NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్
    తదుపరి వార్తా కథనం
    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్
    మాండవీయ రాసిన లేఖపై స్పందించిన రాహుల్

    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్

    వ్రాసిన వారు Stalin
    Dec 22, 2022
    05:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్ జూడో యాత్రలో కరోనా నిబంధనలు పాటించాలని లేకుంటే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ రాసిన లేఖపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తన పాదయాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోందని రాహుల్ అన్నారు. బీజేపీ పాలకులు సత్యానికి భయపడుతున్నారని చెప్పారు.

    అంతకుముందు మాండవీయ రాసిన లేఖపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజస్థాన్, కర్ణాటకలో బీజేపీ యాత్రలు నిర్వహించినప్పుడు ఎలాంటి ఆదేశాలను కేంద్రం జారీ చేయలేదనన్నారు. 2020 మార్చిలో సైతం.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మోదీ సర్కారు లాక్‌డౌన్ విధించడాన్ని వారం పాటు ఆలస్యం చేసిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

    కాంగ్రెస్

    కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించిన మాండవీయ

    రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సైతం బీజేపీపై మండిపడ్డారు. రాహుల్ పాదయాత్రతో కాంగ్రెస్ కు పెరుగుతున్న మద్దతును చూసి బీజేపీ ఓర్వలేకపోతోందన్నారు. త్రిపురలో ప్రధాని ర్యాలీకి లేని కరోనా ప్రోటోకాల్ రాహుల్ యాత్రకు ఎందుకు అని ప్రశ్నించారు. మాండవీయ ప్రజల గురించి ఆలోచిస్తే.. మొదట ప్రధానికి లేఖ రాసి.. తర్వాత రాహుల్‌కు పంపాలని సవాల్ విసిరారు.

    కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలపై కేంద్రమంత్రి మాండవీయ స్పందించారు. యాత్రలో పాల్గొన్న చాలా మందికి ఇన్‌ఫెక్షన్ సోకిందని రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు ఎంపీలు లేఖ రాసిన తర్వాతే.. తాను రాహుల్‌కు లేఖ రాశానని మాండవీయ చెప్పారు. రెండ్రోజుల క్రితం యాత్రలో పాల్గొన్న హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖు కూడా పాజిటివ్ బారినట్లు ఆయన పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    భారతదేశం

    రామానుజన్ నంబర్ 1729 కి ఉన్న విశేషం తెలుసుకోవాల్సిందే సినిమా
    మంచి ఉద్యోగం వదులుకోని.. సన్యాసిగా మారుతున్న యువ శాస్త్రవేత్త భారతదేశం
    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025