English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Gold bonds: పసిడి బాండ్ల మదుపర్లకు భారీ లాభం.. రూ.1 లక్ష పెట్టిన వారికి రూ.3 లక్షలు!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Gold bonds: పసిడి బాండ్ల మదుపర్లకు భారీ లాభం.. రూ.1 లక్ష పెట్టిన వారికి రూ.3 లక్షలు!
    పసిడి బాండ్ల మదుపర్లకు భారీ లాభం.. రూ.1 లక్ష పెట్టిన వారికి రూ.3 లక్షలు!

    Gold bonds: పసిడి బాండ్ల మదుపర్లకు భారీ లాభం.. రూ.1 లక్ష పెట్టిన వారికి రూ.3 లక్షలు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 03, 2025
    05:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎనిమిది సంవత్సరాల క్రితం సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు కొనుగోలు చేసిన వారికి భారీ లాభం కలిగింది. 2017 మేలో ఆర్‌ బి ఐ ద్వారా జారీ చేసిన పసిడి బాండ్లకు సంబంధించి రిడెంప్షన్‌ తేదీని తాజాగా ప్రకటించింది.

    మే 9ని మెచ్యూర్‌ తేదీగా నిర్ణయించారు. దీని వల్ల అప్పట్లో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టిన వారు ఇప్పుడు దాదాపు మూడింతలు లాభం పొందబోతున్నారు,

    అంటే వారు రూ.3 లక్షలు పొందగలుగుతారు. ఇందులో వడ్డీ కూడా కలిసిఉంటుంది. 2015 నవంబరులో దేశంలో భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న లక్ష్యంతో ఆర్‌బీఐ ఈ బాండ్ల పథకాన్ని ప్రారంభించింది.

    ఈ బాండ్ల కాలపరిమితి 8 సంవత్సరాలు.

    Details

    ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారికి రూ.50శాతం డిస్కౌంట్‌

    2017 మేలో 2017-18 సిరీస్‌ 1 పసిడి బాండ్లు జారీ చేయబడగా, ఆ సమయంలో 999 స్వచ్ఛత కలిగిన గ్రాము బంగారం ధర రూ.2,951గా నిర్ణయించారు.

    ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారికి రూ.50 డిస్కౌంట్‌ ఇవ్వబడింది. ఇప్పటికే ఆర్‌బీఐ వారు నిర్ణయించిన మెచ్యూరిటీ ధర రూ.9,486గా ఉంది.

    ఆ సమయంలో1 లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టిన వారికి ఇప్పుడు రూ.3 లక్షలు పొందే అవకాశం ఉంది.

    దీనిపై పసిడి బాండ్లపై ఇచ్చే వడ్డీ కూడా అదనంగా ఉంటుంది. ఏటా 2.50% నామమాత్ర వడ్డీని ఈబాండ్లకు అందజేస్తారు.

    రిడెంప్షన్‌ తేదీకి ముందు వారం 999 స్వచ్ఛత కలిగిన బంగారానికి భారత బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ నిర్ణయించిన సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటారు.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    Details

    2015-16లో బాండ్ల జారీ

    ఈసారి ధరను రూ.9,486గా నిర్ణయించారు. ఇటీవల పసిడి ధరలు రూ.1 లక్ష మార్కు దాటిన సందర్భంలో పసిడి బాండ్ల రిడెంప్షన్‌ మళ్లీ మదుపర్లకు గొప్ప అవకాశమని చెప్పవచ్చు.

    ఈ బాండ్లపై వచ్చిన మొత్తం నుంచి ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 2015-16 బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ఈ పథకం కింద ఆర్‌బీఐ ఈ బాండ్లను జారీ చేసింది.

    చివరగా 2024 ఫిబ్రవరి 12-16 మధ్య సబ్‌స్క్రిప్షన్‌ కోసం అవకాశం ఇచ్చింది, కానీ ఆ తర్వాత ఈ బాండ్లను జారీ చేయకుండా ప్రభుత్వం నిర్ణయించింది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ బి ఐ

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ఆర్ బి ఐ

    RBI MPC meet: డిజిటల్‌ పేమెంట్స్‌పై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. యూపీఐ లైట్‌ వ్యాలెట్‌ పరిమితి రూ.5వేలకు పెంపు  శక్తికాంత దాస్‌
    RBI : నిబంధనలు పాటించనందుకు SG ఫిన్‌సర్వ్‌కి ఆర్బీఐ భారీ జరిమానా  బిజినెస్
    RBI: మరొక ద్రవ్యోల్బణం వల్ల దేశం కొత్త రిస్క్‌ను తీసుకోకూడదు: శక్తికాంత దాస్ శక్తికాంత దాస్‌
    Gold: స్వదేశంలోనే భారీగా బంగారం నిల్వలు.. ఆర్బీఐ ఆర్థిక ఎత్తుగడ వెనుక అసలు కారణమిదే! బంగారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025