NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Jio AirFiber: సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభం: ముకేశ్ అంబానీ 
    తదుపరి వార్తా కథనం
    Jio AirFiber: సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభం: ముకేశ్ అంబానీ 
    సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభం

    Jio AirFiber: సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభం: ముకేశ్ అంబానీ 

    వ్రాసిన వారు Stalin
    Aug 28, 2023
    03:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తన 46వ వార్షిక సాధారణ సమావేశం 2023ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు.

    ఈ ఏడాది సెప్టెంబర్ 19న వినాయక చవితి సందర్భంగా జియో ఎయిర్‌ ఫైబర్‌ను ప్రారంభించనున్నట్లు ముకేష్ అంబానీ ప్రకటించారు.

    భారతదేశాన్ని ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా మార్చే ప్రతిష్టాత్మక మిషన్‌ రిలయన్స్ జియోను ఏడేళ్ల క్రితం ప్రారంభించినట్లు తెలిపారు.

    భారత అద్భుతమైన డిజిటల్ పరివర్తనకు జియో ప్రధాన ఉత్ప్రేరకమన్నారు.

    ఇప్పుడు తమ ఆశయాలు భారతదేశ తీరాన్ని దాటినట్లు పేర్కొన్నారు. గత అక్టోబర్‌లో 5G రోల్‌ అవుట్‌ను ప్రారంభించినట్లు ముకేష్ అంబానీ చెప్పారు.

    జియో

    డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5జీ అందుబాటులోకి: అంబానీ

    కేవలం 9 నెలల్లో జియో 5జీ 96 శాతానికి పైగా పట్టణ జనాభాకు అందుబాటులోకి వచ్చినట్లు ముకేష్ అంబానీ పేర్కొన్నారు.

    డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5జీ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గత 10 ఏళ్లలో 150 బిలియన్ డాలర్లు పెట్టుబడులను దేశంలో పెట్టినట్లు ముకేష్ చెప్పారు.

    ఏ భారతీయ కార్పోరెట్ కంపెనీ కూడా ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేదన్నారు. తాము అసాధ్యమని అనిపించిన లక్ష్యాలను నిర్దేశించుకున్నామని, వాటిని సాధించుకున్నట్లు చెప్పారు.

    భారతదేశంలో పనిచేస్తున్న మొత్తం 5జీ సెల్‌లలో దాదాపు 85శాతం జియో నెట్‌వర్క్‌ పరిధిలోనే ఉన్నట్లు చెప్పారు. తాము ప్రతి 10 సెకన్లకు ఒక 5జీ సెల్‌ను తమ నెట్‌వర్క్‌కి జోడిస్తున్నట్లు స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముకేష్ అంబానీ
    జియో

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    ముకేష్ అంబానీ

    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ
    అశోక్ లేలాండ్ తో కలిపి RIL ఆవిష్కరించిన హైడ్రోజన్-శక్తితో నడిచే భారీ-డ్యూటీ ట్రక్కు ఆటో మొబైల్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్

    జియో

    రిలయన్స్ జియోతో జతకట్టిన మోటోరోలా.. వినియోగదారులకు 5జీ థ్రిల్! టెక్నాలజీ
    రూ. 61కు '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో భారతదేశం
    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి టెలికాం సంస్థ
    వైరల్ అవుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధం ఫోటోలు రిలయెన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025