NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Flood Relief Fund: ఆంధ్రలో వరదలు.. గౌతమ్ ఆదానీ 25కోట్ల రూపాయల భారీ విరాళం
    తదుపరి వార్తా కథనం
    AP Flood Relief Fund: ఆంధ్రలో వరదలు.. గౌతమ్ ఆదానీ 25కోట్ల రూపాయల భారీ విరాళం
    ఆంధ్రలో వరదలు.. గౌతమ్ ఆదానీ 25కోట్ల రూపాయల భారీ విరాళం

    AP Flood Relief Fund: ఆంధ్రలో వరదలు.. గౌతమ్ ఆదానీ 25కోట్ల రూపాయల భారీ విరాళం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 19, 2024
    04:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇటీవల ఆంధ్రప్రదేశ్ ని భారీ వర్షాలు, వరదలు తీవ్రంగా అతలాకుతలం చేశాయి. ఈ సమయంలో వరద బాధితులను ఆదుకునేందుకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు.

    ముఖ్యమంత్రి సహాయనిధికి (CMRF) విరాళాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో అదానీ గ్రూప్ కూడా ముందుకు వచ్చి, రూ.25 కోట్ల విరాళాన్ని ప్రకటించింది.

    అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.

    ఈ సందర్భంగా అదానీ సంస్థ ఎండీ కిరణ్ అదానీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన పత్రాలు అందజేస్తున్న ఫోటోను పంచుకున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    గౌతమ్ అదానీ చేసిన ట్వీట్ 

    Deeply troubled by the extensive damage caused by the recent torrential rains and flooding in Andhra Pradesh. The Adani Group stands in solidarity with the people of Andhra Pradesh and humbly extend our support through the @AdaniFoundation with a contribution of Rs 25 Cr to the… pic.twitter.com/FoRvCmY8GY

    — Gautam Adani (@gautam_adani) September 19, 2024

    వివరాలు 

    ముఖ్యమంత్రి సహాయనిధికి కొనసాగుతున్న విరాళాల వెల్లువ

    ఇక ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది.స్టీల్ ఎక్స్ఛేంజ్ ఇండియా లిమిటెడ్ తరఫున రూ.50లక్షల విరాళాన్ని సంస్థ ప్రతినిధులు చంద్రబాబుకు అందజేశారు.

    ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రజల నుంచి సేకరించిన రూ.35 లక్షల విరాళాన్ని సీఎంకు అందజేశారు.

    గుంటూరుకు చెందిన గడ్డిపాటి సుధాకర్ దంపతులు రూ.20లక్షలు,ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ప్రతినిధులు రూ.10 లక్షలు,108 ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.10 లక్షలు,ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ రూ.24 లక్షలు విరాళం ఇచ్చారు.

    అలాగే మత్స్యకారుల సంక్షేమ సంఘం రూ.6 లక్షలు,మల్లవల్లి ఇండస్ట్రీస్ రూ.14.50 లక్షలు, భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ రూ.50 లక్షలు విరాళం అందజేశారు.

    రాజమండ్రి రూరల్ ప్రజలు సేకరించిన దాదాపు రూ.83 లక్షల చెక్కును ఎమ్మెల్యే సీఎంకు అందించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అదానీ గ్రూప్
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    SRH vs KKR: కోల్‌కతా ఘోర ఓటమి.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్
    Sunrisers Hyderabad: ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన హైద‌రాబాద్.. అత్య‌ధిక స్కోర్ల జాబితా ఆరంజ్ ఆర్మీదే! సన్ రైజర్స్ హైదరాబాద్
    Kakani Govardhan: క్వార్ట్జ్‌ అక్రమాల కేసు.. మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అరెస్టు కాకాణి గోవర్ధన్ రెడ్డి
    GT vs CSK : గుజరాత్ ఓటమి.. చివరి మ్యాచును విజయంతో ముగించిన సీఎస్కే చైన్నై సూపర్ కింగ్స్

    అదానీ గ్రూప్

    సావర్కర్, అదానీలకు పవార్ మద్దతు; 'హిండెన్‌బర్గ్'పై జేపీసీ అనవసరమని వ్యాఖ్య శరద్ పవార్
    అదానీ గ్రూప్‌లో గతంలో కంటే ఎక్కువ మంది రుణదాతలు రుణం
    'హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలకు ఆధారల్లేవు'; అదానీ గ్రూప్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్  సుప్రీంకోర్టు
    దూసుకుపోతున్న అదానీ గ్రూప్ స్టాక్స్‌; రూ.10లక్షల కోట్లు దాటిన మార్కెట్ విలువ ఇండియా లేటెస్ట్ న్యూస్

    చంద్రబాబు నాయుడు

    Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుకు చంద్రబాబు చర్చలు భారతదేశం
    Chandrababu: ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఏపీ సీఎం చంద్రబాబు   భారతదేశం
    Anna Canteen: గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు భారతదేశం
    CBN Delhi Tour: ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. అపరిష్కృత సమస్యల పరిష్కారమే అజెండా  భారతదేశం

    ఆంధ్రప్రదేశ్

    Andhrapradesh: పింఛన్ దారులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. బదిలీ చేసుకోవాలనుకునేవారికి ఛాన్స్ భారతదేశం
    High Alert for AP: నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..   భారతదేశం
    Andhra Pradesh: ఏపీ వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ.. ఏమేమీ ఉంటాయంటే చంద్రబాబు నాయుడు
    Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ అరెస్ట్  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025