NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / నేషనల్‌ జియోగ్రాఫిక్‌లో 19 మంది స్టాఫర్ల తొలగింపు..ఆర్థిక మాంద్యంతో మాతృసంస్థ డిస్నీ నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    నేషనల్‌ జియోగ్రాఫిక్‌లో 19 మంది స్టాఫర్ల తొలగింపు..ఆర్థిక మాంద్యంతో మాతృసంస్థ డిస్నీ నిర్ణయం
    ఆర్థిక మాంద్యం వల్లే మాతృసంస్థ డిస్నీ నిర్ణయం

    నేషనల్‌ జియోగ్రాఫిక్‌లో 19 మంది స్టాఫర్ల తొలగింపు..ఆర్థిక మాంద్యంతో మాతృసంస్థ డిస్నీ నిర్ణయం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 29, 2023
    05:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నేషనల్‌ జియోగ్రాఫిక్‌ మ్యాగజైన్‌ పలువురు ఉద్యోగులపై వేటు వేసింది. ఆర్థిక మాంద్యం కారణంగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది.

    ఈ మేరకు సంస్థలు పొదుపు సూత్రాన్ని అమలు చేస్తున్నాయి.ఈ క్రమంలోనే ఉద్యోగులపై భారీ కోతలు విధిస్తున్నారు.

    వందేళ్ల చరిత్ర ఉన్న నేషనల్‌ జియోగ్రాఫిక్‌ మ్యాగజైన్‌ లోనూ ఉద్యోగులకు కోత తప్పలేదు.

    ప్రకృతిని, ప్రపంచ అందాలను, భౌగోళిక ప్రదేశాలను చూపించే ఈ సంస్థలో తాజాగా 19 మంది స్టాఫర్లను తప్పించింది.

    ఈ మేరకు ప్రచురణనూ నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.దీంతో మ్యాగజైన్‌ పాఠకులకు అందుబాటులో ఉండదు.

    మరోవైపు ఆడియో విభాగంలోనూ కొంతమంది ఉద్యోగులను తొలగించింది. 1888లో తొలి ప్రచురణను ప్రారంభించిన నేషనల్‌ జియోగ్రాఫికల్‌ మ్యాగజైన్ చివరగా 19 స్టాఫ్ రిపోర్టర్లపై వేటు వేసింది.

    DETAILS

    డిస్నీ అధీనంలోకి వెళ్లిన నేషనల్‌ జియోగ్రాఫిక్‌ మ్యాగజైన్‌ 

    సైన్స్‌, సహజత్వాన్ని అందించేందుకే ఈ సంస్థ ముందుండేది. కొంతకాలం క్రితం ఈ సంస్థ డిస్నీ అధీనంలోకి వెళ్లిపోయింది.

    అనంతరం డిస్నీ క్రమంగా సిబ్బంది సంఖ్యను కుదిస్తూ వస్తోంది. చివరగా మిగిలిన స్టాఫ్‌ రిపోర్టర్లను సైతం తాజాగా తొలగించి చేతులు దులుపుకుంది.

    ఈ క్రమంలో సంస్థతో అనుబంధం ఉన్న పలువురు జర్నలిస్టులు సామాజిక మాధ్యమాల్లో భావోద్వేగానికి లోనయ్యారు.

    మ్యాగజైన్‌ ప్రస్తుత మాతృ సంస్థ డిస్నీ విధానపరమైన నిర్ణయాల్లో భాగంగానే నేషనల్‌ జియోగ్రాఫిక్‌ మ్యాగజైన్‌లో మరో దఫా ఉద్యోగుల తొలగింపు జరిగింది.

    తొలిసారిగా 2015లో ఆరుగురు టాప్‌ ఎడిటర్లకు పింక్ స్లిప్ ఇచ్చింది. వీడియో ఫార్మాట్ మీడియాను తట్టుకుంటూ నిలదొక్కుకునేందుకు కృషి చేసింది. ఈ క్రమంలోనే డిస్నీ స్టాఫ్‌ రిపోర్టర్లను తొలగించి ఫ్రీలాన్సర్లను నియమిస్తుండటం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉద్యోగుల తొలగింపు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఉద్యోగుల తొలగింపు

    మనుషులే కాదు రోబోలను కూడా వదలని ఉద్యోగ కోతలు గూగుల్
    8,500 మంది ఉద్యోగులను తొలగించనున్న ఎరిక్సన్ సంస్థ టెలికాం సంస్థ
    జనవరి-ఫిబ్రవరిలోనే 417 టెక్ సంస్థలు 1.2 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి టెలికాం సంస్థ
    వేమో, జనరల్ మోటార్స్, సిటీ గ్రూప్ తో పాటు మరికొన్ని సంస్థలు ప్రారంభించిన ఉద్యోగ కోతలు ఉద్యోగులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025