అదానీ గ్రూప్: వార్తలు

Adani Ports: మరో పోర్టును సొంతం చేసుకున్న గౌతమ్ అదానీ.. పోర్ట్ విలువ రూ. 3,350 కోట్లు 

హోలీ రోజున గౌతమ్ అదానీకి సంబంధించిన పెద్ద వార్త బయటకు వచ్చింది. రూ.3350 కోట్లతో తన పేరిట మరో పోర్టును సొంతం చేసుకున్నారు.

17 Jan 2024

తెలంగాణ

Adani Group : తెలంగాణలో రూ.12,000 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టనున్న అదానీ గ్రూప్ 

అదానీ గ్రూప్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి బహుళ రంగాలలో రూ.12,400 కోట్ల ($1.49 బిలియన్లు)పెట్టుబడి పెట్టడానికి నాలుగు ఒప్పందాలను కుదుర్చుకుంది.

10 Jan 2024

గుజరాత్

Gautam Adani: గుజరాత్‌లో గౌతమ్ అదానీ రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు..లక్ష ఉద్యోగాలు కల్పనకు హామీ 

గుజరాత్‌లో వచ్చే ఐదేళ్లలో గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక రంగాల్లో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు అదానీ గ్రూప్ బుధవారం వెల్లడించింది.

Adani Group: తమిళనాడులో రూ.42,700 కోట్ల పెట్టుబడులకు అదానీ గ్రూప్‌ ఒప్పందం 

గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2024లో రూ. 42,700 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడుల కోసం తమిళనాడుతో అదానీ గ్రూప్ అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది.

Gautam Adani : పవర్ రంగంలో వేగంగా విస్తరిస్తున్న అదానీ.. గ్రూప్'లోకి వచ్చి చేరిన మరో కంపెనీ 

అదానీ గ్రూప్ విద్యుత్ రంగంలోకి వేగంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే గౌతమ్ అదానీ మరో కంపెనీని విజయవంతంగా ఒడిసిపట్టింది.

Ambuja Cements: గ్రీన్ పవర్ ప్రాజెక్టుల్లో అంబుజా సిమెంట్స్ రూ.6,000 కోట్ల పెట్టుబడి 

బిలియనీర్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గ్రూప్‌కు చెందిన సిమెంట్ కంపెనీ అంబుజా సిమెంట్స్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.

Adani group: దూసుకుపోయిన అదానీ గ్రూప్ షేర్లు.. రూ.13.3 లక్షల కోట్లు దాటిన కంపెనీ విలువ 

గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్లు మంగళవారం కూడా స్టాక్ మార్కెట్‌లో దూసుకుపోయాయి.

Fire accident: అదానీ ఆయిల్ గోదాంలో అగ్ని ప్రమాదం.. బాంబుల్లా పేలుతున్న నూనే, నెయ్యి డబ్బాలు 

ఉత్తర్‌ప్రదేశ్‌ సహరాన్‌పూర్‌లోని అదానీ గ్రూప్ కంపెనీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.

Adani group: అదానీ ఎంటర్ ప్రైజెస్ లాభం 51శాతం క్షీణత 

అదానీ గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది.

హిండెన్‌బర్గ్ అంచనా లెక్కలే నిజమవుతున్నాయి.. 85 శాతానికి తగ్గిన అదానీ టోటల్ గ్యాస్ స్టాక్

అదానీ గ్రూప్ విషయంలో హిండెన్‌బర్గ్ రిపోర్ట్ నిజమవుతోంది. ఈ మేరకు టోటల్ గ్యాస్ షేర్లలో 85 శాతానికి తగ్గిపోయింది.

అదానీ బొగ్గు కుంభకోణం వల్లే విద్యుత్ ధరలు పెరిగాయ్: రాహుల్ గాంధీ విమర్శలు 

అదానీ గ్రూప్ బొగ్గు దిగుమతులను ఓవర్ ఇన్‌వాయిస్ చేసిందని, దీంతో విద్యుత్ ధరలు పెరిగాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో వాటాను 5శాతానికి పెంచుకున్న ఐహెచ్‌సీ 

అబుదాబికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (IHC) బిలియనీర్ గౌతమ్ అదానీ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో తన వాటాను 5శాతానికి పైగా పెంచుకుంది.

భారీ నష్టాలకు అదానీ షేర్లను విక్రయిస్తున్న ఐహెచ్ సీ

అదానీ గ్రూప్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ పీజేఎస్సీ (IHC) భారీ నష్టాలకు తమ షేర్లను విక్రయించనుంది.

ఓసీసీఆర్‌పీ సంచలన ఆరోపణలను కొట్టేసిన అదానీ గ్రూప్.. అవన్నీ కట్టుకథలేనని వెల్లడి

అదానీ గ్రూప్ పై ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) రూపొందించిన సంచలన రిపోర్ట్ బహిర్గతంపై అదానీ గ్రూప్ స్పందించింది.ఓసీసీఆర్పీ ప్రకటించిన నివేదిక కట్టుకథలేనంటూ కొట్టిపారేసింది.

29 Aug 2023

సెబీ

అదానీ గ్రూప్ షేర్లలో షార్ట్ సెల్లింగ్ వల్ల 12 సంస్థలు లాభపడ్డాయి: రిపోర్ట్ 

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు),విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) సహా దాదాపు డజను కంపెనీలు, అదానీ గ్రూప్ షేర్లలో షార్ట్ సెల్లింగ్‌లో "అగ్ర లబ్ధిదారులు"గా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) గుర్తించిందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.

భారత కార్పొరేట్లకు మరో షాక్.. హిండెన్‌బర్గ్‌ తరహాలో మరో నివేదిక 

భారత పారిశ్రామిక దిగ్గజాలకు (కార్పొరేట్లకు) హిండెన్‌బర్గ్‌ మాదిరి షాక్‌ తగలనుంది. ఈ మేరకు నిర్దిష్ట కంపెనీల్లో చోటు చేసుకున్న అవకతవకలను ఓసీసీఆర్‌పీ(OCCRP) బయటపెట్టనుంది.

అదానీ గంగవరం పోర్టు ముట్టడి ఉద్రిక్తతం.. 9 డిమాండ్లు నేరవేర్చాలని యూనియన్ పట్టు

విశాఖపట్టణంనగరంలోని అదానీ గంగవరం పోర్టు కార్మికులు కదం తొక్కారు. ఈ మేరకు యాజమాన్యానికి 9 డిమాండ్లతో కూడిన షరతును విధించారు.

14 Aug 2023

సెబీ

అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ

అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలకు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తన తుది నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

అదానీ కంపెనీలో మరోసారి బిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్స్ కొన్న 'జీక్యూజీ' 

గౌతమ్ అదానీ కంపెనీలో అమెరికాకు చెందిన 'జీక్యూజీ' భాగస్వాముల పెట్టుబడలు భారీగా పెరిగాయి.

టార్గెట్ చేసి తప్పుడు ఆరోపణలు చేశారు; హిండెన్‌బర్గ్ నివేదిక‌పై గౌతమ్ అదానీ

అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జనవరిలో అదానీ గ్రూప్‌పై ఇచ్చిన నివేదికపై చైర్మన్ గౌతమ్ అదానీ స్పందించారు.

దూసుకుపోతున్న అదానీ గ్రూప్ స్టాక్స్‌; రూ.10లక్షల కోట్లు దాటిన మార్కెట్ విలువ

హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల విషయంలో గౌతమ్ అదానికి చెందిన అదానీ గ్రూప్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

'హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలకు ఆధారల్లేవు'; అదానీ గ్రూప్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ 

అదానీ గ్రూప్‌కు శుక్రవారం సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల బృందం క్లీన్‌చిట్ ఇచ్చింది.

28 Apr 2023

అమెరికా

అదానీ గ్రూప్‌లో గతంలో కంటే ఎక్కువ మంది రుణదాతలు

అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదక తర్వాత గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ పరిస్థితి దారుణంగా తయారైంది. అదానీ గ్రూప్ షేర్ల విలువ అమాంతం పడిపోయింది.

సావర్కర్, అదానీలకు పవార్ మద్దతు; 'హిండెన్‌బర్గ్'పై జేపీసీ అనవసరమని వ్యాఖ్య

సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యయి. అలాగే అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన రిపోర్ట్ సంచలనంగా మారింది.

01 Apr 2023

ప్రకటన

అదానీ గ్రూప్ ఆఫ్‌షోర్ ఒప్పందాలను పరిశీలించనున్న సెబీ

గౌతమ్ అదానీ సోదరుడితో లింక్‌లు ఉన్న కనీసం మూడు ఆఫ్‌షోర్ సంస్థలతో అదానీ గ్రూప్ లావాదేవీలలో 'సంబంధిత పార్టీ' లావాదేవీ నిబంధనల ఉల్లంఘనపై భారతదేశ మార్కెట్ రెగ్యులేటర్ దర్యాప్తు చేస్తోంది.

29 Mar 2023

ప్రకటన

పడిపోతున్నషేర్ల వలన రుణ చెల్లింపు ఆందోళనలపై వచ్చిన నివేదికలను ఖండించిన అదానీ

అదానీ గ్రూప్ కు మళ్ళీ సమస్యలు మొదలయ్యాయి, మీడియా నివేదికలు ఆ సంస్థ రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ప్రశ్నించాయి.

24 Mar 2023

లోక్‌సభ

గందరగోళం మధ్య ఆర్థిక బిల్లు 2023ను ఆమోదించిన లోక్‌సభ

అదానీ గ్రూప్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) దర్యాప్తు కోసం ప్రతిపక్షాలు ఒత్తిడిని కొనసాగించినప్పటికీ, మార్చి 24న లోక్‌సభ ఆర్థిక బిల్లు 2023ని సవరణలతో ఆమోదించింది.

మరో కొత్త నివేదికను విడుదల చేయనున్న హిండెన్‌బర్గ్

అదానీ గ్రూప్‌పై నివేదికను విడుదల చేసిన US-ఆధారిత షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరో కొత్త నివేదికను అందించనుంది. అయితే దాని గురించి ఎలాంటి వివరాలను ప్రకటించకుండా మరో పెద్ద నివేదిక అని మాత్రం పేర్కొంది.

NSE మూడు అదానీ గ్రూప్ స్టాక్స్‌పై ఎందుకు నిఘా పెట్టింది

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత జరిగిన అపజయం తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ రికవరీ బాటలో ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మూడు అదానీ స్టాక్‌లను స్వల్పకాలిక అదనపు నిఘా యంత్రాంగం (ASM) కింద ఉంచింది.

07 Mar 2023

ప్రకటన

7,000 కోట్ల విలువైన రుణాలను ముందస్తుగా చెల్లించిన అదానీ గ్రూప్

US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ 10 లిస్టెడ్ కంపెనీలలో మార్కెట్ నష్టాలకు దారితీసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు రుణాన్ని తగ్గించడంపై దృష్టి సారించడం ప్రారంభించింది.

అదానీ బ్లాక్ డీల్‌లో రూ.15,000 కోట్లు పెట్టుబడి పెట్టిన స్టార్ ఇన్వెస్టర్ రాజీవ్ జైన్

అమెరికాకు చెందిన గ్లోబల్ ఈక్విటీ-ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, GQG పార్టనర్స్‌కు బ్లాక్ డీల్‌లో దాని ప్రమోటర్లు రూ. 15,446 కోట్ల విలువైన వాటాలను అమ్మిన తర్వాత అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్లు శుక్రవారం పెరిగాయి. ఈ సందర్భంగా పెట్టుబడిదారు, GQG పార్టనర్స్, దాని ఛైర్మన్ రాజీవ్ జైన్ గురించి మార్కెట్లో చర్చ మొదలైంది.

మధ్యతరగతి ఇన్వెస్టర్ల డబ్బును కొల్లగొట్టడం దురదృష్టకరం; హిండెన్‌బర్గ్‌పై హరీష్ సాల్వే ఫైర్

అదానీ గ్రూప్ సంస్థలను టార్గెట్ చేసి, గత నెలలో మార్కెట్ ఒడిదుడుకులకు దారితీసిన అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీనియర్ న్యాయవాది, మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే కోరారు.

హిండెన్‌బర్గ్ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాన్ని స్వాగతించిన గౌతమ్ అదానీ

అదానీ గ్రూప్ కంపెనీల్లో భారీ స్టాక్ రూట్‌కు కారణమైన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై కొనసాగుతున్న విచారణపై సుప్రీం కోర్టు ఆదేశాలను వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ గురువారం స్వాగతించారు.

'అదానీ-హిండెన్‌బర్గ్' వ్యవహారంపై దర్యాప్తుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

అదానీ-హిండెన్‌బర్గ్ ఎపిసోడ్‌పై దర్యాప్తునకు సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. దర్యాప్తు చేసేందుకు రిటైర్డ్ జడ్జి ఏఎం సప్రే నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అంశంపై రెండు నెలల్లోగా నివేదికను అందించాలని ఆదేశించింది.

01 Mar 2023

ప్రకటన

అదానీ గ్రూప్ స్టాక్స్ రికవరీ మార్గంలో ఉన్నాయా

ఈ ఏడాది జనవరిలో, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వలన అదానీ గ్రూప్ స్టాక్‌లు ఘోరంగా పతనమయ్యాయి. ఒక నెలకు పైగా పతనమయ్యాక ఈ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు చివరకు రికవరీ సంకేతాలను చూపిస్తున్నాయి.

24 Feb 2023

ప్రకటన

పెట్టుబడిదారుల కోసం ఆసియాలో రోడ్‌షో నిర్వహించనున్న అదానీ గ్రూప్

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తరవాత అదానీ గ్రూప్ స్టాక్‌లు, బాండ్లపై పెట్టుబడిదారుల విశ్వాసం సన్నగిల్లింది. నివేదిక ప్రతికూల ప్రభావాలపై పోరాడే ప్రయత్నంలో వచ్చే వారం ఆసియాలో అదానీ గ్రూప్ స్థిర-ఆదాయ రోడ్‌షోను నిర్వహిస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌: త్వరలోనే అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల పనులు ప్రారంభం- 2028నాటికి పూర్తి చేయడమే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాలోని చిత్రావతి రిజర్వాయర్‌ వద్ద అదానీ గ్రూప్‌ చేపట్టనున్న 500మెగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజీ హైబ్రిడ్‌ గ్రీన్‌‌ఎనర్జీ ప్రాజెక్టు నివేదిక తుది దశకు చేరుకుందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ జిల్లా మేనేజర్ కోదండరామమూర్తి తెలిపారు.

అదానీ స్టాక్స్‌లో పెట్టి నష్టపోయినవారు ITR ఫైలింగ్ సమయంలో ఇలా చేయండి

గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ జనవరిలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత దారుణమైన పతనానికి గురైంది. 100 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ కోల్పోవడంతో పెట్టుబడిదారులు భారీ నష్టాలను చవిచూశారు.

#NewsBytesప్రత్యేకం: 2022లో తమ అదృష్టాన్ని కోల్పోయిన ప్రపంచ బిలియనీర్లు

కొంతమందికి 2022 పెద్దగా కలిసిరాలేదు, అత్యంత ధనవంతులు 2022లో తమ స్థానాన్ని కొనసాగించలేకపోయారు. స్థానాన్ని కోల్పోయిన కొంతమంది బిలియనీర్లను చూద్దాం.

ప్రధాని మోదీ తండ్రి పేరును అపహాస్యం చేస్తే దేశం క్షమించదు: హిమంత శర్మ

అదానీ-హిండెన్‌బర్గ్ వివాదానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ పేరు, ఆయన తండ్రి పేరును కాంగ్రెస్ నాయకులు అపహాస్యం చేస్తున్నారని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌సభ్యుల భయంకరమైన వ్యాఖ్యలను దేశం క్షమించదని శర్మ పేర్కొన్నారు.

$50 బిలియన్ల దిగువకు పడిపోయిన గౌతమ్ అదానీ నికర విలువ

బిలియనీర్ గౌతమ్ అదానీ నికర విలువ సోమవారం $50 బిలియన్ల దిగువకు పడిపోయింది, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో అప్డేట్ చేసిన డేటా ప్రకారం అతని మొత్తం సంపద ఇప్పుడు 49.1 బిలియన్ డాలర్లు.

మోదీని విమర్శించిన ఇన్వస్టర్ జార్జ్ సోరోస్‌కు జైశంకర్ గట్టి కౌంటర్

అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై పెట్టుబడిదారుల ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మండిపడ్డారు.

అదానీ గ్రూప్ వ్యవహారంపై కేంద్రానికి గట్టి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

అదానీ గ్రూప్ హిండెస్ బర్గ్ నివేదిక వివాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. నివేదికను పరిశీలించేందుకు కమిటీలో కేంద్ర ప్రభుత్వం సీల్డ్ కవర్లో సూచించే నిపుణుల పేర్లను చేర్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సీజెఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.

13 Feb 2023

ఆదాయం

ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్

అదానీ గ్రూప్ తన ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించింది మరియు మూలధన వ్యయాన్ని కూడా తగ్గించుకోవాలని ఆలోచిస్తుందని ఒక నివేదిక పేర్కొంది.

అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు

US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక తర్వాత ఒత్తిడిలో ఉన్న అదానీ గ్రూప్‌కు ఇది కీలకమైన వారం. దానికి కారణం మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) బోర్డు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై, అదానీ గ్రూప్ ఉపసంహరించుకున్న సెకండరీ షేర్ అమ్మకంపై జరిపిన దర్యాప్తు గురించి సమాచారాన్ని అందజేస్తుంది.

మళ్ళీ నష్టాల బాట పట్టిన అదానీ గ్రూప్ స్టాక్స్

ఇండెక్స్ ప్రొవైడర్ MSCI (మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్) కొన్ని అదానీ గ్రూప్ స్టాక్‌ల ఫ్రీ-ఫ్లోట్ స్టేటస్‌ను సమీక్షిస్తామని చెప్పిన తర్వాత అదానీ విల్మార్ మినహా గ్రూప్‌లోని అన్ని లిస్టెడ్ కంపెనీలు గురువారం నష్టాల్లో ముగిశాయి.

09 Feb 2023

ఆదాయం

తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు

హిమాచల్ ప్రదేశ్‌లోని అదానీ విల్మార్ పై రాష్ట్ర ఎక్సైజ్ పన్నుల శాఖ దాడులు నిర్వహించినట్లు అదానీ విల్మార్ గురువారం ప్రకటన విడుదల చేసింది. జీఎస్టీ ఉల్లంఘనల కారణంగానే ఈ దాడి జరిగిందని మీడియా నివేదించగా, ఎలాంటి అవకతవకలు జరగలేదని కంపెనీ పేర్కొంది.

సుప్రీంకోర్టుకు అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం, రేపు విచారణ

షార్ట్ షెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై 'కుట్ర'కు పాల్పడిందంటూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పీఐఎల్)పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. న్యాయవాదులు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ పీఐఎల్‌లు దాఖలు చేశారు.

09 Feb 2023

ఆదాయం

అదానీ గ్రూప్ పతనం ప్రభావం దేశీయ రుణదాతలపై లేదంటున్న ఆర్ బి ఐ

స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఒక నివేదికను ప్రచురించినప్పటి నుండి అదానీ గ్రూప్ పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ సంస్థ ఆకాశాన్నంటుతున్న అప్పులను కూడా నివేదిక ఎత్తి చూపింది. ఇప్పుడు, రెగ్యులేటర్లు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు దేశీయ బ్యాంకులకు మద్దతుగా నిలిచాయి.

రుణాలని ముందుగా చెల్లించి మూలధన వ్యయాన్ని తగ్గించుకొనున్న అదానీ గ్రూప్

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికతో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల విలువలో సగానికి పైగా నష్టపోయింది. ఆ నష్ట నివారణ చర్యల దిశగా అదానీ గ్రూప్ పనిచేస్తుంది. మల్టీ-ప్రోంగ్ విధానం ద్వారా పెట్టుబడిదారుల ఆందోళనలకు జవాబు ఇవ్వాలని ఆలోచిస్తుంది.

అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ

అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై నిజానిజాలు తేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మోసం, స్టాక్ మానిప్యులేషన్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌పై పార్లమెంట్‌లో చర్చ జరగాలన్నారు.

ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ

ప్రపంచంలోని ఫోర్బ్స్ ప్రపంచ రియల్-టైమ్ బిలియనీర్ల జాబితాలో టాప్ 20 సంపన్నుల జాబితాలో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తన స్థానాన్ని కోల్పోయారు. US షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై చేసిన నివేదిక ఆ సంస్థ స్టాక్స్ ను దారుణంగా పడిపోయేలా చేసింది. శుక్రవారం 22వ స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ సంపద 21.77 శాతం అంటే 16.2 బిలియన్ డాలర్లు క్షీణించింది.

మరిన్ని ఇబ్బందుల్లోకి అదానీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్

బొగ్గు ఉత్పత్తి చేసే విద్యుత్ ధర ఖరీదు ఎక్కువ కావడంతో అదానీ పవర్ లిమిటెడ్‌తో 2017 విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలని బంగ్లాదేశ్ కోరింది. ఒప్పందాన్ని సవరించాలని కోరుతూ భారతీయ కంపెనీతో కమ్యూనికేట్ చేసామని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ (BPDC) అధికారి తెలిపారు.

అదానీ గ్రూప్ లో 3 సంస్థలను పరిశీలిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి

పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వడానికి భారతీయ బిలియనీర్ అదానీ చేసిన ప్రయత్నం విఫలమైంది గౌతమ్ అదానీ వ్యాపారాల షేర్లు గురువారం మరింత పడిపోయాయి. అతను తన సంపదలో $100 బిలియన్లను కోల్పోయారు.

FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్

అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఊహించని విధంగా జరిగిన పరిణామాల ప్రకారం రూ. 20,000 కోట్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO)ను రద్దు చేయాలని డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.