NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / RBI: ఆర్‌బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్‌ గుప్తా నియామకం.. ఎన్‌ఎస్‌డీఎల్‌కు సెబీ రిలీఫ్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    RBI: ఆర్‌బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్‌ గుప్తా నియామకం.. ఎన్‌ఎస్‌డీఎల్‌కు సెబీ రిలీఫ్ 
    ఆర్‌బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్‌ గుప్తా నియామకం.. ఎన్‌ఎస్‌డీఎల్‌కు సెబీ రిలీఫ్

    RBI: ఆర్‌బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్‌ గుప్తా నియామకం.. ఎన్‌ఎస్‌డీఎల్‌కు సెబీ రిలీఫ్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 02, 2025
    05:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎన్‌సీఏఈఆర్ (NCAER) డైరెక్టర్ జనరల్‌గా ఉన్న పూనమ్ గుప్తా (Poonam Gupta)ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిప్యూటీ గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.

    ఈ పదవిలో ఆమె మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ తాజా నియామకాన్ని నియామకాల కేబినెట్ కమిటీ ఆమోదించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

    డిప్యూటీ గవర్నర్‌గా వ్యవహరించిన ఎండీ పాత్రా ఈ ఏడాది జనవరిలో పదవీ విరమణ చేయడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది.

    అయితే, ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశానికి ముందు ఈ కీలకమైన నియామకం జరిగింది.

    వివరాలు 

    ఎన్‌ఎస్‌డీఎల్‌కు ఉపశమనం: ఐపీఓ గడువు పెంపు 

    భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుంచి డిపాజిటరీ సంస్థ ఎన్‌ఎస్‌డీఎల్‌ (NSDL)కు ఊరట లభించింది.

    సాధారణంగా, ఈ నెల చివరి నాటికి ఐపీఓ ద్వారా రూ.3వేల కోట్లు సమీకరించాల్సిన అవసరం ఉండగా, సెబీ తాజాగా గడువును ఈ ఏడాది జులై వరకు పొడిగించింది.

    ఒక సంవత్సరం పాటు సెబీ అనుమతి ఉన్న నేపథ్యంలో, పబ్లిక్ ఇష్యూ కోసం మరింత సమయం కావాలని ఎన్‌ఎస్‌డీఎల్ కోరింది. దాన్ని పరిశీలించిన సెబీ, ఈ మేరకు గడువు పెంచుతున్నట్లు ప్రకటించింది.

    వివరాలు 

    ఐపీఓకు సన్నద్ధమవుతున్న కొత్త కంపెనీలు 

    పార్క్ మెడి వరల్డ్ లిమిటెడ్, జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ లిమిటెడ్, ప్రోజీల్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థలు తమ ప్రాథమిక షేర్ల విక్రయానికి (IPO) సిద్ధమవుతున్నాయి.

    ఈ ప్రక్రియలో భాగంగా, ఈ కంపెనీలు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ బి ఐ

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    ఆర్ బి ఐ

    RBI: ఓటీపీ, కేవైసీల మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.. ఆర్‌బీఐ హెచ్చరిక బిజినెస్
    Rs 2000 Notes: 2000 రూపాయల నోట్లకు సంబంధించి ఆర్‌బిఐ కొత్త అప్‌డేట్‌.. అదేంటంటే..! బిజినెస్
    Credit cards: నేటి నుంచి మారనున్న క్రెడిట్ కార్డు రూల్స్.. మీ క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్‌ని మీరే ఎంచుకోవచ్చు క్రెడిట్ కార్డు
    RBI: ఆ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. నిబంధనలను పాటించని హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్‌లకు భారీ జరిమానా  హెచ్‌డీఎఫ్‌సీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025