NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Crude Oil : రూ.85వేల కోట్లతో క్రూడాయిల్ రవాణా నౌకల కొనుగోలుకి ప్రణాళిక !
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Crude Oil : రూ.85వేల కోట్లతో క్రూడాయిల్ రవాణా నౌకల కొనుగోలుకి ప్రణాళిక !
    రూ.85వేల కోట్లతో క్రూడాయిల్ రవాణా నౌకల కొనుగోలుకి ప్రణాళిక !

    Crude Oil : రూ.85వేల కోట్లతో క్రూడాయిల్ రవాణా నౌకల కొనుగోలుకి ప్రణాళిక !

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 21, 2025
    08:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ప్రభుత్వం సుమారుగా రూ.85 వేల కోట్ల వ్యయంతో 112 క్రూడ్ ఆయిల్ రవాణా నౌకలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

    ఈ ప్రతిపాదనకు సంబంధించి కొనుగోలు ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్లు బ్లూమ్‌బర్గ్ వార్త సంస్థ వెల్లడించింది.

    ప్రపంచంలో మూడవ అతిపెద్ద క్రూడ్ ఆయిల్ వినియోగ దేశంగా భారత్ నిలిచిన నేపథ్యంలో, దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

    దిగుమతులు 

    చమురు అవసరాల కోసం భారీగా దిగుమతులు 

    దేశీయంగా పెరుగుతున్న చమురు డిమాండ్‌ను తీర్చేందుకు భారత్ ఇప్పటికే విదేశీ మార్కెట్లపై ఆధారపడి భారీగా ఆయిల్ దిగుమతులు చేసుకుంటోంది.

    అంతర్జాతీయంగా ఏర్పడే రాజకీయ, ఆర్థిక అస్థిరతల వల్ల సరఫరాలో అంతరాయాలు తలెత్తే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వంత నౌకల కల్పన అవసరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

    సొంత రవాణా నౌకలు కలిగి ఉండటం వలన అత్యవసర పరిస్థితుల్లోనూ చమురు సరఫరాలో అంతరాయం రాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది.

    నౌకలు

    2040 నాటికి 112 నౌకలు అందుబాటులోకి

    భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం, ఈ 112 నౌకలు 2040 సంవత్సరానికి ముందుగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉంటుంది.

    ఈ ప్రయోజనాత్మక నిర్ణయం వల్ల భారత్‌కు అనేక లాభాలు లభించనున్నాయి.

    ముఖ్యంగా చమురు దిగుమతుల వ్యయాన్ని తగ్గించుకోవడం, సరఫరాలో స్వయం నియంత్రణ కలిగి ఉండడం వంటి అంశాలు ప్రధానంగా నిలవనున్నాయి.

    దీర్ఘకాలికంగా ఈ ప్రణాళిక దేశానికి గణనీయమైన మార్పును తీసుకురావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చమురు

    తాజా

    Crude Oil : రూ.85వేల కోట్లతో క్రూడాయిల్ రవాణా నౌకల కొనుగోలుకి ప్రణాళిక ! చమురు
    AP Rains: ఏపీలో నేడు పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన.. అత్యంత వేగంగా నైరుతి రుతుపవనాలు  ఆంధ్రప్రదేశ్
    Iran-Israel: ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ ప్లాన్: అమెరికా నిఘా వర్గాలు   ఇరాన్
    Mumbai Rain: ముంబైను ముంచెత్తిన కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం.. వాహనదారులకు ఇక్కట్లు ముంబై

    చమురు

    వినియోగదారులకు గుడ్‌న్యూస్; వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గాయ్ వాణిజ్య సిలిండర్
    గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్: రూ. 171.50 తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధర వాణిజ్య సిలిండర్
    నగదు కొరతతో మే 3, 4తేదీల్లో గో ఫస్ట్ విమాన సర్వీసుల రద్దు విమానం
    పెట్రోల్, డీజిల్‌ను రూ. 1 తక్కువే అమ్ముతాం: నయారా ఎనర్జీ  పెట్రోల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025