Loading...
EPFO: పీఎఫ్ వేతన పరిమితిపై కేంద్రం వెనక్కి.. ఉద్యోగులకు నిరాశ!
పీఎఫ్ వేతన పరిమితిపై కేంద్రం వెనక్కి.. ఉద్యోగులకు నిరాశ!

EPFO: పీఎఫ్ వేతన పరిమితిపై కేంద్రం వెనక్కి.. ఉద్యోగులకు నిరాశ!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2026
04:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రైవేట్ రంగ ఉద్యోగుల సామాజిక భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) వేతన పరిమితి పెంపు అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎలాంటి మార్పు చేయకూడదని నిర్ణయించింది. నెలవారీ పీఎఫ్ వేతన పరిమితిని ప్రస్తుతం అమల్లో ఉన్న రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచాలన్న ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కన పెట్టింది. దీంతో అధిక మొత్తంలో పీఎఫ్ ప్రయోజనాలు పొందాలని ఆశించిన లక్షలాది మంది ఉద్యోగులకు నిరాశ ఎదురైంది.

వివరాలు 

కంపెనీలపై అదనపు ఆర్థిక భారం ఆందోళన

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, కొత్త లేబర్ కోడ్ అమలుతో ఇప్పటికే పరిశ్రమలు, ప్రైవేట్ సంస్థలపై అదనపు వ్యయభారం పెరిగింది.

ఈ పరిస్థితుల్లో పీఎఫ్ వేతన పరిమితిని కూడా పెంచితే సంస్థలు ఉద్యోగుల తరఫున మరింత అధిక మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది.

ముఖ్యంగా ఐటీ రంగ సంస్థలు కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా మారేందుకు ఇప్పటికే భారీగా పెట్టుబడులు వెచ్చించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పరిశ్రమలు, కార్మిక సంఘాలు, ఇతర సంబంధిత వర్గాల అభిప్రాయాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది.

వివరాలు 

రూ.15 వేల పరిమితి ఎందుకు కొనసాగుతోంది?

పీఎఫ్ లెక్కింపుకు సంబంధించిన ప్రస్తుత వేతన పరిమితి 2014 నుంచి అమల్లో ఉంది.

ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఉద్యోగి బేసిక్ వేతనం నుంచి 12 శాతం,యజమాని నుంచి మరో 12 శాతం చొప్పున ఈపీఎఫ్ ఖాతాలో జమ చేయాలి.

రూ.15,000 వేతన పరిమితిని ఆధారంగా తీసుకుంటే, తప్పనిసరిగా నెలకు గరిష్టంగా రూ.1,800 వరకు మాత్రమే ఉద్యోగి, అంతే మొత్తాన్ని యజమాని పీఎఫ్‌కు చెల్లించాల్సి ఉంటుంది.

పరిమితి పెరిగితే ఏమి మారుతుంది?

ఒకవేళ వేతన పరిమితిని రూ.25,000కు పెంచితే,పీఎఫ్ లెక్కింపులో నెలకు గరిష్టంగా రూ.3,000 వరకు ఉద్యోగి, అదే మొత్తాన్ని యజమాని చెల్లించాల్సి వస్తుంది.

దీంతో సంస్థలపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉండటంతో ప్రస్తుతం ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలపలేదు.

ADVERTISEMENT

వివరాలు 

కార్మిక సంఘాల నుంచి పెరుగుతున్న డిమాండ్

మరోవైపు, దేశంలోని ప్రధాన నగరాల్లో సాధారణ కార్మికుల వేతనాలు కూడా రూ.15,000 దాటుతున్నాయని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.

ప్రస్తుత పరిమితి కారణంగా అనేక మంది ఉద్యోగులు ఈపీఎఫ్ ప్రయోజనాల పరిధిలోకి పూర్తిగా రాలేకపోతున్నారని,అందువల్ల వేతన పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి.

పరిమితి పెరిగితే కోట్ల మందికి ప్రయోజనం

కార్మిక శాఖ అంతర్గత అంచనాల ప్రకారం, వేతన పరిమితిని రూ.25,000కు పెంచితే దేశవ్యాప్తంగా మరో కోటి మందికి పైగా ఉద్యోగులు ఈపీఎఫ్,ఉద్యోగుల పెన్షన్ వంటి సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓలో సుమారు 8కోట్ల మంది యాక్టివ్ సభ్యులు ఉండగా,సంస్థ నిర్వహిస్తున్న నిధుల పరిమాణం రూ.27నుంచి రూ.28లక్షల కోట్ల మధ్య ఉన్నట్లు అంచనా.

ADVERTISEMENT