NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ 23,750 మార్క్‌
    తదుపరి వార్తా కథనం
    Stock Market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ 23,750 మార్క్‌
    ఫ్లాట్‌గా ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ 23,750 మార్క్‌

    Stock Market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ 23,750 మార్క్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 24, 2024
    09:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

    అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు వస్తుండడంతో, మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

    ఈ కారణంగా సూచీలు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 50 పాయింట్ల మేర పెరిగింది, అయితే నిఫ్టీ 23,750 మార్క్‌ను దాటుకొని కొనసాగుతోంది.

    ఉదయం 9:30 గంటలకు, సెన్సెక్స్ 52 పాయింట్లు పెరిగి 78,584 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 23,765 వద్ద కొనసాగుతోంది.

    సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, నెస్లే ఇండియా, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

    వివరాలు 

    స్వల్ప లాభాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు

    మరోవైపు, జొమాటో, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్లలో, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.88 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు ధర 2,630.10 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.14 వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి.

    ఆసియా-పసిఫిక్ మార్కెట్లు ఈ రోజు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) సోమవారం నికరంగా రూ.169 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.2,228 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    AP SCC Evaluation: పదో తరగతి వాల్యూయేషన్ లోపాలు.. ఏపీ బోర్డు కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్
    pak spy:పాక్‌కు సైనిక రహస్యాలు లీక్‌ చేసిన ఇంజినీర్‌.. మహారాష్ట్రలో అరెస్టు మహారాష్ట్ర
    GT vs MI Records: ఎలిమినేటర్ మ్యాచ్‌లో నమోదైన అద్భుతమైన రికార్డులివే! ముంబయి ఇండియన్స్
    Spelling Bee: అమెరికా స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతి బాలుడి ఘన విజయం భారతదేశం

    స్టాక్ మార్కెట్

    Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ ఎంత పెరిగిందంటే.. బిజినెస్
    Stock Market: రెండోరోజు ఫ్లాట్‌గానే.. దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు బిజినెస్
    Stock market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్  బిజినెస్
    Stock market today: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. 1200 పాయింట్లు డౌన్‌ అయ్యిన సెన్సెక్స్‌..  సెన్సెక్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025