భారతదేశాన్ని అధిగమించి,మీ స్వంత వైఫల్యాలను సరిదిద్దుకోండి'.. పాకిస్థాన్‌ చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించిన భారత్‌..  భారతదేశం
    PAK vs BAN: పాక్, బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షార్పణం.. ఒక్క విజయం లేకుండానే ఇంటిదారి! బంగ్లాదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025