గౌతమ్ అదానీ: వార్తలు

NSE మూడు అదానీ గ్రూప్ స్టాక్స్‌పై ఎందుకు నిఘా పెట్టింది

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత జరిగిన అపజయం తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ రికవరీ బాటలో ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మూడు అదానీ స్టాక్‌లను స్వల్పకాలిక అదనపు నిఘా యంత్రాంగం (ASM) కింద ఉంచింది.

23 Feb 2023

ప్రపంచం

ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో టాప్ 29 స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ

ఫోర్బ్స్ బ్లూమ్‌బెర్గ్ సూచీల ప్రకారం, గౌతమ్ అదానీ వ్యాపార దిగ్గజం సంపద బుధవారం $44 బిలియన్ల దిగువకు పడిపోయింది. అమెరికన్ షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ గురించి నివేదికను ప్రచురించినప్పటి నుండి అదానీ సంపదలో తగ్గుదల కనిపిస్తుంది.

20 Feb 2023

నష్టం

$50 బిలియన్ల దిగువకు పడిపోయిన గౌతమ్ అదానీ నికర విలువ

బిలియనీర్ గౌతమ్ అదానీ నికర విలువ సోమవారం $50 బిలియన్ల దిగువకు పడిపోయింది, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో అప్డేట్ చేసిన డేటా ప్రకారం అతని మొత్తం సంపద ఇప్పుడు 49.1 బిలియన్ డాలర్లు.

మళ్ళీ నష్టాల బాట పట్టిన అదానీ గ్రూప్ స్టాక్స్

ఇండెక్స్ ప్రొవైడర్ MSCI (మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్) కొన్ని అదానీ గ్రూప్ స్టాక్‌ల ఫ్రీ-ఫ్లోట్ స్టేటస్‌ను సమీక్షిస్తామని చెప్పిన తర్వాత అదానీ విల్మార్ మినహా గ్రూప్‌లోని అన్ని లిస్టెడ్ కంపెనీలు గురువారం నష్టాల్లో ముగిశాయి.

అదానీ ప్రయోజనాల కోసమే వ్యాపార నియమమాలను మార్చిన కేంద్రం: రాహుల్ గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌‌గాంధీ మంగళవారం బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభలో ఆయన అదానీ అంశాన్ని లేవనెత్తారు. గౌతమ్ అదానీ ప్రయోజనాలను కోసం మోదీ ప్రభుత్వం వ్యాపార నియమాలను మార్చిందని ఆరోపించారు. ఈ సందర్భంగా విమనంలో అదానీతో కలిసి ఉన్న ప్రధాని మోదీ చిత్రాన్ని రాహుల్ ప్రదర్శించారు.

రుణాలని ముందుగా చెల్లించి మూలధన వ్యయాన్ని తగ్గించుకొనున్న అదానీ గ్రూప్

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికతో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల విలువలో సగానికి పైగా నష్టపోయింది. ఆ నష్ట నివారణ చర్యల దిశగా అదానీ గ్రూప్ పనిచేస్తుంది. మల్టీ-ప్రోంగ్ విధానం ద్వారా పెట్టుబడిదారుల ఆందోళనలకు జవాబు ఇవ్వాలని ఆలోచిస్తుంది.

అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ

అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై నిజానిజాలు తేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మోసం, స్టాక్ మానిప్యులేషన్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌పై పార్లమెంట్‌లో చర్చ జరగాలన్నారు.

ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ

ప్రపంచంలోని ఫోర్బ్స్ ప్రపంచ రియల్-టైమ్ బిలియనీర్ల జాబితాలో టాప్ 20 సంపన్నుల జాబితాలో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తన స్థానాన్ని కోల్పోయారు. US షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై చేసిన నివేదిక ఆ సంస్థ స్టాక్స్ ను దారుణంగా పడిపోయేలా చేసింది. శుక్రవారం 22వ స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ సంపద 21.77 శాతం అంటే 16.2 బిలియన్ డాలర్లు క్షీణించింది.

మరిన్ని ఇబ్బందుల్లోకి అదానీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్

బొగ్గు ఉత్పత్తి చేసే విద్యుత్ ధర ఖరీదు ఎక్కువ కావడంతో అదానీ పవర్ లిమిటెడ్‌తో 2017 విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలని బంగ్లాదేశ్ కోరింది. ఒప్పందాన్ని సవరించాలని కోరుతూ భారతీయ కంపెనీతో కమ్యూనికేట్ చేసామని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ (BPDC) అధికారి తెలిపారు.

'హిండెన్‌బర్గ్' ఎఫెక్ట్: ఫిబ్రవరి 6న ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ ఆఫీస్‌ల ఎదుట కాంగ్రెస్ నిరసన

గౌతమ్ అదానీపై ప్రముఖ రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశం పార్లమెంట్‌ను కూడా కుదిపేస్తోంది.

అదానీ గ్రూప్ లో 3 సంస్థలను పరిశీలిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి

పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వడానికి భారతీయ బిలియనీర్ అదానీ చేసిన ప్రయత్నం విఫలమైంది గౌతమ్ అదానీ వ్యాపారాల షేర్లు గురువారం మరింత పడిపోయాయి. అతను తన సంపదలో $100 బిలియన్లను కోల్పోయారు.

02 Feb 2023

లోక్‌సభ

అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో గందరగోళం, లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. గౌతమ్ అదానీపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై చర్చించాలని విపక్షాలు పట్టుపట్టిన నేపథ్యంలో ఉభయ సభల్లో గందరగోళ ఏర్పడింది.

వరల్డ్ టాప్10 సంపన్నుల జాబితా నుంచి అదానీ ఔట్

భారత పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల జాబితాలో చోటు కోల్పోయారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థలకు సంబంధించిన షేర్లు పతనవుతూ వస్తున్నాయి.

జాతీయవాదం ద్వారా చేసిన మోసాన్నిఅదానీ కప్పిపుచ్చలేరంటున్న హిండెన్‌బర్గ్

హిండెన్‌బర్గ్ చేసిన స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాల ఆరోపణల నివేదికపై స్పందిస్తూ ఇది భారతదేశంపై దాడిగా అదానీ గ్రూప్ పేర్కొంది.

అదానీ గ్రూప్ షేర్ 22% పడిపోవడంతో నష్టాన్ని చవిచూసిన LIC

అదానీ గ్రూప్ షేర్లు శుక్రవారం ఒక్క రోజులో మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ. 3.37 లక్షల కోట్లు నష్టపోయాయి, మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఐదు అతిపెద్ద అదానీ గ్రూప్ కంపెనీలలో ఏకైక అతిపెద్ద నాన్-ప్రమోటర్ దేశీయ వాటాదారైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC). అదానీ గ్రూప్ కంపెనీలలో తన హోల్డింగ్స్ విలువ క్షీణించిన కారణంగా రూ.16,627 కోట్లు కోల్పోయింది.

హిండెన్‌బర్గ్‌ పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన అదానీ సంస్థ

అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ ఆరోపించడంతో ఇప్పుడు అదానీ గ్రూప్ దానిపై చట్టపరమైన చర్యల తీసుకోవడానికి సిద్దమైంది. హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత, బుధవారం మార్కెట్ విలువలో అదానీ గ్రూప్ కంపెనీలు రూ. రూ.85,761 కోట్లు కోల్పోయాయి.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఒక రోజులో సుమారు $6 బిలియన్లను ఆ సంస్థ కోల్పోయింది.