India's Economic Growth: ఆర్బీఐ అంచనాలను మించి భారత్ ఆర్థిక వృద్ధి.. 7 శాతానికి చేరొచ్చన్న డిప్యూటీ గవర్నర్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ ఆర్థిక వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన 6.7 శాతాన్ని మించి దాదాపు 7 శాతానికి చేరే అవకాశం ఉందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా తెలిపారు. మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో దేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. చెన్నైలోని మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో పూనమ్ గుప్తా ఈ వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు కనబరుస్తుందని ఆమె అంచనా వేశారు.
వివరాలు
ఆర్థిక సవాళ్ల మధ్యనూ భారత్ వృద్ధిపై ఆర్బీఐ విశ్వాసం
ఈ కాలానికి సంబంధించిన అధికారిక గణాంకాలు ఈ నెలాఖరులో విడుదల కానున్నాయి.
ఆర్థికవేత్తల అంచనాలు ప్రస్తుతం 6.9 శాతం నుంచి 8 శాతం మధ్య ఉన్నాయి.
తొలి త్రైమాసికంలో వృద్ధి బలంగా ఉంటే ఏడాది మొత్తం వృద్ధి రేటు 7 శాతానికి చేరువలో ఉండొచ్చని గుప్తా తెలిపారు.
రుతుపవనాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం,ఇంధన ధరలు ఎక్కువగా ఉండటం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ తట్టుకుని ముందుకు సాగుతోందని ఆమె వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
ఇదే కారణంతో పూనమ్ గుప్తా ఇటీవల వడ్డీ రేట్ల విషయంలో కొంత కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది.
వివరాలు
ఆర్థిక వృద్ధిపై పూనమ్ గుప్తా ధీమా.. విదేశీ చెల్లింపుల పరిస్థితిపైనా ఆశాభావం
ఈ వారం విడుదలైన ఆర్బీఐ ఆగస్టు ద్రవ్య విధాన సమావేశం మినిట్స్లో కూడా ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్లు పెంచే అవకాశాన్ని గుప్తా ప్రస్తావించిన విషయం వెల్లడైంది.
"ముందు రోజుల్లో ఈ సవాళ్లు ఉన్నప్పటికీ 7.5శాతం వృద్ధి సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ సవాళ్లు ఉన్నప్పటికీ మున్ముందు 7.5శాతం వృద్ధి సాధించగలమని భావిస్తున్నాను. అంతకంటే మెరుగైన వృద్ధిని సాధించేందుకు ప్రయత్నించాలి"అని ఆమె తెలిపారు.
భారత్ విదేశీ ఖాతాల విషయంలోనూ పూనమ్ గుప్తా విశ్వాసం వ్యక్తం చేశారు.
దేశ విదేశీ చెల్లింపుల పరిస్థితి మరింత అనుకూలంగా మారుతుందని ఆమె తెలిపారు.
ఈఆర్థిక సంవత్సరంలో భారత్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్(చెల్లింపుల సమతుల్యత) లోటు నుంచి మిగులు స్థితికి మారే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
వివరాలు
విదేశీ నిధులపై ఆశలు..
రూపాయి విలువపై ఒత్తిడిని తగ్గించేందుకు తీసుకున్న చర్యలు,విదేశీ కరెన్సీ డిపాజిట్లను ఆకర్షించేందుకు అందిస్తున్న ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇందుకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. వీటి ద్వారా భారత్కు 80బిలియన్ డాలర్ల వరకు విదేశీ నిధులు వచ్చే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.
ఇరాన్ యుద్ధం ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ఏర్పడిన ఆందోళనలు ఊహించినంత తీవ్రంగా లేకపోవడంతో భారత అధికారులు కూడా ఆర్థిక పరిస్థితిపై మరింత ఆశావహంగా మాట్లాడుతున్నారు.
వివరాలు
విదేశీ నిధులపై ఆశలు..
బలమైన ఆర్థిక వృద్ధి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యాన్ని మరోసారి స్పష్టం చేశారు.
అయితే ఈ లక్ష్యాన్ని సాధించాలంటే కనీసం రెండు దశాబ్దాల పాటు భారత్ 8 శాతానికి పైగా స్థిరమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేయాల్సి ఉంటుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.