NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించండి', అమిత్ షాకు ఖర్గే లేఖ
    భారతదేశం

    'భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించండి', అమిత్ షాకు ఖర్గే లేఖ

    'భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించండి', అమిత్ షాకు ఖర్గే లేఖ
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 28, 2023, 02:03 pm 1 నిమి చదవండి
    'భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించండి', అమిత్ షాకు ఖర్గే లేఖ
    భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించాలని అమిత్ షాకు లేఖ రాసిన ఖర్గే

    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో జనవరి 27న జరిగిన భద్రతా లోపంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ రాశారు. జమ్మకాశ్మీర్‌లో జరుగుతున్న 'భారత్ జోడో యాత్ర'కు తగిన భద్రత కల్పించడంలో వ్యక్తిగత జోక్యం చేసుకోవాలని కోరారు. శుక్రవారం యాత్ర ఖాంజీగుడ్‌‌కు చేరుకోగానే జన సందోహం భారీగా రావడంతో వారిని నియంత్రించలేక జమ్ము కశ్మీర్ పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది సూచన మేరకు రాహుల్ యాత్రను ఆపేశారు. శనివారం యాత్ర మళ్లీ మొదలైంది. జనవరి 30న శ్రీనగర్‌లో యాత్ర ముగిసే వరకు తగిన భద్రత కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించాలని లేఖలో షాను ఖర్గే కోరారు.

    భారత్ జోడో యాత్రలో మెహబూబా ముఫ్తీ

    రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శనివారం అవంతిపోరాలోని చెర్సూ గ్రామం నుంచి ప్రారంభమైంది. అవంతిపోరాలో పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ యాత్రలో పాల్గొని, రాహు‌ల్‌తో కలిసి నడిచారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై జమ్ముకాశ్మీర్ కాంగ్రెస్ నాయకుడు గులాం అహ్మద్ స్పందించారు. శుక్రవారం వేలాది మంది యాత్రలో చేరేందుకు వచ్చారని, భద్రతా లోపం స్పష్టంగా కనిపించినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా యాత్రకు విశేష ఆదరణ లభించిందన్నారు గులాం అహ్మద్. యాత్ర లక్ష్యం చాలా విశేషమైనదన్నారు. 13 రాష్ట్రాల్లో యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. యాత్ర అజెండా రాజకీయాలకు అతీతం అన్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    జమ్ముకశ్మీర్
    రాహుల్ గాంధీ
    కాంగ్రెస్

    తాజా

    వికెట్ల మధ్య ధోని కంటే ఫాస్టెస్ట్ రన్నర్ ఏబీ డివిలియర్స్ : విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ
    ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు దిల్లీ
    Happy Brthday Suma Kanakala: యాంకరింగ్‌కు బ్రాండ్ ఇమేజ్ 'సుమ కనకాల' టెలివిజన్
    ఆస్ట్రేలియా ఆటగాళ్లపై కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ విరాట్ కోహ్లీ

    జమ్ముకశ్మీర్

    పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు భూకంపం
    SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం పాకిస్థాన్
    కిరణ్ పటేల్‌: పీఎంఓ అధికారినంటూ హల్‌చల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు; 15రోజుల జ్యుడీషియల్ కస్టడీ గుజరాత్
    జమ్ముకశ్మీర్ పోలీసుల అదుపులో లష్కరే తోయిబా ఉగ్రవాది; 24 గంటల్లో రెండో అరెస్ట్ ఉగ్రవాదులు

    రాహుల్ గాంధీ

    కేంద్రం ఆరోపణలపై స్పందించడానికి అనుమతి ఇవ్వండి; స్పీకర్‌కు రాహుల్ గాంధీ లేఖ లోక్‌సభ
    రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రంగా ఉంటే మోదీకే లాభం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    నెహ్రూ కుటుంబాన్ని అవమానించారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ కాంగ్రెస్
    లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్; 20వ తేదీకి ఉభయ సభలు వాయిదా లోక్‌సభ

    కాంగ్రెస్

    కాంగ్రెస్‌లోకి బీజేపీ ఎమ్మెల్సీ; ఎన్నికల వేళ కమలం పార్టీకి షాక్ బీజేపీ
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం! కర్ణాటక
    ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే
    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక బీజేపీ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023