NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / SEBI backtracks: ఉద్యోగుల నిరసనతో వెనక్కి తగ్గిన సెబీ.. ఉద్యోగుల సమస్యలు అంతర్గతంగా పరిష్కారం
    తదుపరి వార్తా కథనం
    SEBI backtracks: ఉద్యోగుల నిరసనతో వెనక్కి తగ్గిన సెబీ.. ఉద్యోగుల సమస్యలు అంతర్గతంగా పరిష్కారం
    ఉద్యోగుల నిరసనతో వెనక్కి తగ్గిన సెబీ

    SEBI backtracks: ఉద్యోగుల నిరసనతో వెనక్కి తగ్గిన సెబీ.. ఉద్యోగుల సమస్యలు అంతర్గతంగా పరిష్కారం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 16, 2024
    04:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సెబీ (SEBI) సెప్టెంబర్ 4న విడుదల చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుంది. ఉద్యోగుల నుంచి వచ్చిన నిరసనల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

    కొందరు ఉద్యోగులు పని విధానంపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేయగా, సెబీ వారిపై బయటి వ్యక్తుల ప్రోద్బలం ఉందని ఆరోపిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

    అయితే, ఉద్యోగుల నిరసనలతో ఈ ప్రకటనను వెనక్కి తీసుకుంటూ, ఇకపై ఉద్యోగుల సమస్యలను అంతర్గతంగానే పరిష్కరించుకుంటామని కొత్త ప్రకటనలో స్పష్టం చేసింది.

    వివరాలు 

    అంతర్గత విషయాలు నిర్ణీత సమయాల్లో పరిష్కరించుకోవాలని నిర్ణయం 

    తాజా ప్రకటనలో సెబీ, ఉద్యోగ ప్రతినిధులతో ఇటీవల సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగిందని పేర్కొంది.

    ఇకపై సంస్థకు సంబంధించిన అన్ని అంతర్గత విషయాలు నిర్ణీత సమయాల్లో పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు తెలియజేసింది.

    సంస్థను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దడంలో ఉద్యోగుల పాత్రను ప్రశంసిస్తూ, వారి సమస్యలను అంతర్గతంగా పరిష్కరించేందుకు ఒక విధానాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించింది.

    వివరాలు 

    సెబీ చీఫ్ మాధబి పురీ బచ్‌పై వివాదాలు

    సెబీ చీఫ్ మాధబి పురీ బచ్‌పై వివాదాలు చుట్టుముట్టిన సమయంలో, సెబీ ఉద్యోగులు ఆగస్టులో కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

    లేఖలో, ఆమె బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంస్థ పనివిధానం సరిగా లేదని ఆరోపించారు.

    ఈ పరిణామాల మధ్య, సెబీ సెప్టెంబర్ 4న విడుదల చేసిన ప్రకటనలో బయటి వ్యక్తుల ప్రమేయం ఉందని ఖండించింది.

    అయితే, సెబీ కార్యాలయం వద్ద ఉద్యోగులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడంతో, ఆ ప్రకటనను ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో, తాజా ప్రకటన వెలువడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సెబీ

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    సెబీ

    అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు నిర్మలా సీతారామన్
    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    మనీలాండరింగ్ కేసు విచారణలో రానా కపూర్‌కు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు   సుప్రీంకోర్టు
    అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025