NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Ketan Parekh: మళ్లీ కేతన్‌ పరేఖ్‌ ప్రకంపనలు.. రూ.65.77 కోట్ల లాభాలను కొల్లగొట్టారు
    తదుపరి వార్తా కథనం
    Ketan Parekh: మళ్లీ కేతన్‌ పరేఖ్‌ ప్రకంపనలు.. రూ.65.77 కోట్ల లాభాలను కొల్లగొట్టారు
    మళ్లీ కేతన్‌ పరేఖ్‌ ప్రకంపనలు.. రూ.65.77 కోట్ల లాభాలను కొల్లగొట్టారు

    Ketan Parekh: మళ్లీ కేతన్‌ పరేఖ్‌ ప్రకంపనలు.. రూ.65.77 కోట్ల లాభాలను కొల్లగొట్టారు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 03, 2025
    08:05 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేతన్‌ పరేఖ్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. 2021 జనవరి 1 నుంచి 2023 జూన్‌ 20 మధ్య జరిగిన లావాదేవీలపై సెబీ (SEBI) నిర్వహించిన దర్యాప్తులో, అతని పాత్ర అసాధారణమైన ఫ్రంట్‌ రన్నింగ్‌ కుంభకోణంలో ఉన్నట్లు తేల్చింది.

    ఈ కుంభకోణంలో కేతన్‌ పరేఖ్‌ రూ.65.77 కోట్ల చట్టవ్యతిరేక లాభాలను పొందారని, వాటిని వెనక్కి చెల్లించాలని సెబీ ఆదేశించింది.

    ఈ వ్యవహారంలో 22 కంపెనీలకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు.

    వివరాలు 

    ఫ్రంట్‌ రన్నింగ్‌ కుంభకోణంలో కీలకపాత్ర 

    సెబీ గురువారం మధ్యంతర ఆదేశాలు జారీ చేయగా, కమలేశ్‌ వార్ష్‌నీ జారీ చేసిన ఆదేశాల్లో, రోహిత్‌ సల్గావ్‌కర్‌ (నోటిసీ నం.1), కేతన్‌ పరేఖ్‌ (నోటిసీ నం.2)లు ఈ మొత్తం కుంభకోణాన్ని నడిపారని పేర్కొన్నారు.

    వీరు ఒక పెద్ద క్లయింట్‌కు చెందిన ఎన్‌పీఐ ట్రేడింగ్‌ సమాచారాన్ని ఉపయోగించి అక్రమ లాభాలను సాధించారని వెల్లడించారు.

    అప్పుడు ఈ కార్యకలాపాలకు మధ్యవర్తిగా అకోశ్‌ కుమార్‌ పొద్దార్‌ (నోటిసీ నం.10) పనిచేశారు.

    సెబీ ఇప్పటికే నోటిసీ నం.2, 10లపై మార్కెట్లో పాల్గొనకుండా నిషేధం విధించగా, ఇప్పుడు నోటిసీ నం.1, 2, 10పై మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని ఆదేశించింది.

    వివరాలు 

    కుంభకోణం ఎలా జరిగింది? 

    ఫ్రంట్‌ రన్నింగ్‌ అనేది ట్రేడ్‌ సమాచారం ముందుగానే తెలుసుకుని దాన్ని మదుపర్లకు తెలియకుండా వాడటం.

    ఈ వ్యవహారంలో రోహిత్‌ సల్గావ్‌కర్‌ ఒక పెద్ద క్లయింట్‌కు చెందిన ట్రేడర్లతో సమీప సంబంధాలను కలిగి ఉండేవారు.

    వారు చేసే ట్రేడింగ్‌ సమాచారాన్ని రోహిత్‌ సేకరించి, కేతన్‌ పరేఖ్‌కు అందించేవారు.

    ఈ సమాచారం ఆధారంగా కేతన్‌ పరేఖ్‌ వేర్వేరు ఖాతాల ద్వారా చట్టవ్యతిరేకంగా ట్రేడింగ్‌ నిర్వహించి లాభాలు పొందేవారు.

    వివరాలు 

    సెబీ ఆదేశాల్లో వెల్లడి 

    కేతన్‌ పరేఖ్‌ గతంలో (2000లో) 14 సంవత్సరాల పాటు సెక్యూరిటీస్‌ మార్కెట్లో పాల్గొనకుండా నిషేధానికి గురయ్యారు.

    ప్రస్తుతం కోల్‌కతాలోని సంస్థల ద్వారా ఈ ఫ్రంట్‌ రన్నింగ్‌ ట్రేడ్స్‌ నిర్వహించారు.

    ఒక పెద్ద క్లయింట్‌కు సంబంధించిన 90% ట్రేడ్స్‌ కేతన్‌ ఒక్కరే నిర్వహించగా, వాట్సప్‌ ద్వారా తన బృందానికి సమాచారం అందించి, చట్టవ్యతిరేక లాభాలను పంచుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సెబీ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    సెబీ

    అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు నిర్మలా సీతారామన్
    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    మనీలాండరింగ్ కేసు విచారణలో రానా కపూర్‌కు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు   సుప్రీంకోర్టు
    అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ అదానీ గ్రూప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025