Page Loader
Banks: సైబర్ మోసాన్నిఅరికట్టడానికి,అక్రమ లావాదేవీల కేసుల్లో ఖాతాల  స్తంభనకు   అధికారమివ్వాలి : బ్యాంకుల అభ్యర్థన 
Bank: అక్రమ లావాదేవీల కేసుల్లో ఖాతాల  స్తంభనకు   అధికారమివ్వాలి

Banks: సైబర్ మోసాన్నిఅరికట్టడానికి,అక్రమ లావాదేవీల కేసుల్లో ఖాతాల  స్తంభనకు   అధికారమివ్వాలి : బ్యాంకుల అభ్యర్థన 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 14, 2025
08:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్థిక మోసాలకు పాల్పడే దుండగులు ఇప్పటికీ మ్యూల్‌ ఖాతాలను వినియోగించడం ఆపటం లేదు. బాధ్యత లేని ఖాతాదారులకు కొంత డబ్బు లేదా ఇతర ప్రయోజనాలు అందించి, వారి ఖాతాల ఆన్‌లైన్‌ సమాచారం, డెబిట్‌ కార్డులు సేకరిస్తున్నారు. అనంతరం, అక్రమంగా సంపాదించే డబ్బును ముందుగా ఆ ఖాతాల్లోకి బదిలీ చేసి, తరువాత ఇతర మార్గాల ద్వారా స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ తరహా మోసాలపై పోలీసులు విచారణ జరిపినప్పుడు,ఎక్కువసార్లు ఆ ఖాతాదారులే అదుపులోకి వస్తున్నా,అసలు మోసగాళ్లపై చర్యలు తీసుకోవడంలో ఎటువంటి లాభం లేకుండా పోతుంది. ఈ మ్యూల్‌ ఖాతాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు,అవసరమైనచోట వాటిని నిలిపివేయడానికి చట్టబద్ధ అధికారుల అనుమతి తప్పనిసరి కావడం వల్ల, సమయనష్టం జరుగుతోందని బ్యాంకులు చెబుతున్నాయి.

వివరాలు 

సమస్యపై మరింత లోతుగా పరిశీలన

అందువల్ల, ఇలాంటి ఖాతాలను వెంటనే నిలిపివేయడానికి పూర్తి అధికారాలను తమకే అప్పగించాలని బ్యాంకులు కోరుతున్నాయి. పూర్తిస్థాయిలో ఉపయోగించని ఖాతాలను బ్యాంకులు సాధారణంగా నిలిపివేస్తాయి. అయితే, మనీలాండరింగ్‌ నిరోధక చట్టమైన "ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (PMLA)"ప్రకారం, కోర్టులు లేదా చట్టాన్ని అమలు చేసే అధికార సంస్థల (Law Enforcement Agencies - LEAs)అనుమతి లేకుండా ఖాతాలను స్తంభింప చేయడానికి బ్యాంకులకు ఎలాంటి అధికారమూ లేదు. సైబర్‌ నేరాలు,మ్యూల్‌ ఖాతాల వాడకాన్ని దృష్టిలో ఉంచుకుని,భారతీయ బ్యాంకుల సంఘం(Indian Banks' Association - IBA)ఏర్పాటు చేసిన వర్కింగ్‌ గ్రూప్‌ తన నివేదికలో,ఈ సమస్యపై మరింత లోతుగా పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని,రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) దీనిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.

వివరాలు 

మోసగాళ్లు కొత్త ఖాతాలు తెరిస్తూనే ఉన్నారు! 

బ్యాంకింగ్‌ వ్యవస్థను మోసాలకు వేదికగా చేసుకునే వ్యక్తులు మ్యూల్‌ ఖాతాలను బాగా వినియోగిస్తున్నారు. బ్యాంకులు ప్రతి సంవత్సరం వేల ఖాతాలను నిలిపివేస్తున్నా, మోసగాళ్లు వ్యవస్థలోని లొసుగులను అందిపుచ్చుకుని త్వరగా కొత్త ఖాతాలను తెరవడంలో విఫలమవడం లేదు. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు, మ్యూల్‌గా మారే అవకాశం ఉన్న ఖాతాలను గుర్తించి వాటిని పరిమితం చేయడానికి బ్యాంకులకు అధికారాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఐబీఏ అభిప్రాయపడింది.

వివరాలు 

ట్రాన్సాక్షన్‌ పర్యవేక్షణకు ఏఐ, ఎంఎల్‌ అవసరం 

పాన్‌ కార్డు లేని వారు ఓటర్‌ ఐడీ, ఫారం-60 వంటివి ఉపయోగించి బ్యాంక్‌ ఖాతాలు తెరిచే పరిస్థితుల నేపథ్యంలో, అటువంటి ఖాతాదారుల వివరాలను ధ్రువీకరించేందుకు, కేంద్ర ఎన్నికల కమిషన్‌ డేటాబేస్‌ వినియోగించవచ్చని బ్యాంకులు సూచించాయి. అలాగే, అటువంటి ఖాతాల్లో చేసే లావాదేవీలపై కొన్ని పరిమితులు విధించాలని ప్రతిపాదించాయి. మోసాలను ముందుగా గుర్తించేందుకు, ట్రాన్సాక్షన్‌ల పర్యవేక్షణలో కృత్రిమ మేధ (Artificial Intelligence - AI), మెషీన్‌ లెర్నింగ్‌ (Machine Learning - ML) టెక్నాలజీలను వినియోగించడం వల్ల నేరగాళ్ల వ్యూహాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవచ్చని ఐబీఏ స్పష్టం చేసింది.