
ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లోకి మళ్లించిన ప్రధాని మోదీ: రాహుల్ గాంధీ
ఈ వార్తాకథనం ఏంటి
అదానీ వ్యవహారంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. అదానీ కంపెనీల్లో ప్రజల సొమ్మును ప్రధాని మోదీ పెట్టుబడిగా పెట్టారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
అదానీ సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీకి అనవసరమైన ఆదరణ లభిస్తోందని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్గాంధీ ట్వీట్ చేశారు.
అదానీ వ్యవహారంపై విచారణ లేదు, అలాగే సమాధానం కూడా లేదని రాహుల్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు.
క్రిమినల్ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్లజైలు శిక్ష విధించింది. దీంతో ప్రాతినిధ్య చట్టం ప్రకారం రాహుల్ గాంధీ తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అదానీ వ్యవహారంపై 'విచారణ లేదు, సమాధానం లేదు' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్
LIC की पूंजी, अडानी को!
— Rahul Gandhi (@RahulGandhi) March 27, 2023
SBI की पूंजी, अडानी को!
EPFO की पूंजी भी, अडानी को!
‘मोडानी’ के खुलासे के बाद भी, जनता के रिटायरमेंट का पैसा अडानी की कंपनियों में निवेश क्यों किया जा रहा है?
प्रधानमंत्री जी, न जांच, न जवाब! आख़िर इतना डर क्यों?
కాంగ్రెస్
పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు మార్చ్
అదానీ సమస్య, రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ సోమవారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు మార్చ్ నిర్వహించారు.
సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు ఎంపీలు పార్లమెంట్ కాంప్లెక్స్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
"సత్యమేవ జయతే" అనే భారీ బ్యానర్, "ప్రజాస్వామ్యాన్ని రక్షించండి" అని వ్రాసిన ప్లకార్డులను పట్టుకుని, ఎంపీలు విజయ్ చౌక్ వైపుకు వెళ్లి అక్కడ నిరసన తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కేంద్రం తీరును నిరసిస్తూ ర్యాలీ నిర్వహిస్తున్న ప్రతిపక్షాలు
#WATCH | Congress chief Mallikarjun Kharge says, "Our message is-Save democracy Constitution. If you take law into hands,democracy will be ruined nobody would have freedom of speech. Adani has become a tall figure. Why is Govt silent? He earned money illegally. We want JPC." pic.twitter.com/7VMbl6eucP
— ANI (@ANI) March 27, 2023
కాంగ్రెస్
జేసీసీ విచారణపై భయమెందుకు?: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
కొన్నేళ్లుగా అదానీ సంపద ఇంతగా ఎలా పెరిగిపోయిందని ఖర్గే ప్రశ్నించారు. లోక్సభలో అదానీపై లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పలేకపోయారని మండిపడ్డారని ఖర్గే అన్నారు.
అదానీ సమస్యపై జేసీసీ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం దీనికి ఎందుకు అంగీకరించడం లేదని మండిపడ్డారు. జేసీసీ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
అదానీ గ్రూప్పై కార్పొరేట్ మోసం, స్టాక్ ధరల అవకతవకల ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేసీసీ) విచారణను ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
కాంగ్రెస్
రాహుల్కు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న టీఎంసీ
పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి అంశంపై కూడా ఖర్గే లేవనెత్తారు. బీజేపీ రాహుల్ గాంధీ పరువు తీయాలనుకుంటోందన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని ఖర్గే పేర్కొన్నారు.
ఇప్పటి వరకు ప్రతిపక్షాల నిరసనలకు దూరంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ సోమవారం రాహుల్కు మద్దతుగా ఆందోళనల్లో పాల్గొంది.
అంతకుముందు, కాంగ్రెస్, టీఎంసీ, బీఆర్ఎస్, ఎస్పీతో పాటు వివిధ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ కాంప్లెక్స్లో సమావేశమై రాజ్యసభ, లోక్సభలో రాహుల్ గాంధీ అనర్హత అంశాన్ని, అదానీ సమస్యను ముందుకు లేవనెత్తే అంశంపై చర్చించారు.