Russia: కీవ్పై రష్యా భారీ దాడి.. మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడి 9 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి ఉధృతమైంది. శనివారం తెల్లవారుజామున రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్పై బాలిస్టిక్ క్షిపణులు, దీర్ఘశ్రేణి డ్రోన్లతో భారీ దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఇప్పటివరకు 9 మంది మృతిచెందగా, మరో 22 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. దాడి ప్రభావంతో సోలోమియాన్స్కీ జిల్లాలోని ఐదు అంతస్తుల నివాస భవనం తీవ్రంగా దెబ్బతింది. భవనంలో చిక్కుకుపోయిన 35 మందిని అత్యవసర సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు. మరోవైపు డర్నిస్టికి జిల్లాలో జరిగిన దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 14 మంది గాయపడ్డారు. క్షిపణుల దాడి కారణంగా పలు ఇళ్లు కూలిపోవడంతో పాటు భారీగా మంటలు చెలరేగాయి.
వివరాలు
శిథిలాల కింద చిక్కుకొని పలువురు మృతి
శిథిలాల కింద చిక్కుకుని పలువురు మృతి చెందినట్లు సమాచారం.
ఈ దాడులపై స్పందించిన రష్యా.. కీవ్ సమీపంలోని సైనిక పారిశ్రామిక కేంద్రాలు, లాజిస్టిక్ హబ్లనే లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది.
డజన్ల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించినట్లు వెల్లడించింది. శుక్రవారం రాత్రి నుంచి హై-ప్రిసిషన్ గ్రౌండ్, సముద్రం నుంచి ప్రయోగించే ఆయుధాలు, లాంగ్-రేంజ్ డ్రోన్లతో ఈ దాడులు చేపట్టినట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది.
ఉక్రెయిన్కు చెందిన క్షిపణులు, డ్రోన్లు, రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాల తయారీ, నిల్వ కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు రష్యా వెల్లడించింది.