Loading...
Coforge: కోఫోర్జ్‌ ఛైర్మన్‌ ఓం ప్రకాశ్‌ భట్‌ రాజీనామా.. బోర్డు ఆడిట్‌లో కీలక అంశాలు
కోఫోర్జ్‌ ఛైర్మన్‌ ఓం ప్రకాశ్‌ భట్‌ రాజీనామా.. బోర్డు ఆడిట్‌లో కీలక అంశాలు

Coforge: కోఫోర్జ్‌ ఛైర్మన్‌ ఓం ప్రకాశ్‌ భట్‌ రాజీనామా.. బోర్డు ఆడిట్‌లో కీలక అంశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2026
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఐటీ సేవల సంస్థ కోఫోర్జ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.సంస్థ ఛైర్మన్‌ ఓం ప్రకాశ్‌ భట్‌ తన పదవికి రాజీనామా చేశారు. బోర్డు మూల్యాంకన ప్రక్రియపై నిర్వహించిన అంతర్గత ఆడిట్‌లో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కావడం, ఆ తర్వాత బోర్డు వివరణ కోరడం వంటి పరిణామాల మధ్య భట్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వార్త వెలువడిన వెంటనే కోఫోర్జ్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో కోఫోర్జ్‌ షేరు ఏకంగా 8.7శాతం పడిపోయి రూ.1,780.70కి చేరింది. ఏడాదికి పైగా కాలంలో ఒక్కరోజులో నమోదైన అతిపెద్ద పతనం ఇదే. ఉదయం ట్రేడింగ్‌లో నిఫ్టీ ఐటీ సూచీ దాదాపు 3 శాతం నష్టపోగా.. అందులో భారీగా పడిపోయిన షేర్లలో కోఫోర్జ్‌ కూడా ఒకటిగా నిలిచింది.

వివరాలు 

పదవీకాలం పూర్తికాకముందే రాజీనామా

ఆ తర్వాత కొంత కోలుకున్నప్పటికీ షేరు 6 శాతానికి పైగా నష్టంతో సుమారు రూ.1,829 వద్ద ట్రేడైంది.

ఓం ప్రకాశ్‌ భట్‌ గతంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌గా పనిచేశారు.

2024లో కోఫోర్జ్‌ బోర్డు ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం 2027 ఏప్రిల్‌ వరకు ఉండాల్సి ఉంది.

అయితే అంతర్గత ఆడిట్‌లో వచ్చిన అంశాల నేపథ్యంలో పదవీకాలం పూర్తికాకముందే రాజీనామా చేశారు.

వివరాలు 

అసలు ఆడిట్‌లో ఏం గుర్తించారు?

కోఫోర్జ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించిన ఆడిట్‌ ప్రణాళికలో భాగంగా సంస్థ అంతర్గత ఆడిటర్‌ బోర్డు మూల్యాంకన ప్రక్రియను పరిశీలించారు.

అలాగే ఆ మూల్యాంకనం ఆధారంగా రూపొందించిన బోర్డు మూల్యాంకన నివేదికను కూడా సమీక్షించారు.

ఈ ప్రక్రియను ఎలా నిర్వహించారు, నివేదికను బోర్డుకు ఎలా అందించారు అనే అంశాల్లో కొన్ని ఆందోళనకర విషయాలను ఆడిట్‌ గుర్తించింది.

ముఖ్యంగా నివేదికకు సంబంధించిన కొన్ని కీలక సమాచారాన్ని బోర్డుకు పూర్తిగా వెల్లడించలేదని తేలింది.

ఇందులో ఛైర్మన్‌ పనితీరుకు సంబంధించిన సమాచారం కూడా ఉందని కోఫోర్జ్‌ తెలిపింది. అయితే బోర్డుకు వెల్లడించని ఆ సమాచారం ఏమిటన్నది మాత్రం సంస్థ వివరించలేదు.

ADVERTISEMENT

వివరాలు 

అసలు ఆడిట్‌లో ఏం గుర్తించారు?

ఆడిట్‌ నివేదికలోని అంశాలపై బోర్డు ఓం ప్రకాశ్‌ భట్‌తో చర్చించింది. దీనిపై ఆయన వివరణ కూడా కోరింది.

భట్‌ తన సమాధానాన్ని బోర్డుకు అందించారు. ఆయన వివరణను బోర్డు పరిశీలిస్తున్న సమయంలోనే సెప్టెంబర్‌ 8న భట్‌ తన రాజీనామాను సమర్పించారు.

తనపై వచ్చిన అంశాలపై బోర్డు అప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని కోఫోర్జ్‌ స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

తాను ఉద్దేశపూర్వకంగా వ్యవహరించలేదన్న భట్

తన రాజీనామా లేఖలో ఓం ప్రకాశ్‌ భట్‌.. బోర్డు మూల్యాంకన ప్రక్రియలో తాను మంచి ఉద్దేశంతోనే వ్యవహరించానని పేర్కొన్నారు.

అయితే తన చర్యల స్వభావంపై బోర్డుతో విభేదాలు కొనసాగుతున్న సమయంలో బోర్డులో కొనసాగడం సంస్థ సమర్థవంతమైన పనితీరుకు అనుకూలంగా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతర్గత ఆడిట్‌లో గుర్తించిన అంశాలు, ఆ తర్వాత బోర్డు భట్‌ను వివరణ కోరడం, ఆయన సమాధానాన్ని పరిశీలించడం వంటి పరిణామాల తర్వాతే ఆయన రాజీనామా చేసినట్లు కోఫోర్జ్‌ తెలిపింది.

వివరాలు 

తాత్కాలిక ఛైర్మన్‌గా వివేక్‌ శర్మ

ఓం ప్రకాశ్‌ భట్‌ రాజీనామా నేపథ్యంలో కోఫోర్జ్‌ బోర్డు కొత్త తాత్కాలిక ఛైర్మన్‌ను నియమించింది.

నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ వివేక్‌ శర్మను తాత్కాలిక ఛైర్మన్‌గా ఎంపిక చేసింది.

ఆయన 2027 జనవరి 31 వరకు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.

మధ్య తరహా భారత ఐటీ సేవల సంస్థల్లో కోఫోర్జ్‌కు ప్రత్యేక స్థానం ఉంది.

ఈ సమయంలో ఛైర్మన్‌ ఆకస్మికంగా రాజీనామా చేయడం, అంతర్గత ఆడిట్‌లో బోర్డు పాలనకు సంబంధించిన అంశాలు వెలుగులోకి రావడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి.

ఈ ప్రభావం కోఫోర్జ్‌ షేర్లపై స్పష్టంగా కనిపించింది.

ADVERTISEMENT