NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Sebi chief on allegations: అవన్నీ తప్పుడు ఆరోపణలు.. మౌనం వీడిన సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్‌ 
    తదుపరి వార్తా కథనం
    Sebi chief on allegations: అవన్నీ తప్పుడు ఆరోపణలు.. మౌనం వీడిన సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్‌ 
    అవన్నీ తప్పుడు ఆరోపణలు.. మౌనం వీడిన సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్‌

    Sebi chief on allegations: అవన్నీ తప్పుడు ఆరోపణలు.. మౌనం వీడిన సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 13, 2024
    04:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సెబీ చీఫ్‌ మాధవీ పురీ బచ్‌ (Madhabi Puri Buch) తనపై వచ్చిన ఆరోపణలకు తొలిసారిగా స్పందించారు.

    సెబీ చీఫ్‌గా ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలను పొందారన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

    అవి నిరాధారమైనవి, దురుద్దేశాలతో కూడినవని అన్నారు. సెబీ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తున్నానని, తన భర్త ధావల్‌ బచ్‌తో కలిసి ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు.

    ఇటీవల అదానీ గ్రూప్‌ సహా మరికొన్ని సంస్థలపై దర్యాప్తులో ఇటీవల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

    హిండెన్‌బర్గ్‌ నివేదికలో, అదానీ గ్రూప్‌పై మాధవీ చీఫ్‌గా ఉన్నప్పుడు నెమ్మదిగా దర్యాప్తు చేయడం, ఆమె భర్త పెట్టుబడులు పెట్టడమే కారణంగా పేర్కొంది.

    వివరాలు 

    పిడిలైట్‌ కంపెనీ సెబీ కిందకి రాదు 

    కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ ఆరోపణలను తెరపైకి తెచ్చి,ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి వేతనం పొందుతున్నారని, దర్యాప్తు చేస్తున్న కంపెనీల నుంచి ఆమె భర్త ధావల్‌ బచ్‌కి చెందిన కన్సల్టెన్సీ ఆదాయం పొందుతున్నారని విమర్శించింది.

    మహీంద్రా గ్రూప్‌ ధావల్‌ బచ్‌ రూ.4.78కోట్లు పొందారని ఆరోపించినప్పటికీ,ఈనియామకం మూడేళ్ల ముందే జరిగిందని మహీంద్రా చెప్పింది.

    డాక్టర్‌ రెడ్డీస్‌ కూడా రూ.6.58లక్షలు చెల్లించిందని,అవి మాధవీ సెబీ ఛైర్‌పర్సన్‌ కావడానికి ముందునుంచే జరిగాయనీ వివరించింది.

    పిడిలైట్‌ కూడా తమ కంపెనీ సెబీ కిందకి రాలేదని పేర్కొంది.ఈ ఆరోపణలపై హిండెన్‌బర్గ్‌ ఇంకా స్పందించలేదు కానీ,ఈ ఉమ్మడి ప్రకటనతో ఈ అంశాలపై వారు వివరణ ఇచ్చారు.

    వారి ఆదాయపు పన్ను రిటర్నుల ఆధారంగా ఆరోపణలు చేయడం తప్పని, అది గోప్యతా ఉల్లంఘనగా పేర్కొన్నారు.

    వివరాలు 

    ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆదాయంపై వివరణ 

    ధావల్‌ బచ్‌పై కూడా మహీంద్రా,ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌,పిడిలైట్‌ వంటి కంపెనీల నుంచి సేవలు అందించినందుకు ఆయన కన్సల్టెన్సీకి చెల్లింపులు చేశారని వివరించారు.

    ఆయన వృత్తి నైపుణ్యాలను తప్పుగా అర్ధం చేసుకోవడం బాధాకరమని,ధావల్‌ బచ్‌ 35 సంవత్సరాల అనుభవంతో ఐఐటీ దిల్లీ ఇంజినీర్‌గా ఉన్నారని పేర్కొన్నారు.

    ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆదాయంపై కూడా మాధవీ బచ్‌ వివరణ ఇచ్చారు.ఉద్యోగ విరమణ తర్వాత 10 సంవత్సరాల పాటు స్టాక్‌ ఆప్షన్‌లు ఉపయోగించుకోవచ్చని వివరించారు.ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నుంచి ఆమె యాన్యుటీ పొందుతున్నారని చెప్పారు.

    అద్దె ఆదాయంపై కూడా వోకార్డ్‌ అసోసియేట్‌కు ప్రాపర్టీ అద్దెకివ్వడం ద్వారా వచ్చిన ఆదాయంపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.

    సెబీ ఆ కంపెనీపై ఎలాంటి దర్యాప్తు చేయలేదని,మార్కెట్‌ నిబంధనల ప్రకారం అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నామని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సెబీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    సెబీ

    అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు నిర్మలా సీతారామన్
    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    మనీలాండరింగ్ కేసు విచారణలో రానా కపూర్‌కు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు   సుప్రీంకోర్టు
    అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025