Loading...
Oil Prices: అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. 95 డాలర్లకు చేరువలో చమురు ధరలు
అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. 95 డాలర్లకు చేరువలో చమురు ధరలు

Oil Prices: అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. 95 డాలర్లకు చేరువలో చమురు ధరలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2026
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు శుక్రవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే వరుసగా రెండో వారంలోనూ ధరలు పెరిగే దిశగా సాగుతున్నాయి. కీలకమైన మధ్యప్రాచ్య ప్రాంతం నుంచి చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో మార్కెట్లలో ఆందోళన నెలకొంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు నాలుగు సెంట్లు పెరిగి 93.82 డాలర్లకు చేరింది. గత సెషన్‌లో ఇది 2 శాతానికి పైగా పెరిగింది. మరోవైపు అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ ఆరు సెంట్లు తగ్గి 86.78 డాలర్ల వద్ద నమోదయ్యాయి. అంతకుముందు సెషన్‌లో WTI ధర 2.3 శాతం పెరిగింది.

వివరాలు 

యుద్ధంతో ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాకు అంతరాయం

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌పై సైనిక దాడులు ప్రారంభించిన తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

హర్ముజ్ జలసంధిలో రాకపోకలపై ఆంక్షలు ఏర్పడటంతో పాటు మధ్యప్రాచ్యంలోని ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది.

దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజవాయువు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలు ఇప్పటికీ పరిమితంగానే ఉన్నాయి.

ప్రస్తుతం కేవలం తొమ్మిది నౌకలు మాత్రమే ఈ జలమార్గం గుండా ప్రయాణిస్తున్నాయి. యుద్ధానికి ముందు ఉన్న స్థాయితో పోలిస్తే ఇది చాలా తక్కువ.

వివరాలు 

ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకుల హెచ్చరిక

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

అంతరాయం ప్రతి నెలా కొనసాగిన కొద్దీ బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు మరో 7 నుంచి 8 డాలర్లు పెరిగే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ అంచనా వేసింది.

సరఫరాకు అంతరాయం మూడు నెలల పాటు కొనసాగితే.. నెలవారీ సగటు బ్రెంట్ ధర సుమారు 114 డాలర్లకు చేరొచ్చని పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకుల హెచ్చరిక

హోర్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలకు అంతరాయం కొనసాగితే బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 120 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని గోల్డ్‌మన్ సాక్స్ కూడా హెచ్చరించింది.

అయితే తమ ప్రాథమిక అంచనా ప్రకారం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు క్రమంగా తగ్గే అవకాశముందని తెలిపింది.

నాలుగో త్రైమాసికంలో బ్రెంట్ ధర సగటున 80 డాలర్లు, వచ్చే ఏడాది 75 డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేసింది.

ADVERTISEMENT