Stock Market: 100 డాలర్లకు చేరిన ముడి చమురు.. 800 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదరడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి 100 డాలర్ల స్థాయిని దాటాయి. క్రూడ్ ధరల పెరుగుదల మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ముఖ్యంగా ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 203 పాయింట్లకు పైగా క్షీణించింది.
వివరాలు
సెన్సెక్స్ పరిస్థితి ఇలా..
సెన్సెక్స్ బుధవారం 75,216.22 పాయింట్ల వద్ద నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించింది. మంగళవారం సూచీ 75,577.58 పాయింట్ల వద్ద ముగిసింది.
ప్రారంభం నుంచి రోజంతా నష్టాల బాటలోనే కొనసాగిన సెన్సెక్స్.. చివరికి 813.35 పాయింట్లు కోల్పోయి 74,764.23 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ కూడా భారీ నష్టాల్లోనే..
నిఫ్టీ 203.60 పాయింట్లు నష్టపోయి 23,431.50 వద్ద ట్రేడింగ్ను ముగించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదలతో పాటు ఐటీ షేర్లలో అమ్మకాలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
వివరాలు
ఐటీ షేర్లపై అమ్మకాల ఒత్తిడి
సెన్సెక్స్ 30లో హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు ప్రధానంగా నష్టాలను నమోదు చేశాయి.
మరోవైపు అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ట్రెంట్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.11గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం రూపాయిపై కూడా ఒత్తిడి పెంచింది.
అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 100.60 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
మరోవైపు బంగారం ఔన్స్ ధర 4,391.07డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
మొత్తంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు, క్రూడ్ ధరల పెరుగుదల దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపడంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాలతో ముగిశాయి.