NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Banks: సైబర్ మోసాన్నిఅరికట్టడానికి,అక్రమ లావాదేవీల కేసుల్లో ఖాతాల  స్తంభనకు   అధికారమివ్వాలి : బ్యాంకుల అభ్యర్థన 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Banks: సైబర్ మోసాన్నిఅరికట్టడానికి,అక్రమ లావాదేవీల కేసుల్లో ఖాతాల  స్తంభనకు   అధికారమివ్వాలి : బ్యాంకుల అభ్యర్థన 
    Bank: అక్రమ లావాదేవీల కేసుల్లో ఖాతాల  స్తంభనకు   అధికారమివ్వాలి

    Banks: సైబర్ మోసాన్నిఅరికట్టడానికి,అక్రమ లావాదేవీల కేసుల్లో ఖాతాల  స్తంభనకు   అధికారమివ్వాలి : బ్యాంకుల అభ్యర్థన 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 14, 2025
    08:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్థిక మోసాలకు పాల్పడే దుండగులు ఇప్పటికీ మ్యూల్‌ ఖాతాలను వినియోగించడం ఆపటం లేదు.

    బాధ్యత లేని ఖాతాదారులకు కొంత డబ్బు లేదా ఇతర ప్రయోజనాలు అందించి, వారి ఖాతాల ఆన్‌లైన్‌ సమాచారం, డెబిట్‌ కార్డులు సేకరిస్తున్నారు.

    అనంతరం, అక్రమంగా సంపాదించే డబ్బును ముందుగా ఆ ఖాతాల్లోకి బదిలీ చేసి, తరువాత ఇతర మార్గాల ద్వారా స్వాధీనం చేసుకుంటున్నారు.

    ఈ తరహా మోసాలపై పోలీసులు విచారణ జరిపినప్పుడు,ఎక్కువసార్లు ఆ ఖాతాదారులే అదుపులోకి వస్తున్నా,అసలు మోసగాళ్లపై చర్యలు తీసుకోవడంలో ఎటువంటి లాభం లేకుండా పోతుంది.

    ఈ మ్యూల్‌ ఖాతాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు,అవసరమైనచోట వాటిని నిలిపివేయడానికి చట్టబద్ధ అధికారుల అనుమతి తప్పనిసరి కావడం వల్ల, సమయనష్టం జరుగుతోందని బ్యాంకులు చెబుతున్నాయి.

    వివరాలు 

    సమస్యపై మరింత లోతుగా పరిశీలన

    అందువల్ల, ఇలాంటి ఖాతాలను వెంటనే నిలిపివేయడానికి పూర్తి అధికారాలను తమకే అప్పగించాలని బ్యాంకులు కోరుతున్నాయి.

    పూర్తిస్థాయిలో ఉపయోగించని ఖాతాలను బ్యాంకులు సాధారణంగా నిలిపివేస్తాయి.

    అయితే, మనీలాండరింగ్‌ నిరోధక చట్టమైన "ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (PMLA)"ప్రకారం, కోర్టులు లేదా చట్టాన్ని అమలు చేసే అధికార సంస్థల (Law Enforcement Agencies - LEAs)అనుమతి లేకుండా ఖాతాలను స్తంభింప చేయడానికి బ్యాంకులకు ఎలాంటి అధికారమూ లేదు.

    సైబర్‌ నేరాలు,మ్యూల్‌ ఖాతాల వాడకాన్ని దృష్టిలో ఉంచుకుని,భారతీయ బ్యాంకుల సంఘం(Indian Banks' Association - IBA)ఏర్పాటు చేసిన వర్కింగ్‌ గ్రూప్‌ తన నివేదికలో,ఈ సమస్యపై మరింత లోతుగా పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని,రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) దీనిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.

    వివరాలు 

    మోసగాళ్లు కొత్త ఖాతాలు తెరిస్తూనే ఉన్నారు! 

    బ్యాంకింగ్‌ వ్యవస్థను మోసాలకు వేదికగా చేసుకునే వ్యక్తులు మ్యూల్‌ ఖాతాలను బాగా వినియోగిస్తున్నారు.

    బ్యాంకులు ప్రతి సంవత్సరం వేల ఖాతాలను నిలిపివేస్తున్నా, మోసగాళ్లు వ్యవస్థలోని లొసుగులను అందిపుచ్చుకుని త్వరగా కొత్త ఖాతాలను తెరవడంలో విఫలమవడం లేదు.

    ఇలాంటి మోసాలను అరికట్టేందుకు, మ్యూల్‌గా మారే అవకాశం ఉన్న ఖాతాలను గుర్తించి వాటిని పరిమితం చేయడానికి బ్యాంకులకు అధికారాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఐబీఏ అభిప్రాయపడింది.

    వివరాలు 

    ట్రాన్సాక్షన్‌ పర్యవేక్షణకు ఏఐ, ఎంఎల్‌ అవసరం 

    పాన్‌ కార్డు లేని వారు ఓటర్‌ ఐడీ, ఫారం-60 వంటివి ఉపయోగించి బ్యాంక్‌ ఖాతాలు తెరిచే పరిస్థితుల నేపథ్యంలో, అటువంటి ఖాతాదారుల వివరాలను ధ్రువీకరించేందుకు, కేంద్ర ఎన్నికల కమిషన్‌ డేటాబేస్‌ వినియోగించవచ్చని బ్యాంకులు సూచించాయి.

    అలాగే, అటువంటి ఖాతాల్లో చేసే లావాదేవీలపై కొన్ని పరిమితులు విధించాలని ప్రతిపాదించాయి.

    మోసాలను ముందుగా గుర్తించేందుకు, ట్రాన్సాక్షన్‌ల పర్యవేక్షణలో కృత్రిమ మేధ (Artificial Intelligence - AI), మెషీన్‌ లెర్నింగ్‌ (Machine Learning - ML) టెక్నాలజీలను వినియోగించడం వల్ల నేరగాళ్ల వ్యూహాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవచ్చని ఐబీఏ స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బ్యాంక్

    తాజా

    Earthquake: గ్రీస్‌లోని రోడ్స్ సమీపంలో 6.2 తీవ్రతతో భూకంపం.. టర్కీ, ఈజిప్ట్, సిరియాలో ప్రకంపనలు  భూకంపం
    China-US: యూఎస్ చైనా వాణిజ్య యుద్ధం.. వారం చివర్లో ట్రంప్, జిన్ పింగ్ చర్చలు.. అమెరికా
    Waqf Act: ఆరు నెలల్లో వక్ఫ్ ఆస్తుల నమోదు పూర్తి చేయాలి: కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం
    Amaravati : రాజధాని అమరావతి రెండోదశ ప్రాజెక్టు కోసం 40-45 వేల ఎకరాలు భూసమీకరణ.. మంత్రి నారాయణ వెల్లడి  అమరావతి

    బ్యాంక్

    Bank Holidays: ఫిబ్రవరిలో 11రోజులు బ్యాంకులకు సెలవులు.. ఏఏ రోజున మూసి ఉంటాయంటే..  తాజా వార్తలు
    బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 17% జీతం పెంపు.. వారంలో 5రోజులే పని దినాలు  తాజా వార్తలు
    Flash Pay: కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల కోసం ఫెడరల్ బ్యాంక్ 'ఫ్లాష్ పే'  బిజినెస్
    Payments Bank Board: పేమెంట్స్ బ్యాంక్ బోర్డు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ: పేటీఎమ్ సీఈఓ విజయ్ శేఖర్  పేటియం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025