Loading...
HS Prannoy: తైపీ ఓపెన్‌లో ప్రణయ్‌ శుభారంభం.. జపాన్‌ షట్లర్‌పై సునాయాస విజయం
తైపీ ఓపెన్‌లో ప్రణయ్‌ శుభారంభం.. జపాన్‌ షట్లర్‌పై సునాయాస విజయం

HS Prannoy: తైపీ ఓపెన్‌లో ప్రణయ్‌ శుభారంభం.. జపాన్‌ షట్లర్‌పై సునాయాస విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2026
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

తైపీ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్‌ 'హెచ్‌ఎస్‌ ప్రణయ్‌' విజయంతో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన ప్రణయ్‌, జపాన్‌కు చెందిన 'మినొరు కొగా'పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. కేవలం 35 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో 21-11, 21-14 స్కోరుతో వరుస గేమ్‌ల్లో విజయం సాధించి రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి నుంచి ప్రణయ్‌కు పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. తదుపరి రౌండ్‌లో అతడు హాంకాంగ్‌కు చెందిన జేసన్‌ గునావాన్‌తో తలపడనున్నాడు. అయితే మరో భారత షట్లర్‌ మిథున్‌ మంజునాథ్‌కు తొలి రౌండ్‌లోనే నిరాశ ఎదురైంది.

వివరాలు

తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన రౌనక్‌ చౌహాన్

జేసన్‌ గునావాన్‌తో జరిగిన మ్యాచ్‌లో '18-21, 4-21' తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

ఇక భారత ఆటగాళ్లు కిరణ్‌ జార్జి, తరుణ్‌ మన్నేపల్లి కూడా అద్భుత విజయాలతో రెండో రౌండ్‌కు చేరుకున్నారు.

కిరణ్‌ జార్జి మలేసియాకు చెందిన వాంగ్‌ పో వీయ్‌ను 21-10, 21-18తో ఓడించగా, తరుణ్‌ మన్నేపల్లి కొరియాకు చెందిన జియాన్‌ జిన్‌పై 21-12, 21-15తో గెలిచి తన ప్రచారాన్ని విజయవంతంగా ప్రారంభించాడు.

మరోవైపు రౌనక్‌ చౌహాన్‌కు తొలి రౌండ్‌లోనే టోర్నీ ముగిసింది.

ఇండోనేసియాకు చెందిన రిచీ రికార్డో చేతిలో 14-21, 16-21 స్కోరుతో ఓడిపోయాడు.

వివరాలు

మహిళల సింగిల్స్‌లోనూ భారత షట్లర్ల హవా

మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన 'ఉన్నతి హుడా' కూడా విజయంతో రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది.

తొలి రౌండ్‌లో 'చైనీస్‌ తైపీకి చెందిన పీయూ వాంగ్‌పై 21-12, 21-18తో' విజయం సాధించింది.

రెండో రౌండ్‌లో ఆమెకు సహచర భారత షట్లర్‌ 'తన్యా హేమంత్‌తో' పోరు ఎదురుకానుంది. తన్యా హేమంత్‌ కూడా తొలి రౌండ్‌లో ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించింది.

చైనీస్‌ తైపీకి చెందిన **వెన్‌ సుపై 21-16, 14-21, 21-16తో** గెలిచి రెండో రౌండ్‌కు చేరుకుంది.

ADVERTISEMENT

వివరాలు

రెండో రెండ్ కు అర్హత

భారత్‌కు చెందిన దేవిక సిహాగ్‌, తన్వి శర్మ, అన్మోల్‌ కూడా తొలి అడ్డంకిని విజయవంతంగా దాటారు.

దేవిక కొరియాకు చెందిన గా పార్క్‌పై 14-21, 21-7, 21-15తో విజయం సాధించగా, తన్వి శర్మ భారత ఆటగాళ్ల మధ్య జరిగిన పోరులో తస్నీమ్‌ మీర్‌ను 21-16, 22-20తో ఓడించింది.

అన్మోల్‌, అమెరికాకు చెందిన ఇషిక జైస్వాల్‌పై 21-15, 11-21, 21-19తో గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.

అయితే శ్రేయాంశి వలిశెట్టికి మాత్రం తొలి రౌండ్‌లోనే నిరాశ ఎదురైంది. థాయ్‌లాండ్‌కు చెందిన 'సుపనిద' చేతిలో 11-21, 12-21తో ఓటమి చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

మొత్తం మీద తొలి రోజు భారత షట్లర్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ పలువురు రెండో రౌండ్‌కు అర్హత సాధించడం విశేషం.

ADVERTISEMENT