MSCI: ఎంఎస్సీఐ ఇండియా సూచీలో భారీ మార్పులు.. రూ.19 వేల కోట్ల విదేశీ పెట్టుబడుల అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
ఎంఎస్సీఐ (MSCI) ఇండియా స్టాండర్డ్ ఇండెక్స్లో త్వరలో జరగనున్న రీబ్యాలెన్సింగ్తో భారతీయ స్టాక్ మార్కెట్కు భారీగా విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు 12న మార్కెట్ ముగిసిన తర్వాత ఈ సమీక్షను ప్రకటించనుండగా, గరిష్టంగా 12 కొత్త కంపెనీల షేర్లు ఇండెక్స్లో చోటు దక్కించుకునే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మార్పులు ఖరారైతే ఆగస్టు 31, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ రీబ్యాలెన్సింగ్తో ప్యాసివ్ ఫండ్ల ద్వారా సుమారు 2.3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.19 వేల కోట్లకు పైగా) విదేశీ పెట్టుబడులు భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
వివరాలు
ఏథర్ ఎనర్జీకి మధ్యస్థ అవకాశాలు
ఈసారి ఎంఎస్సీఐ ఇండియా స్టాండర్డ్ ఇండెక్స్లో చోటు దక్కించుకునే అవకాశాలు అదానీ గ్రీన్, గ్రో (Groww),అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీలకు ఎక్కువగా ఉన్నాయని అంచనా. వీటిలో అదానీ గ్రీన్కు సుమారు 773 మిలియన్ డాలర్లు,గ్రోకు 821 మిలియన్ డాలర్లు, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్కు 342మిలియన్ డాలర్ల వరకు ప్యాసివ్ పెట్టుబడులు వచ్చే అవకాశముంది.
ఏథర్ ఎనర్జీకి మధ్యస్థ అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
అయితే,పరిశీలన కాలంలో కంపెనీ ఫ్రీ-ఫ్లోట్ అడ్జస్టెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మరింత మెరుగుపడితేనే ఇండెక్స్లో చోటు దక్కే అవకాశం ఉంటుంది.
అలాగే లెన్స్కార్ట్,స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL)కంపెనీలకు తక్కువ అవకాశాలే ఉన్నప్పటికీ, ఎంపికైతే వరుసగా 176మిలియన్ డాలర్లు,170మిలియన్ డాలర్ల మేర ప్యాసివ్ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా.
వివరాలు
ఇండెక్స్ నుంచి బయటపడే ప్రమాదం ఉన్న కంపెనీలు
మరోవైపు ప్రస్తుతం ఎంఎస్సీఐ ఇండియా స్మాల్ క్యాప్ ఇండెక్స్లో ఉన్న లారస్ ల్యాబ్స్, బయోకాన్ కంపెనీలు స్టాండర్డ్ ఇండెక్స్లోకి మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కోఫోర్జ్కు మధ్యస్థ అవకాశాలు ఉండగా, గ్లెన్మార్క్ ఫార్మా, యునో మిండా కంపెనీల ఎంపిక మాత్రం వాటి ఫ్రీ-ఫ్లోట్ అడ్జస్టెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో కొనసాగే వృద్ధిపై ఆధారపడి ఉంటుంది.
ఇక ఇండెక్స్ నుంచి బయటపడే ప్రమాదం ఉన్న కంపెనీల్లో ఆస్ట్రల్కు అవకాశాలు ఎక్కువగా ఉండగా, ఎస్బీఐ కార్డ్స్కు మధ్యస్థ, బాలకృష్ణ ఇండస్ట్రీస్కు తక్కువ అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
వివరాలు
ఈ కంపెనీలు ఇండెక్స్ నుంచి తొలగించబడితే..
ఈ కంపెనీలు ఇండెక్స్ నుంచి తొలగించబడితే, బాలకృష్ణ ఇండస్ట్రీస్ నుంచి సుమారు 167 మిలియన్ డాలర్లు, ఎస్బీఐ కార్డ్స్ నుంచి 146 మిలియన్ డాలర్లు, ఆస్ట్రల్ నుంచి 138 మిలియన్ డాలర్ల మేర ప్యాసివ్ నిధులు బయటకు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
భారత ఆర్థిక వ్యవస్థలో మారుతున్న మార్కెట్ విలువలు, పెట్టుబడిదారుల అభిరుచులకు అనుగుణంగా ఎంఎస్సీఐ ఇండెక్స్లో ఇలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.