NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / యాంటీట్రస్ట్ ఉల్లంఘనల నేపథ్యంలో గూగుల్‌పై చర్యలకు కేంద్రం సమాలోచనలు
    తదుపరి వార్తా కథనం
    యాంటీట్రస్ట్ ఉల్లంఘనల నేపథ్యంలో గూగుల్‌పై చర్యలకు కేంద్రం సమాలోచనలు
    యాంటీట్రస్ట్ ఉల్లంఘనల నేపథ్యంలో గూగుల్‌పై చర్యలకు కేంద్రం సమాలోచనలు

    యాంటీట్రస్ట్ ఉల్లంఘనల నేపథ్యంలో గూగుల్‌పై చర్యలకు కేంద్రం సమాలోచనలు

    వ్రాసిన వారు Stalin
    May 22, 2023
    04:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యాంటీట్రస్ట్ ఆరోపణల నేపథ్యంలో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌పై భారత ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ డిప్యూటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.

    యాంటీట్రస్ట్ కార్యకలాపాలకు పాల్పడినట్లు, వినియోగదారులకు చెల్లింపులో అవకతవకలు జరిగినట్లు యాంటీట్రస్ట్ వాచ్‌డాగ్ ది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో గూగుల్‌పై కేసులు కూడా నమోదయ్యాయి.

    గతేడాది అక్టోబర్‌లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్‌లో ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేయడం, డెవలపర్‌లను పక్కదారి పట్టించడం వంటి రెండు కేసుల్లో భారతదేశ యాంటీట్రస్ట్ బాడీ సీసీఐ గూగుల్‌కు 275 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.

    గూగుల్

    కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఇంకా స్పందించని గూగుల్

    గూగుల్ చేసిన తప్పులపై కేంద్రం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిప్యూటీ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై మంత్రి వెల్లడించలేదు.

    గూగుల్‌పై వచ్చిన ఆరోపణలు డిజిటల్ వ్యవస్థకు ఇబ్బంది కలిగిస్తాయని ఆయన అంగీకరించారు. అయితే గూగుల్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అంశంపై మంత్రిత్వ శాఖ క్షుణ్ణంగా పరిశీలించిందని ఆయన స్పష్టం చేశారు.

    అయితే కేంద్ర ఐటీ సహాయ మంత్రి వ్యాఖ్యలపై గూగుల్ ఇంకా స్పందించలేదు. ఈ అంశం కోర్టులో ఉన్నందున ఇంతకు మించి ఎక్కువగా మాట్లడలేదని చంద్రశేఖర్ పేర్కొన్నారు. భారతదేశంలో 620 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లలో దాదాపు 97శాతం ఆండ్రాయిడ్‌తోనే నడుస్తున్నాయి. అందుకే గూగుల్‌కు భారత మార్కెట్ చాలా కీలకం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గూగుల్
    సమాచార & ప్రసార శాఖ మంత్రి
    సాంకేతిక పరిజ్ఞానం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    గూగుల్

    గూగుల్ లో ఈ విషయాలు సెర్చ్ చేస్తే మీ పని అంతే! ఆండ్రాయిడ్ ఫోన్
    Bingలో ChatGPT AIతో గూగుల్ ను సవాలు చేయనున్న మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    యాంటీట్రస్ట్ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన గూగుల్ టెక్నాలజీ
    భారతదేశంలో మొదలైన సామ్ సంగ్ Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్ ఆండ్రాయిడ్ ఫోన్

    సమాచార & ప్రసార శాఖ మంత్రి

    వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్; 10శాతం తగ్గనున్న వంటగ్యాస్ ధరలు గ్యాస్

    సాంకేతిక పరిజ్ఞానం

    National Technology Day 2023: జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?  టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025