LOADING...
Deputy CM: ఉప్పాడ మత్స్యకారుల కోసం సమగ్ర అభివృద్ధి ప్రణాళిక: పవన్ కళ్యాణ్ 
ఉప్పాడ మత్స్యకారుల కోసం సమగ్ర అభివృద్ధి ప్రణాళిక: పవన్ కళ్యాణ్

Deputy CM: ఉప్పాడ మత్స్యకారుల కోసం సమగ్ర అభివృద్ధి ప్రణాళిక: పవన్ కళ్యాణ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2026
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉప్పాడ తీరప్రాంతంలోని మత్స్యకారుల సమగ్ర అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ తెలిపారు. త్వరలో పిఠాపురం పర్యటన సందర్భంగా ఈ ప్రణాళికను అధికారికంగా ప్రకటించే ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. స్పష్టమైన లక్ష్యాలతో రూపొందించిన ఈ కార్యాచరణ ద్వారా ఉప్పాడ తీరప్రాంత మత్స్యకారుల జీవన విధానంలో సానుకూల మార్పులు చోటుచేసుకుని, వారి భవిష్యత్తు మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ విషయాలను వివరించారు.

వివరాలు 

కాలుష్య నియంత్రణ నుంచి ప్రత్యామ్నాయ ఉపాధి వరకు కీలక చర్యలు

గత ఏడాది అక్టోబరు 9న కాకినాడ కలెక్టరేట్‌లో మత్స్యకారులతో సమావేశమై, వారు ప్రస్తావించిన ప్రతి సమస్యపై లోతుగా చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించినట్లు చెప్పారు. తీర ప్రాంత కాలుష్య నియంత్రణ, సముద్రపు కోత నివారణ, మత్స్య సంపద పెంపు, ఆధునిక పద్ధతుల్లో చేపల వేటకు ప్రోత్సాహం, మార్కెటింగ్ సౌకర్యాల మెరుగుదల, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు వంటి అన్ని అంశాలను ఈ ప్రణాళికలో సమగ్రంగా చేర్చినట్లు వివరించారు. అదనంగా, ఆ ప్రాంత గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, వ్యవసాయ ప్రోత్సాహం, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల సృష్టి వంటి విషయాలనూ ప్రణాళికలో భాగం చేసినట్లు పేర్కొన్నారు.

వివరాలు 

ఆర్‌అండ్‌బీ శాఖలో పునర్వ్యవస్థీకరణ: శ్రీ సత్యసాయి జిల్లాకు హిందూపురం కొత్త డివిజన్ ఏర్పాటు

ఇక రోడ్లు,భవనాల శాఖ పరిధిలో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా శ్రీ సత్యసాయి జిల్లాలో కొత్తగా హిందూపురం డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ధర్మవరం డివిజన్‌ పరిధిలో ధర్మవరం,కదిరి,పెనుకొండ,మడకశిర సబ్‌డివిజన్లు కలిపి మొత్తం 2,486.08కి.మీ పరిధి ఉంది. తాజా మార్పుల ప్రకారం ఇకపై ధర్మవరం డివిజన్‌లో ధర్మవరం,కదిరి సబ్‌డివిజన్లు మాత్రమే కొనసాగుతాయి. కొత్తగా ఏర్పాటైన హిందూపురం డివిజన్‌లో పెనుకొండ,మడకశిర సబ్‌డివిజన్లు చేర్చబడగా,మొత్తం 1,336.22కి.మీ పరిధి దాని కిందికి వస్తుంది. మరోవైపు అనంతపురం జిల్లాలో ఉన్న కళ్యాణదుర్గం డివిజన్‌ను రద్దు చేసి,దానిని అనంతపురం డివిజన్‌లో విలీనం చేశారు. దీంతో కళ్యాణదుర్గం డివిజన్‌లో ఉన్న ఈఈ హోదా,అక్కడి 24మంది సిబ్బంది పోస్టులను కొత్తగా ఏర్పాటైన హిందూపురం డివిజన్‌కు బదిలీ చేశారు.

Advertisement