Page Loader
IMF Report: నాల్గో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇండియా.. ఐఎంఎఫ్ షాకింగ్ రిపోర్ట్
నాల్గో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇండియా.. ఐఎంఎఫ్ షాకింగ్ రిపోర్ట్

IMF Report: నాల్గో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇండియా.. ఐఎంఎఫ్ షాకింగ్ రిపోర్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 06, 2025
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం భారతదేశం త్వరలోనే జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారనుంది. ఏప్రిల్‌లో విడుదలైన IMF వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ ప్రకారం, భారత్‌ 2025 నాటికి $4 ట్రిలియన్ మార్క్‌ను దాటి, జపాన్‌ను వెనక్కి నెట్టే అవకాశం ఉంది. 2025 నాటికి నాలుగవ అతిపెద్ద ఆర్థికశక్తిగా భారత్‌ 2025 నాటికి భారత నామమాత్ర GDP $4.187 ట్రిలియన్లకు చేరుకోనుండగా, జపాన్ GDP \$4.186 ట్రిలియన్లకు పరిమితమవుతుంది. ఈ గణాంకాలతో భారత్‌ నాలుగవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించనుంది.

Details

2024లో భారత్ ఐదవ స్థానం

గతేడాది (2024) భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థికశక్తిగా కొనసాగింది. భారత్ GDP $3.9 ట్రిలియన్లుగా నమోదవ్వగా, జపాన్‌ $4.1 ట్రిలియన్లతో నాలుగవ స్థానంలో ఉంది. వృద్ధిరేటు వివరాలు IMF అంచనాల ప్రకారం, 2025లో భారత ఆర్థికవ్యవస్థ 6.3 శాతం వృద్ధి చెందనుంది. గత అంచనాలో ఇది 6.5 శాతంగా ఉండగా, తాజా నివేదికలో కొద్దిగా తగ్గించారు. జపాన్ వృద్ధిరేటు కేవలం 0.6 శాతంగా ఉంటుందని IMF అంచనా వేసింది. 2028 నాటికి మూడవ స్థానంలోకి భారత్ భారతదేశం 2028 నాటికి జర్మనీని అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదగనుంది. 2027 నాటికి భారత్‌ GDP $5.07 ట్రిలియన్లకు చేరుకోనుండగా, జర్మనీ GDP కేవలం $13 బిలియన్ల తేడాతో ముందుండే అవకాశం ఉంది.

Details

2030 నాటికి మరింత దూసుకెళ్లే భారత్

2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం $6.8 ట్రిలియన్లను దాటనుంది. అదే సమయంలో ఇది జర్మన్ ఆర్థిక వ్యవస్థ కంటే 20 శాతం పెద్దదిగా, జపాన్ కంటే మూడవ వంతు అధికంగా ఉండనుంది. ఇప్పటికే బ్రిటన్‌ను దాటిన భారత్ 2020 లోనే భారత్ బ్రిటన్‌ను అధిగమించి ఐదవ అతిపెద్ద ఆర్థికశక్తిగా నిలిచిన విషయం తెలిసిందే. IMF అంచనాల ప్రకారం, భారత్ వచ్చే నాలుగేళ్లలో సగటున 10.1 శాతం వృద్ధిరేటుతో దూసుకెళ్లనుంది.