NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Adani Group: ఓరియంట్‌ సిమెంట్‌లో 46.8శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సిద్దమైన అదానీ గ్రూప్‌
    తదుపరి వార్తా కథనం
    Adani Group: ఓరియంట్‌ సిమెంట్‌లో 46.8శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సిద్దమైన అదానీ గ్రూప్‌
    ఓరియంట్‌ సిమెంట్‌లో 46.8శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సిద్దమైన అదానీ గ్రూప్‌

    Adani Group: ఓరియంట్‌ సిమెంట్‌లో 46.8శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సిద్దమైన అదానీ గ్రూప్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 22, 2024
    11:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గౌతమ్‌ అదానీ నాయకత్వంలోని అదానీ గ్రూప్‌ సిమెంట్‌ వ్యాపారంలో తన దూకుడుని కొనసాగిస్తోంది.

    ఇప్పటికే సిమెంట్ రంగంలో తన బిజినెస్ వేగంగా విస్తరిస్తున్న ఈ సంస్థ, తాజాగా మరో కంపెనీలో వాటా కొనుగోలు చేయడానికి సిద్ధమైంది.

    ఓరియంట్‌ సిమెంట్‌ లిమిటెడ్‌లో 46.8 శాతం షేర్లను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.

    2025 ఆర్థిక సంవత్సరంలో తమ మార్కెట్‌ వాటాను పెంచుకోవాలని అదానీ గ్రూప్‌ యోచిస్తోంది.

    ఇందుకు, సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా అంబుజా ఈ కొనుగోళ్లు చేపట్టనుంది.

    ఓరియంట్‌ సిమెంట్‌లో 46.8 శాతం వాటాను పొందడానికి రూ.8,100 కోట్లు వెచ్చించనున్నట్లు ప్రకటించింది.

    వివరాలు 

    26 శాతం వాటా కోసం ఆఫర్‌ ఫర్‌ సేల్‌

    ప్రమోటర్ల నుంచి 37.9 శాతం, పబ్లిక్‌ షేర్‌హోల్డర్ల నుంచి అదనంగా 8.9 శాతం కొనుగోలు చేయనున్నట్లు అదానీ గ్రూప్‌ కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో తెలిపింది.

    మిగిలిన 26 శాతం వాటా కోసం ఆఫర్‌ ఫర్‌ సేల్‌కు వెళ్లాలని యోచిస్తోంది. ఈ కొనుగోలుతో 2025 నాటికి వార్షిక ఉత్పత్తి 100 మిలియన్‌ టన్నులకు చేరుకుంటుందని అంబుజా సిమెంట్‌ డైరెక్టర్‌ కరణ్‌ అదానీ ధీమా వ్యక్తం చేశారు.

    వివరాలు 

    అదానీ గ్రూప్‌ ఎంట్రీతో.. గట్టి పోటిని ఎదుర్కుంటున్న అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 

    అంబుజా, ఏసీసీ సిమెంట్స్‌లో వాటాల కొనుగోలు ద్వారా సిమెంట్‌ వ్యాపారంలోకి ప్రవేశించిన అదానీ గ్రూప్‌ ఇప్పుడు విస్తరణ దిశగా ముందుకు పోతోంది.

    2028 ఆర్థిక సంవత్సరానికి దేశీయ సిమెంట్‌ మార్కెట్‌లో తన షేర్‌ను 20 శాతానికి పెంచుకోవాలని చూస్తోంది.

    రుణ రహితంగా ఉండాలని నిర్ణయించింది. 2028 నాటికి వార్షిక ఉత్పత్తిని 140 మిలియన్‌ టన్నులకు చేర్చాలని, వృద్ధితో ముందుకు సాగాలని ప్రణాళికలు రచిస్తోంది.

    అదానీ గ్రూప్‌ ఎంట్రీతో సిమెంట్‌ వ్యాపారంలో ఇప్పటికే ఉన్న అల్ట్రాటెక్‌ సిమెంట్‌ గట్టి పోటిని ఎదుర్కొంటోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అదానీ గ్రూప్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    అదానీ గ్రూప్

    దూసుకుపోతున్న అదానీ గ్రూప్ స్టాక్స్‌; రూ.10లక్షల కోట్లు దాటిన మార్కెట్ విలువ ఇండియా లేటెస్ట్ న్యూస్
    టార్గెట్ చేసి తప్పుడు ఆరోపణలు చేశారు; హిండెన్‌బర్గ్ నివేదిక‌పై గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ
    అదానీ కంపెనీలో మరోసారి బిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్స్ కొన్న 'జీక్యూజీ'  తాజా వార్తలు
    అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ సెబీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025