NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'హిండెన్‌బర్గ్' ఎఫెక్ట్: ఫిబ్రవరి 6న ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ ఆఫీస్‌ల ఎదుట కాంగ్రెస్ నిరసన
    తదుపరి వార్తా కథనం
    'హిండెన్‌బర్గ్' ఎఫెక్ట్: ఫిబ్రవరి 6న ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ ఆఫీస్‌ల ఎదుట కాంగ్రెస్ నిరసన
    ఫిబ్రవరి 6న ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ ఆఫీస్‌ల ఎదుట కాంగ్రెస్ నిరసన

    'హిండెన్‌బర్గ్' ఎఫెక్ట్: ఫిబ్రవరి 6న ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ ఆఫీస్‌ల ఎదుట కాంగ్రెస్ నిరసన

    వ్రాసిన వారు Stalin
    Feb 03, 2023
    02:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గౌతమ్ అదానీపై ప్రముఖ రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశం పార్లమెంట్‌ను కూడా కుదిపేస్తోంది.

    నివేదికపై నిజానిజాలను తేల్చాలని డిమాండ్ కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఫిబ్రవరి 6న తేదీన ప్రతి జిల్లాలో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ అన్నారు.

    భారత ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును ప్రధానమంత్రి తన ఆశ్రిత మిత్రులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు వేణుగోపాల్‌ ఆరోపించారు. ఆలా చేయడం వల్లే నేడు ప్రధాన ప్రభుత్వ సంస్థలు ప్రమాదంలోకి నెట్టబడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

    అదానీ

    అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ రూ.36వేల కోట్లు, బ్యాంకులు రూ.80,000 కోట్ల పెట్టుబడి

    హిండెన్‌బర్గ్ నివేదిక ధాటికి భారత స్టాక్ మార్కెట్ షేక్ అవుతోంది. ముఖ్యంగా అదానీ కంపెనీ షేర్లు అయితే గత కొన్ని రోజులుగా లోయర్ సర్క్యూట్‌ను తాకుతూ, ఇన్వెస్టర్లను నిండా ముంచుతున్నాయి.

    అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ రూ.36,474.78 కోట్లు పెట్టుబడి పెట్టగా, భారతీయ బ్యాంకులు దాదాపు రూ.80,000 కోట్లు గ్రూప్‌లో ఇన్వెస్ట్ చేశాయని కేసీ వేణుగోపాల్‌ పేర్కొన్నారు. స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసం, ఇతర అవకతవకల ఆరోపణలు వచ్చినప్పుడు ఆయా ప్రభుత్వ సంస్థలు తమ వాటాలను అలాగే కొనసాగించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. హిండెన్‌బర్గ్ నివేదిక వచ్చినప్పటి నుంచి అదానీ గ్రూప్ దాదాపు 100 బిలియన్ డాలర్ల సంపదను నష్టపోయినట్లు ఆయన వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    గౌతమ్ అదానీ
    స్టాక్ మార్కెట్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    కాంగ్రెస్

    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ దిల్లీ
    విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు బీజేపీ
    'సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదు', కేంద్రంపై దిగ్విజయ సింగ్ విసుర్లు జమ్ముకశ్మీర్
    కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా కేరళ

    గౌతమ్ అదానీ

    హిండెన్‌బర్గ్‌ పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన అదానీ సంస్థ షేర్ విలువ
    అదానీ గ్రూప్ షేర్ 22% పడిపోవడంతో నష్టాన్ని చవిచూసిన LIC ఫైనాన్స్
    జాతీయవాదం ద్వారా చేసిన మోసాన్నిఅదానీ కప్పిపుచ్చలేరంటున్న హిండెన్‌బర్గ్ ఆదాయం
    వరల్డ్ టాప్10 సంపన్నుల జాబితా నుంచి అదానీ ఔట్ భారతదేశం

    స్టాక్ మార్కెట్

    2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం ఉక్రెయిన్
    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్ భారతదేశం
    FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ అదానీ గ్రూప్
    224 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 17,610 పాయింట్ల వద్ద స్థిరంగా ముగిసిన నిఫ్టీ నష్టం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025