NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Madhabi Puri Buch: సెబీ ఛైర్‌పర్సన్‌ మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించిన షార్ట్‌సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ 
    తదుపరి వార్తా కథనం
    Madhabi Puri Buch: సెబీ ఛైర్‌పర్సన్‌ మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించిన షార్ట్‌సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ 
    సెబీ ఛైర్‌పర్సన్‌ మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించిన షార్ట్‌సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌

    Madhabi Puri Buch: సెబీ ఛైర్‌పర్సన్‌ మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించిన షార్ట్‌సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 11, 2024
    10:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సెబీ ఛైర్‌పర్సన్ మాధవి పురీ బుచ్ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.తాజా ఆరోపణలపై షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ స్పందించింది.

    "మాధవిపై ఆరోపణలు వచ్చినా, ఆమె ఇంకా మౌనంగానే ఉంటోంది" అని బుధవారం హిండెన్‌బర్గ్ ఎక్స్‌లో పేర్కొంది.

    హిందెన్‌బర్గ్ తెలిపిన వివరాల ప్రకారం, "మాధవికి 99 శాతం వాటాలున్న కన్సల్టింగ్ సంస్థ అనేక లిస్టెడ్ కంపెనీల నుంచి చెల్లింపులను స్వీకరించింది. ఈ కంపెనీలను సెబీ నియంత్రిస్తుంటుందన్న విషయం తెలిసిందే

    మాధవి సెబీ పూర్తిస్థాయి సభ్యురాలిగా ఉన్న సమయంలో ఈ చెల్లింపులు జరిగాయి.ఇందులో మహీంద్రా అండ్ మహీంద్రా,ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, పిడీలైట్ ఉన్నాయి.

    ప్రస్తుతం ఆరోపణలు మొత్తం ఆమె భారతీయ కన్సల్టింగ్ కంపెనీపైనే వస్తున్నాయి. సింగపుర్‌లోని సంస్థ వివరాలు ఇంకా బయటపడలేదు" అని పేర్కొంది.

    వివరాలు 

    మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి రూ.4.78కోట్ల ఆదాయం పొందిన  దావల్

    ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆరోపణల ప్రకారం,మాధవి ప్రమోట్ చేసే సంస్థ రూ.3కోట్ల ఆదాయాన్ని సంపాదించిందని,ఇందులో ఎక్కువగా మహీంద్రా నుంచి వచ్చినట్లు తెలిపింది.

    మాధవి సెబీలో పూర్తిస్థాయి సభ్యురాలిగా ఉన్నప్పుడు ఈ ఆదాయం పొందినట్లు పేర్కొంది.

    అదే విధంగా,మాధవి భర్త దావల్,మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి రూ.4.78కోట్ల ఆదాయం పొందాడని కాంగ్రెస్ తెలిపింది.

    "మాధవి సెబీ బోర్డులో పూర్తిస్థాయి సభ్యురాలిగా ఉన్న సమయంలోనే ఆమె భర్త ఈ ఆదాయాన్ని పొందాడు"అని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా ఆరోపించారు.

    మరోవైపు, మహీంద్రా కంపెనీ ఈ ఆరోపణలను ఖండించింది."ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని ఇవి తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి"అని పేర్కొంది.

    మహీంద్రా తెలిపిన వివరాల ప్రకారం,ఆమె భర్త గతంతో పాటు ఇప్పటికి కూడా తమతో పనిచేస్తున్నట్లు పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హిండెన్‌బర్గ్‌
    సెబీ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    హిండెన్‌బర్గ్‌

    ఓసీసీఆర్‌పీ సంచలన ఆరోపణలను కొట్టేసిన అదానీ గ్రూప్.. అవన్నీ కట్టుకథలేనని వెల్లడి అదానీ గ్రూప్
    హిండెన్‌బర్గ్ అంచనా లెక్కలే నిజమవుతున్నాయి.. 85 శాతానికి తగ్గిన అదానీ టోటల్ గ్యాస్ స్టాక్ అదానీ గ్రూప్
    Hindeburg:  హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌కు సెబీ షోకాజ్ నోటీసు సెబీ
    Sebi chairperson Madhabi Puri Buch: హిండెన్‌బర్గ్‌ ఆరోపణలను కొట్టిపారేసిన సెబీ చీఫ్‌  బిజినెస్

    సెబీ

    అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు నిర్మలా సీతారామన్
    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    మనీలాండరింగ్ కేసు విచారణలో రానా కపూర్‌కు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు   సుప్రీంకోర్టు
    అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025