NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదు', కేంద్రంపై దిగ్విజయ సింగ్ విసుర్లు
    తదుపరి వార్తా కథనం
    'సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదు', కేంద్రంపై దిగ్విజయ సింగ్ విసుర్లు
    కేంద్రం ప్రభుత్వంపై దిగ్విజయ సింగ్ విమర్శలు

    'సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదు', కేంద్రంపై దిగ్విజయ సింగ్ విసుర్లు

    వ్రాసిన వారు Stalin
    Jan 23, 2023
    06:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్ జోడో యాత్రలో భాగంగా జమ్మూలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2016లో జరిగిన సర్జికల్ దాడుల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

    కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్ చేసిందని చెబుతున్నా, దానికి ఎలాంటి రుజువు లేదని దిగ్విజయ్ సింగ్ అన్నారు. అబద్ధాల సహాయంతో కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. 2016లో జరిపిన సర్జికల్ దాడులకు సంబంధించి కేంద్రం ఎలాంటి ఆధారాలను పార్లమెంట్‌లో సమర్పించలేదన్నారు.

    ఈ దేశం అందరిదని, దేశ ప్రజలందరూ ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

    దిగ్విజయ్

    ఆ రోజు స్కార్పియోను ఎందుకు తనిఖీ చేయలేదు: దిగ్విజయ్

    పుల్వామా ఉగ్రదాడి విషయంలో కూడా మోదీ ప్రభుత్వం తీరుపై దిగ్విజయ్ విరుచుకుపడ్డారు. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై దాడి జరిగిన తర్వాత సైనికులకు ఎయిర్ లిఫింగ్ ద్వారా తరలించాలని ఉన్నతాధికారులు కోరినా, మోదీ అందుకు ఒప్పుకోలేదని చెప్పారు. మోదీ ఎందుకు వారి అభ్యర్థనను తిరస్కరించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

    పుల్వామాలో ప్రతి కారును తనిఖీ చేసే వారు, ఆ రోజు స్కార్పియోను ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

    ఫిబ్రవరి 14, 2019న, కాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఇందులో 4O మంది భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

    2016 సెప్టెంబరు 18న, ఉరీ పట్టణానికి సమీపంలో ఉన్న సైనిక స్థావరంపై నలుగురు మిలిటెంట్లు భారత జవాన్లపై దాడి చేయగా 19మంది చనిపోయారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    జమ్ముకశ్మీర్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    కాంగ్రెస్

    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ దిల్లీ
    విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు బీజేపీ

    జమ్ముకశ్మీర్

    ఆ ఇళ్లే లక్ష్యంగా.. జమ్ముకశ్మీర్‌లోని 17 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు భారతదేశం
    2022లో ఎన్ని వందలమంది ఉగ్రవాదులు హతమయ్యారంటే? భారతదేశం
    రాజౌరిలో మరో పేలుడు.. చిన్నారి మృతి.. 24గంటల్లోనే రెండో ఘటన భారతదేశం
    సినిమా హాళ్లలోకి బయటి తినుబండారాలను అనుమతించడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025