USA: క్యాన్సర్ ఆరోపణల నేపథ్యంలో జాన్సన్ అండ్ జాన్సన్కు భారీ జరిమానా విధింపు
జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ ఆరోగ్యానికి ప్రమాదకరమని వస్తున్న ఆరోపణలు తాజాగా మళ్లీ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ సందర్భంలో అమెరికాలోని ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ టాల్కమ్ పౌడర్ ఉపయోగించడం వల్ల తనకు అరుదైన క్యాన్సర్ వచ్చినట్లు ఆరోపించారు. ట్రయల్ కోర్టు ఈ కేసును విచారించిన తర్వాత, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి భారీ జరిమానా విధించింది. ప్లాట్కిన్ ఇవాన్ అనే వ్యక్తి, 2021లో తనపై జరిగిన పరీక్షల్లో మెసోథెలియోమా అనే అరుదైన క్యాన్సర్ నిర్ధారణ అయ్యిందని చెప్పారు. తనకు ఈ క్యాన్సర్ వచ్చింది అనేది, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ వాసనను పీల్చడంతోనే జరిగిందని ఆయన పిటిషన్లో వివరించారు.
వాస్తవాలకు పరిగణలోకి తీసుకోలేదు
ఫెయిర్ఫీల్డ్ కౌంటీ, కనెక్టికట్ సుపీరియర్ కోర్టు అనంతరం, బాధితుడికి రూ.126 కోట్ల పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు గురించి మాట్లాడుతూ, జాన్సన్ అండ్ జాన్సన్ వైస్ ప్రెసిడెంట్ ఎరిక్ హాస్ ట్రయల్ జడ్జి కేసుకు సంబంధించిన వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. వారి ఉత్పత్తి సురక్షితంగా ఉందని, ఆస్బెస్టాస్ క్యాన్సర్కు కారణం కాదని తెలిపారు. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు ఆరోపణలు ఇప్పటికే వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 62,000 మందికి పైగా కోర్టులో వ్యాజ్యాలు నమోదయ్యాయని సమాచారం అందింది. ఈ వ్యాజ్యాలను 9 బిలియన్ డాలర్లతో పరిష్కరించాలని కంపెనీ నిర్ణయించింది.