NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market: వరుసగా ఆరో రోజూ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 187, నిఫ్టీ 41 పాయింట్లు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock market: వరుసగా ఆరో రోజూ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 187, నిఫ్టీ 41 పాయింట్లు 
    వరుసగా ఆరో రోజూ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    Stock market: వరుసగా ఆరో రోజూ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 187, నిఫ్టీ 41 పాయింట్లు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 22, 2025
    04:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో ట్రేడింగ్ రోజునూ లాభాలతోనే ముగిశాయి.

    గ్లోబల్ మార్కెట్ల నుంచి స్పష్టత లేని సంకేతాలు వస్తున్నా కూడా మన దేశ మార్కెట్లు స్థిరంగా పుంజుకున్నాయి.

    ముఖ్యంగా, దినసరి వినియోగ వస్తువులు (FMCG) బ్యాంకింగ్ రంగాల షేర్లలో బలమైన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు పాజిటివ్‌గా కొనసాగాయి.

    గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్ సుమారు 6,000 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం అది 80,000 పాయింట్ల మార్క్‌ను అందుకునే దశలో ఉంది.

    వివరాలు 

    విదేశీ కరెన్సీ మారకంలో రూపాయి విలువ 85.19

    ఈ రోజు ట్రేడింగ్‌ను సెన్సెక్స్ 79,728.39 వద్ద లాభాల్లో ప్రారంభించింది,ఇది నిన్నటి ముగింపు 79,408.50 పాయింట్ల కంటే అధికం.

    ట్రేడింగ్ అంతటా లాభాల్లోనే కదలికలు కనబరిచింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో గరిష్ఠంగా 79,824.30 పాయింట్లను చేరింది.

    చివరికి 187 పాయింట్ల లాభంతో 79,595.59 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 41.70 పాయింట్ల లాభంతో 24,167.25 వద్ద స్థిరపడింది.

    విదేశీ కరెన్సీ మారకంలో రూపాయి విలువ డాలరుతో పోల్చితే 85.19 వద్ద కొనసాగుతోంది.

    వివరాలు 

    బంగారం ధర ఔన్స్‌కు 3,477 డాలర్లు 

    సెన్సెక్స్‌లోని టాప్‌ షేర్లలో ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జొమాటో (ఎటర్నెల్) లాంటి కంపెనీలు గణనీయంగా లాభపడ్డాయి.

    ఇక నష్టాల్లో నిలిచిన కంపెనీల్లో ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు ఉన్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు సుమారు 67 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ధర ఔన్స్‌కు 3,477 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    స్టాక్ మార్కెట్

    Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @23,668.65 బిజినెస్
    Stock Market : ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు  బిజినెస్
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 728, నిఫ్టీ 181 పాయింట్లు చొప్పున నష్టం  బిజినెస్
    Stock Market : లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025