NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లోకి మళ్లించిన ప్రధాని మోదీ: రాహుల్ గాంధీ
    తదుపరి వార్తా కథనం
    ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లోకి మళ్లించిన ప్రధాని మోదీ: రాహుల్ గాంధీ
    ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లోకి మళ్లించిన ప్రధాని మోదీ: రాహుల్ గాంధీ

    ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లోకి మళ్లించిన ప్రధాని మోదీ: రాహుల్ గాంధీ

    వ్రాసిన వారు Stalin
    Mar 27, 2023
    03:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అదానీ వ్యవహారంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. అదానీ కంపెనీల్లో ప్రజల సొమ్మును ప్రధాని మోదీ పెట్టుబడిగా పెట్టారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

    అదానీ సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీకి అనవసరమైన ఆదరణ లభిస్తోందని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు.

    అదానీ వ్యవహారంపై విచారణ లేదు, అలాగే సమాధానం కూడా లేదని రాహుల్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు.

    క్రిమినల్ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్లజైలు శిక్ష విధించింది. దీంతో ప్రాతినిధ్య చట్టం ప్రకారం రాహుల్ గాంధీ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అదానీ వ్యవహారంపై 'విచారణ లేదు, సమాధానం లేదు' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్

    LIC की पूंजी, अडानी को!
    SBI की पूंजी, अडानी को!
    EPFO की पूंजी भी, अडानी को!

    ‘मोडानी’ के खुलासे के बाद भी, जनता के रिटायरमेंट का पैसा अडानी की कंपनियों में निवेश क्यों किया जा रहा है?

    प्रधानमंत्री जी, न जांच, न जवाब! आख़िर इतना डर क्यों?

    — Rahul Gandhi (@RahulGandhi) March 27, 2023

    కాంగ్రెస్

    పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు మార్చ్

    అదానీ సమస్య, రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ సోమవారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు మార్చ్ నిర్వహించారు.

    సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు ఎంపీలు పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

    "సత్యమేవ జయతే" అనే భారీ బ్యానర్, "ప్రజాస్వామ్యాన్ని రక్షించండి" అని వ్రాసిన ప్లకార్డులను పట్టుకుని, ఎంపీలు విజయ్ చౌక్ వైపుకు వెళ్లి అక్కడ నిరసన తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కేంద్రం తీరును నిరసిస్తూ ర్యాలీ నిర్వహిస్తున్న ప్రతిపక్షాలు

    #WATCH | Congress chief Mallikarjun Kharge says, "Our message is-Save democracy Constitution. If you take law into hands,democracy will be ruined nobody would have freedom of speech. Adani has become a tall figure. Why is Govt silent? He earned money illegally. We want JPC." pic.twitter.com/7VMbl6eucP

    — ANI (@ANI) March 27, 2023

    కాంగ్రెస్

    జేసీసీ విచారణపై భయమెందుకు?: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

    కొన్నేళ్లుగా అదానీ సంపద ఇంతగా ఎలా పెరిగిపోయిందని ఖర్గే ప్రశ్నించారు. లోక్‌సభలో అదానీపై లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పలేకపోయారని మండిపడ్డారని ఖర్గే అన్నారు.

    అదానీ సమస్యపై జేసీసీ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం దీనికి ఎందుకు అంగీకరించడం లేదని మండిపడ్డారు. జేసీసీ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

    అదానీ గ్రూప్‌పై కార్పొరేట్ మోసం, స్టాక్ ధరల అవకతవకల ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేసీసీ) విచారణను ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

    కాంగ్రెస్

    రాహుల్‌కు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న టీఎంసీ

    పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి అంశంపై కూడా ఖర్గే లేవనెత్తారు. బీజేపీ రాహుల్ గాంధీ పరువు తీయాలనుకుంటోందన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని ఖర్గే పేర్కొన్నారు.

    ఇప్పటి వరకు ప్రతిపక్షాల నిరసనలకు దూరంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ సోమవారం రాహుల్‌కు మద్దతుగా ఆందోళనల్లో పాల్గొంది.

    అంతకుముందు, కాంగ్రెస్, టీఎంసీ, బీఆర్ఎస్, ఎస్పీతో పాటు వివిధ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో సమావేశమై రాజ్యసభ, లోక్‌సభలో రాహుల్ గాంధీ అనర్హత అంశాన్ని, అదానీ సమస్యను ముందుకు లేవనెత్తే అంశంపై చర్చించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ
    కాంగ్రెస్
    లోక్‌సభ
    రాజ్యసభ

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    రాహుల్ గాంధీ

    'సైనికులు రుజువు చూపాల్సిన అవసరం లేదు' సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ కామెంట్స్ జమ్ముకశ్మీర్
    సర్జికల్ స్ట్రైక్స్: 'జవాన్లపై నమ్మకం ఉంది, కానీ బీజేపీని విశ్వసించలేం' కాంగ్రెస్
    'భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించండి', అమిత్ షాకు ఖర్గే లేఖ జమ్ముకశ్మీర్
    నేడు శ్రీనగర్‌లో 'భారత్ జోడో యాత్ర' ముగింపు వేడుక, 21 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం జమ్ముకశ్మీర్

    కాంగ్రెస్

    గాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన తృణమాల్ మహిళా ఎంపీ లోక్‌సభ
    'రాష్ట్రాన్ని దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టారు'; త్రిపురలో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై మోదీ ధ్వజం త్రిపుర
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై రాజకీయ దుమారం బీబీసీ

    లోక్‌సభ

    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ ఎన్నికల సంఘం
    అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో గందరగోళం, లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా రాజ్యసభ
    అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    రాజ్యసభ

    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు విద్యుత్‌ సవరణ బిల్లు లోక్‌సభ
    ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025