NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'సైనికులు రుజువు చూపాల్సిన అవసరం లేదు' సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ కామెంట్స్
    తదుపరి వార్తా కథనం
    'సైనికులు రుజువు చూపాల్సిన అవసరం లేదు' సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ కామెంట్స్
    దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ

    'సైనికులు రుజువు చూపాల్సిన అవసరం లేదు' సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ కామెంట్స్

    వ్రాసిన వారు Stalin
    Jan 24, 2023
    04:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2016లో భారత దళాల 'సర్జికల్ స్ట్రైక్', 2019 పుల్వామా ఉగ్రదాడిపై దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అవి దిగ్వజయ్ వ్యక్తిగత అభిప్రాయాలని రాహుల్ పేర్కొన్నారు. వాటితో తాము ఏకీభవించడం లేదని, సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి భారత సైనికులు ఎలాంటి రుజువు చూపించాల్సిన అవసరం లేదని రాహుల్ స్పష్టం చేశారు.

    రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం జమ్మూలో సాగోతోంది. ఈ సందర్భంగా పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర కామెంట్లు చేశారు.

    బీజేపీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ చేసిందని చెబుతున్నా, దానికి ఎలాంటి రుజువు లేదని సోమవారం దిగ్విజయ్ సింగ్ అన్నారు. సర్జికల్ స్ట్రైక్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అబద్ధాలాడుతోందని ఆరోపించారు.

    రాహుల్ గాంధీ

    భారత జవాన్లను మేము విశ్వసిస్తాం: రాహుల్ గాంధీ

    సర్జికల్ స్ట్రైక్స్‌ పట్ల కాంగ్రెస్ వైఖరి ఏంటో వర్కింగ్ కమిటీలోనే చెప్పినట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత జవాన్లను తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

    జమ్మూలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము ఎప్పుడూ దేశం కోసమే పని చేస్తామని, సైన్యం పట్ల తమకు అపారమైన గౌరవం ఉందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.

    ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, 2024లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు, బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు చేపట్టారు. కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర కశ్మీర్‌‌లో ముగియనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    జమ్ముకశ్మీర్

    ఆ ఇళ్లే లక్ష్యంగా.. జమ్ముకశ్మీర్‌లోని 17 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు భారతదేశం
    2022లో ఎన్ని వందలమంది ఉగ్రవాదులు హతమయ్యారంటే? భారతదేశం
    రాజౌరిలో మరో పేలుడు.. చిన్నారి మృతి.. 24గంటల్లోనే రెండో ఘటన భారతదేశం
    సినిమా హాళ్లలోకి బయటి తినుబండారాలను అనుమతించడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025