NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Adani Group: అదానీ గ్రూప్ మరో కొత్త సిమెంట్‌ కంపెనీ కొనుగోలు.. 52వారాల గరిష్ట స్థాయికి హైడెల్‌బర్గ్ సిమెంట్ ఇండియా షేర్లు
    తదుపరి వార్తా కథనం
    Adani Group: అదానీ గ్రూప్ మరో కొత్త సిమెంట్‌ కంపెనీ కొనుగోలు.. 52వారాల గరిష్ట స్థాయికి హైడెల్‌బర్గ్ సిమెంట్ ఇండియా షేర్లు

    Adani Group: అదానీ గ్రూప్ మరో కొత్త సిమెంట్‌ కంపెనీ కొనుగోలు.. 52వారాల గరిష్ట స్థాయికి హైడెల్‌బర్గ్ సిమెంట్ ఇండియా షేర్లు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 07, 2024
    02:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అదానీ గ్రూప్‌ (Adani Group) తమ సిమెంట్‌ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

    జర్మనీకి చెందిన హైడెల్‌బెర్గ్‌ మెటీరియల్స్‌ ఇండియా యూనిట్‌ అయిన హైడెల్‌బెర్గ్‌ సిమెంట్‌ ఇండియాను (HeidelbergCement India) కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

    ఇందుకోసం చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈ ఒప్పందం కోసం అదానీ గ్రూప్‌ అంబుజా సిమెంట్‌ ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల పెట్టుబడిని పెట్టాలని చూస్తోంది.

    అదానీ గ్రూప్‌ కొనుగోలు వార్తల నేపథ్యంలో హైడెల్‌బెర్గ్‌ ఇండియా షేర్లు సోమవారం భారీగా పెరిగాయి.

    ఇంట్రాడే ట్రేడింగ్‌లో వాటి విలువ 18 శాతం వరకు పెరిగి, బీఎస్‌ఈలో 17.95 శాతం లాభంతో 52 వారాల గరిష్ఠ స్థాయి అయిన రూ.257.85ను తాకింది.

    వివరాలు 

    మైసెమ్‌,జువారీ సిమెంట్స్‌ పేర్లతో హైడెల్‌బెర్గ్‌ సిమెంట్‌ కంపెనీ

    ఎన్‌ఎస్‌ఈలోనూ ఈ షేరు రూ.258ని చేరింది, కానీ ఆ తర్వాత కొంత తగ్గింది.అయితే,అంబుజా సిమెంట్‌ షేర్లు మాత్రం 2.21 శాతం మేర తగ్గాయి.

    సిమెంట్‌ రంగంలో అగ్రగామిగా నిలవాలని అదానీ గ్రూప్‌ కసరత్తు చేస్తోంది.2022లో హోల్సిమ్‌ గ్రూప్‌ నుంచి అంబుజా,ఏసీసీ సిమెంట్లను కొనుగోలు చేసిన అదానీ,ఆతర్వాత పెన్నా,సంఘీ ఇండస్ట్రీస్‌లను కూడా సొంతం చేసుకుంది.

    మరిన్ని సిమెంట్‌ కంపెనీల్లో వాటాలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది.ఈ ప్రయత్నంతో, ప్రస్తుతం సిమెంట్‌ రంగంలో అగ్రస్థానంలో ఉన్న బిర్లా గ్రూప్‌కు చెందిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌ను అధిగమించి,నంబర్‌ 1 స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాన్ని అదానీ గ్రూప్‌ పెట్టుకుంది.

    అల్ట్రాటెక్‌ సైతం విస్తరణలో వ్యాపార పథకాలు అమలు చేస్తోంది.హైడెల్‌బెర్గ్‌ సిమెంట్‌ కంపెనీ మైసెమ్‌,జువారీ సిమెంట్స్‌ పేర్లతో దేశంలో వ్యాపారాలు నిర్వహిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అదానీ గ్రూప్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    అదానీ గ్రూప్

    'హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలకు ఆధారల్లేవు'; అదానీ గ్రూప్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్  ఇండియా లేటెస్ట్ న్యూస్
    దూసుకుపోతున్న అదానీ గ్రూప్ స్టాక్స్‌; రూ.10లక్షల కోట్లు దాటిన మార్కెట్ విలువ ఇండియా లేటెస్ట్ న్యూస్
    టార్గెట్ చేసి తప్పుడు ఆరోపణలు చేశారు; హిండెన్‌బర్గ్ నివేదిక‌పై గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ
    అదానీ కంపెనీలో మరోసారి బిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్స్ కొన్న 'జీక్యూజీ'  గౌతమ్ అదానీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025