Stock Market: 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. వరుసగా మూడోరోజూ నష్టాల్లో సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదరడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇరాన్-అమెరికా మధ్య దాడులు తీవ్రరూపం దాల్చడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. వరుసగా మూడో రోజు కూడా సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఉదయం 9.32 గంటలకు సెన్సెక్స్ 523 పాయింట్లు నష్టపోయి 75,066 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 125 పాయింట్లు దిగజారి 23,509 వద్ద కదులుతోంది. ట్రేడింగ్ ప్రారంభ సమయంలో అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.88గా నమోదైంది.
వివరాలు
నిఫ్టీలో కొన్ని షేర్లు లాభాల్లో..
నిఫ్టీ సూచీలో కోల్ ఇండియా, మ్యాక్స్ హెల్త్కేర్, లార్సెన్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
దీనికి భిన్నంగా ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, విప్రో షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి.
వివరాలు
100 డాలర్లకు చేరువలో ముడి చమురు
ఇరాన్-అమెరికా మధ్య దాడులతో హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి.
ఇరు దేశాలు 10కి పైగా చమురు ట్యాంకర్లపై దాడులు చేసినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరోసారి భారీగా పెరిగాయి.
బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ ధర 99.49 డాలర్లకు ఎగబాకింది. మరోవైపు అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ధర బ్యారెల్కు 94.63 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
హర్మూజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో చమురు సరఫరాపై ఆందోళనలు పెరగడం మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతోంది.