NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో గందరగోళం, లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా
    తదుపరి వార్తా కథనం
    అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో గందరగోళం, లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా
    అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో గందరగోళం

    అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో గందరగోళం, లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా

    వ్రాసిన వారు Stalin
    Feb 02, 2023
    09:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. గౌతమ్ అదానీపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై చర్చించాలని విపక్షాలు పట్టుపట్టిన నేపథ్యంలో ఉభయ సభల్లో గందరగోళ ఏర్పడింది.

    అదానీ గ్రూప్‌నకు చెందిన షేర్ల విలువ క్షీణిస్తున్న నేపథ్యంలో భారతీయ ఇన్వెస్టర్ల నష్టాలపై చర్చించాలని విపక్షాలు నినాదాలు చేశాయి. ప్రశ్నోత్తరాల సమయానికి అంతరాయం కలిగించిన ప్రతిపక్షాలు పార్లమెంట్ సాధారణ కార్యకలాపాలను నిలిపివేయాలని డిమాండ్ చేశాయి.

    జాంబియా నుంచి వచ్చిన పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికి ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించిన వెంటనే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాల్సిందేనని పట్టుపట్టారు. ఈక్రమంలో సభను స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.

    పార్లమెంట్

    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరపాలి: కాంగ్రెస్

    మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి సభ ప్రారంభమైనా ప్రతిపక్షాలు పట్టు వీడలేదు. ఈక్రమంలో సభను కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో శుక్రవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో దాన్ని కూడా ఛైర్మన్ ధన్‌ఖ్‌డ్ రేపు ఉదయం 11గంటలకు వాయిదా వేశారు.

    గౌతమ్ అదాని, హిండెన్‌బర్గ్ నివేదికపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరపాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఎల్ఐసీ, ఎస్‌బీఐ, ఇతర బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టిను ప్రజలు నష్టపోతున్నట్లు ఆయన చెప్పారు.

    బడ్జెట్ సమావేశాల మొదటి విడత ఫిబ్రవరి 14న ముగుస్తుంది. రెండో విడత మార్చి 12న ప్రారంభమై ఏప్రిల్ 6న వరకు కొనసాగుతుంది. సెషన్‌లో దాదాపు 36 బిల్లులను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    లోక్‌సభ
    బడ్జెట్ 2023
    కాంగ్రెస్

    తాజా

    Shreyas Iyer: ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఘనత శ్రేయస్ అయ్యర్
    Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్‌.. సాయం చేయాలంటూ తోటి బిలియనీర్లకు పిలుపు.. మైక్రోసాఫ్ట్
    INDIA vs PAKISTAN: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్ 2025 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ నిష్క్రమణ  బీసీసీఐ
    Tata Harrier EV: జూన్ 3న టాటా హారియర్ ఈవీ లాంచ్‌.. 500 కిమీ రేంజ్‌తో రావనున్న కొత్త ఫ్లాగ్‌షిప్‌ SUV! టాటా హారియర్

    లోక్‌సభ

    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ ఎన్నికల సంఘం

    బడ్జెట్ 2023

    ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి బడ్జెట్
    ఆర్థిక సర్వే: 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.5శాతం వృద్ధి నమోదు ఆర్థిక సర్వే
    బడ్జెట్ 2023లో పన్ను తగ్గింపులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు? ఆర్థిక సంవత్సరం
    బడ్జెట్ 2023: పాత పన్ను విధానంలో మినహాయింపులు, 80సీ కింద మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయా? ఆర్థిక శాఖ మంత్రి

    కాంగ్రెస్

    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ దిల్లీ
    విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు బీజేపీ
    'సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదు', కేంద్రంపై దిగ్విజయ సింగ్ విసుర్లు జమ్ముకశ్మీర్
    కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా కేరళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025