NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము
    భారతదేశం

    Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము

    Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 31, 2023, 12:46 pm 1 నిమి చదవండి
    Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము
    ఉభయ సమభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం

    కేంద్ర బడ్జెట్-2023 పార్లమెంట్ సమావేశాలు మంగళవారం ప్రారంభయ్యమాయి. అయితే ఉభయ సమభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్‌లో ప్రసంగించారు. ముర్ము రాష్ట్రపతి అయ్యాక పార్లమెంట్‌లో ఇదే ఆమె తొలి ప్రసంగం. ప్రపంచానికి పరిష్కార మార్గాలు చూపుతున్న భారత్‌ను ప్రపంచ దేశాలు భిన్నమైన కోణంలో చూస్తున్నాయన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పేదరిక నిర్మూలన, అన్ని వర్గాల అభివృద్ధి కోసం కేంద్రం కృషి చేస్తున్నట్లు చెప్పారు. అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ, రాబోయే 25ఏళ్లు దేశానికి ఎంతో కీలకమన్నారు. బీజేపీ ఆంధ్వర్యంలోని కేంద్రం ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నట్లు రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ వంటి కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు వివరించారు.

    ఆదివాసి ప్రాంతాల్లో ఆదర్శ పాఠాశాలలు ఏర్పాటు: రాష్ట్రపతి

    పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక నేరగాళ్ల చట్టాన్ని ఆమోదించినట్లు రాష్ట్రపతి ముర్ము వెల్లడించారు. ప్రభుత్వంలో జవాబుదారి తనం పెరిగినట్లు చెప్పారు. బినామీ ఆస్థులను స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆదివాసి ప్రాంతాల్లో ఆదర్శ పాఠాశాలలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్రపతి వివరించారు. చరిత్రలో తొలిసారిగా బిర్సా ముందా జయంతిని అధికారికంగా కేంద్రం నిర్వహించినట్లు చెప్పారు. తీవ్రవాద ప్రభావిత జిల్లాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల్లో సరిహద్దు గ్రామాల్లో రక్షణ చర్యలను మరింత పటిష్టం చేసినట్లు రాష్ట్రపతి ముర్ము స్పష్టం చేశారు. మహిళా సాధికారతను కేంద్రం ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    రాష్ట్రపతి
    బడ్జెట్

    తాజా

    ఎడ్‌టెక్ పరిశ్రమ పతనానికి దారితీస్తున్న BYJU'S, upGrad నిధుల సంక్షోభం ఉద్యోగుల తొలగింపు
    అధికారికంగా విడుదలైన 2024 హ్యుందాయ్ కోనా SUV ఆటో మొబైల్
    అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇలా జరుపుకుందాం అంతర్జాతీయ మహిళల దినోత్సవం
    వేలిముద్ర ఆధారిత ఆధార్ authentication గురించి తెలుసుకుందాం ఆధార్ కార్డ్

    రాష్ట్రపతి

    కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు గణతంత్ర దినోత్సవం

    బడ్జెట్

    మన నికర విలువ ఎందుకు తెలుసుకోవాలి నికర విలువ
    సాంకేతికత సాయంతో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఫిబ్రవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్
    ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023