Loading...
Para Archery: పారా ఆర్చరీ సిరీస్‌ స్టేజ్‌-3లో భారత్‌ జోరు.. రెండు స్వర్ణాలు సహా ఐదు పతకాలు
పారా ఆర్చరీ సిరీస్‌ స్టేజ్‌-3లో భారత్‌ జోరు..రెండు స్వర్ణాలు సహా ఐదు పతకాలు

Para Archery: పారా ఆర్చరీ సిరీస్‌ స్టేజ్‌-3లో భారత్‌ జోరు.. రెండు స్వర్ణాలు సహా ఐదు పతకాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2026
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌ స్టేజ్‌-3 టోర్నీలో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మంగళవారం భారత్‌ ఖాతాలో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం చేరాయి. దీంతో ఆతిథ్య దేశంగా బరిలోకి దిగిన భారత జట్టు పతకాల వేటను మరింత వేగం చేసింది. పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో తోమన్‌ కుమార్‌,శ్యామ్‌ సుందర్‌ స్వామి జోడీతో కూడిన భారత జట్టు స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో భారత్‌ 152-139తో ఇరాక్‌కు చెందిన అబ్బాస్‌, అన్వర్‌ జోడీని ఓడించింది. ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు తుదిపోరులోనూ అదే జోరును కొనసాగించి పసిడి సొంతం చేసుకుంది. పురుషుల రికర్వ్‌ టీమ్‌ విభాగంలోనూ భారత్‌కు స్వర్ణమే దక్కింది.

వివరాలు 

మహిళల రికర్వ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌ రజత పతకం

హర్వీందర్‌ సింగ్‌, విజయ్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లో 6-2తో స్లొవేకియాకు చెందిన డేవిడ్‌ ఇవాన్‌, డెన్నిస్‌ ఇవాన్‌లపై విజయం సాధించింది. దీంతో భారత్‌ ఖాతాలో రెండో స్వర్ణం చేరింది.

మహిళల రికర్వ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌ రజత పతకంతో సరిపెట్టుకుంది.

భావన, పూజలతో కూడిన భారత జట్టు ఫైనల్లో చైనాకు చెందిన లియాంగ్‌, చెన్‌ జోడీతో తలపడింది. ఈ పోరులో భారత్‌ 0-6తో ఓటమి పాలైంది.

దీంతో చైనా జట్టుకు స్వర్ణం, భారత్‌కు రజతం లభించాయి. డబ్ల్యూ-1 మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలోనూ భారత్‌కు రజత పతకమే దక్కింది.

స్వాతి,అదిల్‌ మహ్మద్‌తో కూడిన భారత జట్టు తుది పోరులో చెకియాకు చెందిన ముసిలోవా, డేవిడ్‌ జోడీతో పోటీపడింది.

వివరాలు 

డబ్ల్యూ-1 మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో స్వాతి కాంస్య పతకం

1-5తో భారత్‌ ఓడిపోవడంతో చెకియా స్వర్ణం సాధించగా.. భారత జట్టు రజతంతో టోర్నీని ముగించింది.

డబ్ల్యూ-1 మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో స్వాతి కాంస్య పతకాన్ని సాధించింది.

రష్యాకు చెందిన క్రటోవాపై జరిగిన పోరులో స్వాతి 6-2తో విజయం సాధించింది.

ఈ గెలుపుతో ఆమె మూడో స్థానాన్ని సొంతం చేసుకుని భారత్‌ ఖాతాలో మరో పతకాన్ని చేర్చింది.

మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలోనూ భారత్‌ కాంస్య పతక పోరులో బరిలోకి దిగింది.

శీతల్‌ దేవి, పాయల్‌ నాగ్‌ జంట చైనాకు చెందిన వాంగ్‌, గావో జోడీతో తలపడింది.

అయితే ఈ పోరులో భారత జంట 140-149తో ఓటమి చవిచూసింది. దీంతో ఆ విభాగంలో భారత్‌ పతకం సాధించలేకపోయింది.

ADVERTISEMENT