NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదు', కేంద్రంపై దిగ్విజయ సింగ్ విసుర్లు
    భారతదేశం

    'సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదు', కేంద్రంపై దిగ్విజయ సింగ్ విసుర్లు

    'సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదు', కేంద్రంపై దిగ్విజయ సింగ్ విసుర్లు
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 23, 2023, 06:35 pm 1 నిమి చదవండి
    'సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదు', కేంద్రంపై దిగ్విజయ సింగ్ విసుర్లు
    కేంద్రం ప్రభుత్వంపై దిగ్విజయ సింగ్ విమర్శలు

    భారత్ జోడో యాత్రలో భాగంగా జమ్మూలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2016లో జరిగిన సర్జికల్ దాడుల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్ చేసిందని చెబుతున్నా, దానికి ఎలాంటి రుజువు లేదని దిగ్విజయ్ సింగ్ అన్నారు. అబద్ధాల సహాయంతో కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. 2016లో జరిపిన సర్జికల్ దాడులకు సంబంధించి కేంద్రం ఎలాంటి ఆధారాలను పార్లమెంట్‌లో సమర్పించలేదన్నారు. ఈ దేశం అందరిదని, దేశ ప్రజలందరూ ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

    ఆ రోజు స్కార్పియోను ఎందుకు తనిఖీ చేయలేదు: దిగ్విజయ్

    పుల్వామా ఉగ్రదాడి విషయంలో కూడా మోదీ ప్రభుత్వం తీరుపై దిగ్విజయ్ విరుచుకుపడ్డారు. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై దాడి జరిగిన తర్వాత సైనికులకు ఎయిర్ లిఫింగ్ ద్వారా తరలించాలని ఉన్నతాధికారులు కోరినా, మోదీ అందుకు ఒప్పుకోలేదని చెప్పారు. మోదీ ఎందుకు వారి అభ్యర్థనను తిరస్కరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పుల్వామాలో ప్రతి కారును తనిఖీ చేసే వారు, ఆ రోజు స్కార్పియోను ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఫిబ్రవరి 14, 2019న, కాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఇందులో 4O మంది భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 2016 సెప్టెంబరు 18న, ఉరీ పట్టణానికి సమీపంలో ఉన్న సైనిక స్థావరంపై నలుగురు మిలిటెంట్లు భారత జవాన్లపై దాడి చేయగా 19మంది చనిపోయారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    జమ్ముకశ్మీర్
    కాంగ్రెస్

    తాజా

    ప్రయోగం తర్వాత కక్ష్యను చేరుకోవడంలో విఫలమైన ప్రపంచంలోని మొదటి 3డి-ప్రింటెడ్ రాకెట్ టెక్నాలజీ
    IPL: పంజాబ్ కింగ్స్ కి బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం ఐపీఎల్
    శుక్ర గ్రహాన్ని అన్వేషించే మిషన్‌ 2028లో ప్రారంభం: ఇస్రో ఛైర్మన్ ఇస్రో
    అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో కొత్త వివాదం; టిప్పు సుల్తాన్‌ను ఎవరు చంపారు? కర్ణాటక

    జమ్ముకశ్మీర్

    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం
    పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు భూకంపం
    SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం పాకిస్థాన్
    కిరణ్ పటేల్‌: పీఎంఓ అధికారినంటూ హల్‌చల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు; 15రోజుల జ్యుడీషియల్ కస్టడీ గుజరాత్

    కాంగ్రెస్

    కేంద్రం ఆరోపణలపై స్పందించడానికి అనుమతి ఇవ్వండి; స్పీకర్‌కు రాహుల్ గాంధీ లేఖ రాహుల్ గాంధీ
    కాంగ్రెస్‌లోకి బీజేపీ ఎమ్మెల్సీ; ఎన్నికల వేళ కమలం పార్టీకి షాక్ బీజేపీ
    రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రంగా ఉంటే మోదీకే లాభం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం! కర్ణాటక

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023