NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Gautam Adani : పవర్ రంగంలో వేగంగా విస్తరిస్తున్న అదానీ.. గ్రూప్'లోకి వచ్చి చేరిన మరో కంపెనీ 
    తదుపరి వార్తా కథనం
    Gautam Adani : పవర్ రంగంలో వేగంగా విస్తరిస్తున్న అదానీ.. గ్రూప్'లోకి వచ్చి చేరిన మరో కంపెనీ 
    గ్రూప్'లోకి వచ్చి చేరిన మరో కంపెనీ

    Gautam Adani : పవర్ రంగంలో వేగంగా విస్తరిస్తున్న అదానీ.. గ్రూప్'లోకి వచ్చి చేరిన మరో కంపెనీ 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 28, 2023
    02:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అదానీ గ్రూప్ విద్యుత్ రంగంలోకి వేగంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే గౌతమ్ అదానీ మరో కంపెనీని విజయవంతంగా ఒడిసిపట్టింది.

    అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీ తాజాగా హల్వాద్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు లైన్ క్లీయర్ చేసుకుంది.

    ఈ రెండు సంస్థల మధ్య ఇప్పటికే కొనుగోలు ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ఈ కంపెనీని పీఎఫ్సీ (PFC) కన్సల్టింగ్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసింది.

    ఈ వార్తలు బయటకు రావటంతో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు దాదాపు 3 శాతం పెరిగి రూ. 1082.40 కోట్లకి చేరుకోవడం గమనార్హం.

    DETAILS

    మరో రెండు ఏళ్లలో కంపెనీ కార్యకలాపాలు షురూ

    హల్వాద్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ సంస్థను స్పెషల్ పర్పస్ వెహికల్(SPV)గా ఏర్పాటు చేశారు. దీన్ని పీఎఫ్సీ కన్సల్టింగ్ లిమిటెడ్ రూపొందించింది.

    ఫేజ్- 3 పార్ట్ ఏ ప్యాకేజీ కింద ఖవ్రా రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ నుంచి 7 జీడబ్ల్యూ పునరుత్పాదక శక్తిని రవాణా లక్ష్యంగా ఏర్పాటైంది.

    టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా అదానీ గ్రూప్ కంపెనీ ఈ ప్రాజెక్ట్'ను సొంతం చేసుకుంది.

    రానున్న 24 నెలల్లో కంపెనీ ఈ ప్రాజెక్టును ప్రారంభించనుందని అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది.

    details

    రూ.3 వేల కోట్ల పెట్టుబడి

    అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సుమారు 301 కిలోమీటర్ల మేర ట్రాన్స్'మిషన్ ప్రాజెక్టును నిర్మించేందుకు దాదాపు రూ. 3వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

    ప్రాజెక్ట్ లో 765 కేవీ(765 KV) హల్వాద్ స్విచింగ్ స్టేషన్ నిర్మాణం కూడా ఇందులో ఉండనుంది.

    ఇది కాకుండా అదానీ గ్రూప్ కంపెనీ తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అదానీ ట్రాన్స్ మిషన్ స్టెప్ ఫోర్ లిమిటెడ్ 49:51 శాతం వాటాతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు యూఏఈకి చెందిన ఎస్యాసాఫ్ట్ హోల్డింగ్స్ తో అదానీ గ్రూప్స్ ఒప్పందం చేసుకుంది.

    ఈ జాయింట్ వెంచర్ కింద కంపెనీ ఇండియాతో పాటు విదేశాల్లో స్మార్ట్ మీటరింగ్ ప్రాజెక్టులపై వర్క్ చేయనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అదానీ గ్రూప్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    అదానీ గ్రూప్

    అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు నిర్మలా సీతారామన్
    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ ఆదాయం
    అదానీ గ్రూప్ వ్యవహారంపై కేంద్రానికి గట్టి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    మోదీని విమర్శించిన ఇన్వస్టర్ జార్జ్ సోరోస్‌కు జైశంకర్ గట్టి కౌంటర్ సుబ్రమణ్యం జైశంకర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025