LOADING...
Gold Jewellery: పండుగలు,పెళ్లిళ్ల సీజన్‌కు ముందు బంగారు నగలకు పెరిగిన డిమాండ్
పండుగలు,పెళ్లిళ్ల సీజన్‌కు ముందు బంగారు నగలకు పెరిగిన డిమాండ్

Gold Jewellery: పండుగలు,పెళ్లిళ్ల సీజన్‌కు ముందు బంగారు నగలకు పెరిగిన డిమాండ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాల కొనుగోళ్లు మళ్లీ ఊపందుకున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి దీంతో జూన్ నెలలో బంగారు నగలకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని జ్యువెలరీ వ్యాపారులు చెబుతున్నారు. ' దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ బంగారు నగల మార్కెట్ దరిబా కలాన్‌లో ఇటీవల అమ్మకాలు దాదాపు 20 శాతం వరకు పెరిగాయి. గతంలో బంగారం ధరలు పెరగడం,దిగుమతి సుంకాల పెంపు కారణంగా కొనుగోలుదారులు వెనుకంజ వేయగా, ఇప్పుడు ధరలు తగ్గడంతో మళ్లీ దుకాణాల బాట పడుతున్నారని వ్యాపారులు పేర్కొంటున్నారు.

వివరాలు 

తగ్గిన బంగారు నాణేల డిమాండ్

రాబోయే పండుగలు, వివాహాల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని వినియోగదారులు బంగారు ఆభరణాల కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారని మార్కెట్ ప్రతినిధులు తెలిపారు. మార్కెట్‌కు వచ్చే వినియోగదారుల సంఖ్య కూడా పెరిగిందని, విచారణలతో పాటు కొనుగోళ్లు కూడా ఆశాజనకంగా కొనసాగుతున్నాయని వారు వెల్లడించారు. జూన్ త్రైమాసికంలో బంగారం ధరలు భారీగా పెరగడంతో ఆభరణాలతో పాటు పెట్టుబడుల కోసం కొనుగోలు చేసే బంగారు నాణేల డిమాండ్ కూడా తగ్గింది. అయితే ఇటీవల బంగారం ధరలు తగ్గడంతో కొనుగోళ్లు మళ్లీ పెరిగాయి.

వివరాలు 

రెండు వారాలుగా డిమాండ్

వర్షాకాలానికి ముందు ఉష్ణోగ్రతలు తగ్గడం కూడా రిటైల్ అమ్మకాలకు అనుకూలంగా మారిందని వ్యాపారులు చెబుతున్నారు. వాతావరణం చల్లబడటంతో వినియోగదారులు షాపింగ్‌కు రావడానికి ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ఇటీవలి నెలల్లో బంగారం,వెండి ధరలు తమ గరిష్ఠ స్థాయిల నుంచి కొంత మేర తగ్గాయి. దిగుమతి సుంకాన్ని 9 శాతం పెంచిన తర్వాత కొంతకాలం కొనుగోలుదారులు కొత్త ధరలకు అలవాటు పడే వరకు మార్కెట్‌లో రద్దీ తగ్గినప్పటికీ, గత రెండు వారాలుగా డిమాండ్ మళ్లీ బలంగా పెరిగిందని ప్రముఖ జ్యువెలరీ సంస్థలు వెల్లడించాయి.

Advertisement

వివరాలు 

బ్రాండెడ్ జ్యువెలరీ సంస్థలకు జూన్ త్రైమాసికం ఊతం

దేశంలోని ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్లకు కూడా జూన్ త్రైమాసికం మంచి ఫలితాలను అందించింది. కేరళకు చెందిన కళ్యాణ్ జ్యువెలర్స్ భారత కార్యకలాపాల్లో 38 శాతానికి పైగా ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో అమ్మకాలు బలంగా నమోదవడంతో పాటు, ఒకే దుకాణాల విక్రయాల వృద్ధి (SSSG) 28 శాతానికి చేరినట్లు సంస్థ తెలిపింది. మరోవైపు మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న టైటాన్‌కు చెందిన జ్యువెలరీ వ్యాపారానికి కూడా పండుగల సీజన్, ముఖ్యంగా అక్షయ తృతీయ సందర్భంగా వచ్చిన భారీ డిమాండ్ బలమైన వృద్ధికి దోహదపడింది.

Advertisement

వివరాలు 

రెండంకెల వృద్ధిని నమోదు చేసిన పెట్టుబడి బంగారు నాణేల అమ్మకాలు

బంగారం ధరలు స్థిరంగా ఉండటంతో కొత్త వినియోగదారులు పెరగడమే కాకుండా, ఒక్కో కొనుగోలు విలువ కూడా గణనీయంగా పెరిగిందని సంస్థ వెల్లడించింది. సాధారణ బంగారు ఆభరణాలు,వజ్రాభరణాల విక్రయాలు కూడా మంచి వృద్ధిని నమోదు చేశాయి. పెట్టుబడి కోసం కొనుగోలు చేసే బంగారు నాణేల అమ్మకాలు కూడా రెండంకెల వృద్ధిని కొనసాగించాయి. కోల్‌కతాకు చెందిన సెంకో గోల్డ్ కూడా జూన్ త్రైమాసికంలో ఆదాయ వృద్ధి నమోదైనట్లు తెలిపింది. అక్షయ తృతీయ, పోయిలా బోయిశాఖ్, వైశాఖి, బిహూ వంటి పండుగలు, వేసవి వివాహాల సీజన్ కలిసి జ్యువెలరీ అమ్మకాలకు గణనీయమైన ఊతాన్ని ఇచ్చాయని సంస్థ వెల్లడించింది.

Advertisement