NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్
    భారతదేశం

    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్

    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్
    వ్రాసిన వారు Naveen Stalin
    Dec 22, 2022, 05:32 pm 0 నిమి చదవండి
    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్
    మాండవీయ రాసిన లేఖపై స్పందించిన రాహుల్

    భారత్ జూడో యాత్రలో కరోనా నిబంధనలు పాటించాలని లేకుంటే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ రాసిన లేఖపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తన పాదయాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోందని రాహుల్ అన్నారు. బీజేపీ పాలకులు సత్యానికి భయపడుతున్నారని చెప్పారు. అంతకుముందు మాండవీయ రాసిన లేఖపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజస్థాన్, కర్ణాటకలో బీజేపీ యాత్రలు నిర్వహించినప్పుడు ఎలాంటి ఆదేశాలను కేంద్రం జారీ చేయలేదనన్నారు. 2020 మార్చిలో సైతం.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మోదీ సర్కారు లాక్‌డౌన్ విధించడాన్ని వారం పాటు ఆలస్యం చేసిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

    కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించిన మాండవీయ

    రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సైతం బీజేపీపై మండిపడ్డారు. రాహుల్ పాదయాత్రతో కాంగ్రెస్ కు పెరుగుతున్న మద్దతును చూసి బీజేపీ ఓర్వలేకపోతోందన్నారు. త్రిపురలో ప్రధాని ర్యాలీకి లేని కరోనా ప్రోటోకాల్ రాహుల్ యాత్రకు ఎందుకు అని ప్రశ్నించారు. మాండవీయ ప్రజల గురించి ఆలోచిస్తే.. మొదట ప్రధానికి లేఖ రాసి.. తర్వాత రాహుల్‌కు పంపాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలపై కేంద్రమంత్రి మాండవీయ స్పందించారు. యాత్రలో పాల్గొన్న చాలా మందికి ఇన్‌ఫెక్షన్ సోకిందని రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు ఎంపీలు లేఖ రాసిన తర్వాతే.. తాను రాహుల్‌కు లేఖ రాశానని మాండవీయ చెప్పారు. రెండ్రోజుల క్రితం యాత్రలో పాల్గొన్న హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖు కూడా పాజిటివ్ బారినట్లు ఆయన పేర్కొన్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    భారతదేశం
    రాజస్థాన్

    తాజా

    కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ రేసులో రసెల్..? ఐపీఎల్
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 4% పెంచిన కేంద్రం ప్రభుత్వం
    పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఆప్ఘనిస్తాన్.. ఆరు వికెట్ల తేడాతో ఆప్ఘాన్ విక్టరీ పాకిస్థాన్

    భారతదేశం

    మార్చి 25న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    భారతదేశంలో 23,500 బుకింగ్‌లను దాటిన మారుతీ-సుజుకి Jimny ఆటో మొబైల్
    గందరగోళం మధ్య ఆర్థిక బిల్లు 2023ను ఆమోదించిన లోక్‌సభ లోక్‌సభ
    IPL 2023 ప్రారంభానికి ముందే అపరిమిత క్రికెట్ ప్లాన్‌లను ప్రకటించిన రిలయన్స్ జియో జియో

    రాజస్థాన్

    రాజస్థాన్‌: ఆర్మీ ప్రాక్టిస్‌లో అపశృతి; జైసల్మేర్‌లో 3 ఆర్మీ మిస్సైళ్లు మిస్ ఫైర్ ఇండియా లేటెస్ట్ న్యూస్
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం
    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? అసెంబ్లీ ఎన్నికలు

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023