NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించండి', అమిత్ షాకు ఖర్గే లేఖ
    తదుపరి వార్తా కథనం
    'భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించండి', అమిత్ షాకు ఖర్గే లేఖ
    భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించాలని అమిత్ షాకు లేఖ రాసిన ఖర్గే

    'భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించండి', అమిత్ షాకు ఖర్గే లేఖ

    వ్రాసిన వారు Stalin
    Jan 28, 2023
    02:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో జనవరి 27న జరిగిన భద్రతా లోపంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ రాశారు. జమ్మకాశ్మీర్‌లో జరుగుతున్న 'భారత్ జోడో యాత్ర'కు తగిన భద్రత కల్పించడంలో వ్యక్తిగత జోక్యం చేసుకోవాలని కోరారు.

    శుక్రవారం యాత్ర ఖాంజీగుడ్‌‌కు చేరుకోగానే జన సందోహం భారీగా రావడంతో వారిని నియంత్రించలేక జమ్ము కశ్మీర్ పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది సూచన మేరకు రాహుల్ యాత్రను ఆపేశారు. శనివారం యాత్ర మళ్లీ మొదలైంది.

    జనవరి 30న శ్రీనగర్‌లో యాత్ర ముగిసే వరకు తగిన భద్రత కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించాలని లేఖలో షాను ఖర్గే కోరారు.

    భారత్ జోడో యాత్ర

    భారత్ జోడో యాత్రలో మెహబూబా ముఫ్తీ

    రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శనివారం అవంతిపోరాలోని చెర్సూ గ్రామం నుంచి ప్రారంభమైంది. అవంతిపోరాలో పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ యాత్రలో పాల్గొని, రాహు‌ల్‌తో కలిసి నడిచారు.

    రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై జమ్ముకాశ్మీర్ కాంగ్రెస్ నాయకుడు గులాం అహ్మద్ స్పందించారు. శుక్రవారం వేలాది మంది యాత్రలో చేరేందుకు వచ్చారని, భద్రతా లోపం స్పష్టంగా కనిపించినట్లు పేర్కొన్నారు.

    దేశవ్యాప్తంగా యాత్రకు విశేష ఆదరణ లభించిందన్నారు గులాం అహ్మద్. యాత్ర లక్ష్యం చాలా విశేషమైనదన్నారు. 13 రాష్ట్రాల్లో యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. యాత్ర అజెండా రాజకీయాలకు అతీతం అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ
    జమ్ముకశ్మీర్
    కాంగ్రెస్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    రాహుల్ గాంధీ

    'సైనికులు రుజువు చూపాల్సిన అవసరం లేదు' సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ కామెంట్స్ జమ్ముకశ్మీర్
    సర్జికల్ స్ట్రైక్స్: 'జవాన్లపై నమ్మకం ఉంది, కానీ బీజేపీని విశ్వసించలేం' కాంగ్రెస్

    జమ్ముకశ్మీర్

    ఆ ఇళ్లే లక్ష్యంగా.. జమ్ముకశ్మీర్‌లోని 17 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు భారతదేశం
    2022లో ఎన్ని వందలమంది ఉగ్రవాదులు హతమయ్యారంటే? భారతదేశం
    రాజౌరిలో మరో పేలుడు.. చిన్నారి మృతి.. 24గంటల్లోనే రెండో ఘటన భారతదేశం
    సినిమా హాళ్లలోకి బయటి తినుబండారాలను అనుమతించడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు సుప్రీంకోర్టు

    కాంగ్రెస్

    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ దిల్లీ
    విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు బీజేపీ
    'సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదు', కేంద్రంపై దిగ్విజయ సింగ్ విసుర్లు జమ్ముకశ్మీర్
    కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా కేరళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025