NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'సైనికులు రుజువు చూపాల్సిన అవసరం లేదు' సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ కామెంట్స్
    భారతదేశం

    'సైనికులు రుజువు చూపాల్సిన అవసరం లేదు' సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ కామెంట్స్

    'సైనికులు రుజువు చూపాల్సిన అవసరం లేదు' సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ కామెంట్స్
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 24, 2023, 04:08 pm 1 నిమి చదవండి
    'సైనికులు రుజువు చూపాల్సిన అవసరం లేదు' సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ కామెంట్స్
    దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ

    2016లో భారత దళాల 'సర్జికల్ స్ట్రైక్', 2019 పుల్వామా ఉగ్రదాడిపై దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అవి దిగ్వజయ్ వ్యక్తిగత అభిప్రాయాలని రాహుల్ పేర్కొన్నారు. వాటితో తాము ఏకీభవించడం లేదని, సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి భారత సైనికులు ఎలాంటి రుజువు చూపించాల్సిన అవసరం లేదని రాహుల్ స్పష్టం చేశారు. రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం జమ్మూలో సాగోతోంది. ఈ సందర్భంగా పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. బీజేపీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ చేసిందని చెబుతున్నా, దానికి ఎలాంటి రుజువు లేదని సోమవారం దిగ్విజయ్ సింగ్ అన్నారు. సర్జికల్ స్ట్రైక్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అబద్ధాలాడుతోందని ఆరోపించారు.

    భారత జవాన్లను మేము విశ్వసిస్తాం: రాహుల్ గాంధీ

    సర్జికల్ స్ట్రైక్స్‌ పట్ల కాంగ్రెస్ వైఖరి ఏంటో వర్కింగ్ కమిటీలోనే చెప్పినట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత జవాన్లను తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు. జమ్మూలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము ఎప్పుడూ దేశం కోసమే పని చేస్తామని, సైన్యం పట్ల తమకు అపారమైన గౌరవం ఉందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, 2024లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు, బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు చేపట్టారు. కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర కశ్మీర్‌‌లో ముగియనుంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    జమ్ముకశ్మీర్
    రాహుల్ గాంధీ

    తాజా

    ప్రాణాలతో ఆడుకోకండి, మరణంపై వచ్చిన ఫేక్ వార్తలపై కోటశ్రీనివాసరావు స్పందన తెలుగు సినిమా
    హోండా షైన్ 100 vs హీరో స్ప్లెండర్ ప్లస్ ఫీచర్స్ తెలుసుకుందాం ఆటో మొబైల్
    హ్యారీ పోటర్, స్టార్ వార్స్ చిత్రాల్లో నటించిన పాల్ గ్రాంట్ కన్నుమూత సినిమా
    'అక్రమ అరెస్టులు, మైనార్టీలపై దాడులు'; భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై అమెరికా సంచలన నివేదిక భారతదేశం

    జమ్ముకశ్మీర్

    కిరణ్ పటేల్‌: పీఎంఓ అధికారినంటూ హల్‌చల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు; 15రోజుల జ్యుడీషియల్ కస్టడీ గుజరాత్
    జమ్ముకశ్మీర్ పోలీసుల అదుపులో లష్కరే తోయిబా ఉగ్రవాది; 24 గంటల్లో రెండో అరెస్ట్ ఉగ్రవాదులు
    టెర్రర్ ఫండింగ్ కేసు: జమ్ముకశ్మీర్‌లో ఎన్ఐఏ విస్తృత సోదాలు ఎన్ఐఏ
    ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్‌ అంశం; భారత్‌పై మరోసారి అక్కసును వెల్లగక్కిన పాకిస్థాన్ పాకిస్థాన్

    రాహుల్ గాంధీ

    నెహ్రూ కుటుంబాన్ని అవమానించారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ కాంగ్రెస్
    లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్; 20వ తేదీకి ఉభయ సభలు వాయిదా బీజేపీ
    లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో గందరగోళం; క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ రాజ్యసభ
    ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023