NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Gautam Adani: బిలియనీర్ గౌతమ్ అదానీపై అమెరికాలో లంచం, మోసం ఆరోపణలపై కేసు 
    తదుపరి వార్తా కథనం
    Gautam Adani: బిలియనీర్ గౌతమ్ అదానీపై అమెరికాలో లంచం, మోసం ఆరోపణలపై కేసు 
    బిలియనీర్ గౌతమ్ అదానీపై అమెరికాలో లంచం, మోసం ఆరోపణలపై కేసు

    Gautam Adani: బిలియనీర్ గౌతమ్ అదానీపై అమెరికాలో లంచం, మోసం ఆరోపణలపై కేసు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 21, 2024
    08:05 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత బిలియనీర్‌, అదానీ గ్రూప్‌ సంస్థ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి.

    ఈ అభియోగాల ప్రకారం, అదానీ కంపెనీ అధికారులకు లంచాలు ఇచ్చి, ఆ లంచాల గురించి ఇన్వెస్టర్లను తప్పుడు సమాచారం ఇచ్చి, నిధుల సేకరణకు ప్రయత్నించినట్లు న్యూయార్క్‌ ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు పేర్కొంటున్నారు.

    ఈ కారణంగా గౌతమ్‌ అదానీ, ఆయన బంధువు సాగర్‌ అదానీ సహా మరో ఏడుగురు వ్యాపారవేత్తలపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

    అదానీ గ్రూప్‌, దాని అనుబంధ సంస్థలు గత 20 ఏళ్లలో సుమారు 2 బిలియన్‌ డాలర్ల లాభాన్ని సాధించడానికి, భారత ప్రభుత్వ అధికారులకు 265 మిలియన్‌ డాలర్లు లంచాలు చెల్లించినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    గౌతమ్ అదానీ అరెస్ట్ పై రాయిటర్స్ చేసిన ట్వీట్ 

    Billionaire Gautam Adani of India's Adani Group charged in US with bribery, fraud https://t.co/vOGWiHqEE1 pic.twitter.com/w2zFVQnKcW

    — Reuters (@Reuters) November 20, 2024

    వివరాలు 

    మరో సివిల్‌ కేసు నమోదు

    తద్వారా, వారు అమెరికా, అంతర్జాతీయ ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించి, నిధులు సమీకరించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.

    అదానీ గ్రీన్‌ ఎనర్జీ కంపెనీ అనేక అక్రమ మార్గాల ద్వారా రుణ దాతలు, పెట్టుబడిదారుల నుంచి 3 బిలియన్‌ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లు సేకరించినట్లు ఆరోపించారు.

    అలాగే, అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ మరో సివిల్‌ కేసు నమోదు చేసింది.

    ఇందులో,అదానీ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ యుఎస్‌ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘిస్తూ, అమెరికా ఇన్వెస్టర్ల నుంచి 175 మిలియన్‌ డాలర్లకు పైగా నిధులు సేకరించిందని పేర్కొంది.

    ఈ కేసును దర్యాప్తు చేసి,జరిమానా విధించి, కంపెనీపై ఆంక్షలు విధించాల్సిందిగా రెగ్యులేటర్‌ కోరింది.అయితే, ఈ అభియోగాలపై అదానీ గ్రూప్‌ ఇప్పటి వరకు స్పదించ లేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గౌతమ్ అదానీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    గౌతమ్ అదానీ

    హిండెన్‌బర్గ్‌ పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన అదానీ సంస్థ భారతదేశం
    అదానీ గ్రూప్ షేర్ 22% పడిపోవడంతో నష్టాన్ని చవిచూసిన LIC షేర్ విలువ
    జాతీయవాదం ద్వారా చేసిన మోసాన్నిఅదానీ కప్పిపుచ్చలేరంటున్న హిండెన్‌బర్గ్ భారతదేశం
    వరల్డ్ టాప్10 సంపన్నుల జాబితా నుంచి అదానీ ఔట్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025