Gold Prices: ఒక్కసారిగా పెరిగిన పసిడి ధర.. నేడు తులం రేటు ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గత మూడు వారాలుగా పసిడి రేట్లు క్రమంగా తగ్గుతూ రావడంతో కొనుగోలు చేయాలనుకున్న వారికి కొంత ఊరట లభించింది. అయితే ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారింది. బంగారం ధరలు మళ్లీ వేగంగా పెరుగుతుండటంతో కొనుగోలుదారులు నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటంతో పాటు వినాయక చవితి, దసరా వంటి పండుగలు సమీపిస్తున్నాయి. దీంతో దేశీయంగా బంగారం కొనుగోళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇలాంటి సమయంలోనే పసిడి ధరలు పెరగడం కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో కూడా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల్లో అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు
మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
వీటి ప్రభావంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కూడా మళ్లీ రికార్డు స్థాయిల వైపు కదులుతున్నాయి.
ఇప్పటికే బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్ల మార్కును దాటింది. చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు నెలకొన్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతుండటం కూడా పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతోంది.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 11, శుక్రవారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
వివరాలు
శుక్రవారం బంగారం ధరలు ఇలా..
దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,55,520గా కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.1,42,560 వద్ద ట్రేడవుతోంది.
హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,55,520గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,560 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.1,55,520గా పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,560 వద్ద ఉంది.
బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,520గా నమోదైంది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,42,560 వద్ద ట్రేడవుతోంది.
వివరాలు
నేటి వెండి ధరలు ఇవే..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,670గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రేటు రూ.1,42,710 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,55,100 వద్ద ట్రేడవుతోంది. గురువారం కిలో వెండి ధర రూ.2,55,000 వద్ద స్థిరపడింది. దీంతో పోలిస్తే నేడు స్వల్పంగా పెరిగింది.
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.2,54,900గా ఉంది. గురువారం కేజీ సిల్వర్ రేటు రూ.2.55 లక్షల వద్ద ముగిసింది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.2,54,900 వద్ద కొనసాగుతోంది. గురువారం కూడా కిలో వెండి ధర రూ.2.55 లక్షల స్థాయిలోనే ఉంది.
వివరాలు
నేటి వెండి ధరలు ఇవే..
బెంగళూరులో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,55,100గా నమోదైంది. గురువారం కిలో వెండి ధర రూ.2.55 లక్షల వద్ద ముగిసింది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనాత్మకమైనవి. నగలు కొనుగోలు చేసే సమయంలో స్థానిక పన్నులు, మేకింగ్ ఛార్జీలు, ఇతర రుసుముల కారణంగా తుది ధరల్లో మార్పు ఉండొచ్చు.