NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Adani Group: సెబీ నోటీసు తర్వాత దెబ్బతిన్న అదానీ గ్రూప్ షేర్లు.. కొనసాగుతున్న క్షీణత
    తదుపరి వార్తా కథనం
    Adani Group: సెబీ నోటీసు తర్వాత దెబ్బతిన్న అదానీ గ్రూప్ షేర్లు.. కొనసాగుతున్న క్షీణత
    సెబీ నోటీసు తర్వాత దెబ్బతిన్న అదానీ గ్రూప్ షేర్లు.. కొనసాగుతున్న క్షీణత

    Adani Group: సెబీ నోటీసు తర్వాత దెబ్బతిన్న అదానీ గ్రూప్ షేర్లు.. కొనసాగుతున్న క్షీణత

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 06, 2024
    12:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకుల మధ్య అదానీ గ్రూప్ షేర్లు కుదేలయ్యాయి. అదానీ పవర్ నుంచి టోటల్ గ్యాస్ వరకు షేర్లలో భారీగా పతనం అయ్యింది.

    అదానీ షేర్లు పతనానికి కారణం సెబీ షోకాజ్ నోటీసు. ఈరోజు మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి అదానీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

    అదానీ పవర్ 3.28 శాతం క్షీణించి రూ.584.85కి చేరుకుంది.అదానీ ఎంటర్‌ప్రైజెస్ కూడా 4.27 శాతం తగ్గి రూ.2865.50 వద్ద ట్రేడవుతోంది.

    అదానీ గ్రీన్ ఎనర్జీ కూడా ఎరుపు రంగులో ఉంది. 1.93 శాతం తగ్గి రూ.1765కి చేరింది. అదానీ పోర్ట్స్‌లో 4.47 శాతం క్షీణత ఉంది. 1261.30 వద్ద ఉంది.

    Details 

    సెబీ ఎందుకు నోటీసు ఇచ్చింది

    అదానీ టోటల్ గ్యాస్ కూడా 2.54 శాతం తగ్గి రూ.906.80కి చేరుకుంది.

    అదానీ ఎనర్జీ సొల్యూషన్‌లో రెండు శాతానికి పైగా క్షీణత ఉంది. 1039.70 వద్ద ఉంది.

    అదానీ విల్మార్ 2శాతం క్షీణించి రూ.337.35 వద్ద ఉంది.ACC,అంబుజా సిమెంట్ మరియు NDTV షేర్లు కూడా దెబ్బతిన్నాయి.

    సంబంధిత పార్టీ లావాదేవీలను ఉల్లంఘించినందుకు, లిస్టింగ్ నిబంధనలను పాటించనందుకు ఆరు అదానీ గ్రూప్ కంపెనీలు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నుండి షోకాజ్ నోటీసులు అందుకున్నాయి. షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జనవరి 2023లో అదానీ గ్రూప్‌పై కార్పొరేట్ మోసం,షేర్ ధరల తారుమారుపై తీవ్రమైన ఆరోపణలు చేసిన తర్వాత జరిపిన విచారణలో భాగంగా ఈ ఆరు కంపెనీలకు సెబీ నోటీసు ఇచ్చింది.

    Details 

     FY 2023-24 ఆర్థిక ఫలితాలను వెల్లడి 

    సెబీ నోటీసు ప్రకారం అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్,అదానీ విల్మార్ తమ సంబంధిత జనవరి-మార్చి త్రైమాసికం, FY 2023-24 ఆర్థిక ఫలితాలను వెల్లడించాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అదానీ గ్రూప్

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    అదానీ గ్రూప్

    ఆంధ్రప్రదేశ్‌: త్వరలోనే అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల పనులు ప్రారంభం- 2028నాటికి పూర్తి చేయడమే లక్ష్యం ఆంధ్రప్రదేశ్
    పెట్టుబడిదారుల కోసం ఆసియాలో రోడ్‌షో నిర్వహించనున్న అదానీ గ్రూప్ ప్రకటన
    అదానీ గ్రూప్ స్టాక్స్ రికవరీ మార్గంలో ఉన్నాయా ప్రకటన
    'అదానీ-హిండెన్‌బర్గ్' వ్యవహారంపై దర్యాప్తుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025