వై.ఎస్.జగన్: వార్తలు

ECI-Jagan: జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఈసీ.. ఇద్దరు ఐపీఎస్‌లపై వేటు 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారత ఎన్నికల సంఘం (ECI) షాక్ ఇచ్చింది.

Y.S.Jagan: జగన్‌పై దాడి చేసిన వారి సమాచారం ఇస్తే రూ.2 లక్షల రివార్డు .. పోలీసుల కీలక ప్రకటన 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనపై దర్యాప్తు చేసేందుకు విజయవాడ పోలీసు కమిషనర్‌ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేశారు.

YS Jagan : ఏపీ ముఖ్యమంత్రిపై రాయి దాడి.. సీఈసీ సీరియస్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (CM) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) పై జరిగిన రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం (CEC) తీవ్రంగా స్పందించింది.

Ambedkar Statue: ఈ నెల 19న భారీ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న జగన్‌ 

విజయవాడలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అంబేద్కర్ స్మృతి వనం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.

YSRCP: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు ఖరారు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఖరారు చేసింది.

CM Jagan: జగన్ బెయిల్ పిటీషన్ రద్దుపై.. ఏపీ సీఎంకి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి,సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది.

ఆంధ్ర‌ప్రదేశ్‌‌: గుడ్ న్యూస్ చెప్పిన  సీఎం జగన్; కొత్తగా పెన్షన్‌, రేషన్ కార్డుల జారీ 

ఆంధ్ర‌ప్రదేశ్‌‌ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. కొత్త పెన్షన్‌ కార్డులు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీకార్డులను మంజూరు చేశారు.

వైఎస్ షర్మిల అరుదైన ఘనత; ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అరుదైన ఘనత సాధించారు.

సీఎం వద్దకు రామచంద్రపురం పంచాయతీ.. జగన్‌తో పిల్లి సుభాష్ భేటీ

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై వైసీసీ అధిష్టానం దృష్టి సారించింది.

17 Jul 2023

తిరుపతి

అసెంబ్లీ సభా హక్కుల కమిటీ చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే 

తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక పదవిని కట్టబెట్టారు. ఆసెంబ్లీ సభా హక్కుల కమిటీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీ: వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. విశాఖ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాతావరణం హీట్ ఎక్కుతోంది. ఈ మేరకు పలువురు నాయకులు, వివిధ కారణాలతో పార్టీ జెండాలను, కండువలను మార్చుకునే ప్రక్రియలో నిమగ్నమయ్యారు.

సీఎం జగన్‌తో తెలంగాణ మాజీ ఎంపీ పొంగులేటీ భేటీ

రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు.

వైఎస్ జగన్ సంస్థలు జగతి, భారతి, ఎంపీ విజయసాయి రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు 

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సంస్థలకు సుప్రీంకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది.

16 Jun 2023

క్రీడలు

CM Jagan: ఏపీ నుంచి ఓ ఐపీఎల్ ఉండాలి 

భవిష్యత్తులో ఏపీ నుంచి ఓ ఐపీఎల్ జట్టు ఉండాలని అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి అదేశించారు.

ఏపీ సీఎంతో టీమిండియా వికెట్ కీపర్.. సీఎంపై ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టీమిండియా క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ గురువారం బేటీ అయ్యారు. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని శ్రీకర్ భరత్ మర్వాదపూర్వకంగా కలిశారు.

వైసీపీ కాపు నేతలతో ముద్రగడ కీలక భేటీ.. ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ

ఒక అల్పహార విందు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాలపై జరిగిన ఆ చర్చపైనే అందరి దృష్టి నెలకొంది.

నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ కీలక భేటీ.. ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్

ఏపీలో కీలక మంత్రివర్గం సమావేశం జరగనుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో జరగనున్న ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు ముఖ్య నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది.

ఫిబ్రవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్తగా నియమితులైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పదిహేను రోజుల పాటు సభ జరిగే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్: త్వరలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ: ఆ మంత్రులపై వేటు తప్పదా?

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 175 సీట్లను కైసవం చేసుకోవాలని సీఎం జగన్ భావిస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రోడ్డెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్న నేపథ్యంలో పార్టీని మరోసారి విజయతీరాలకు చేర్చేందుకు సీఎం జగన్ ఇప్పటి నుంచి వ్యూహ రచన చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కన్నుమూశారు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

విశాఖపట్నంలో 'గ్లోబల్ టెక్ సమ్మిట్'- వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్

విశాఖపట్నంలోని వీఎంఆర్‌డీఏ చిల్ర్‌టన్‌ ఎరీనాలో 'గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌' ప్రారంభమైంది. గురువారం, శుక్రవారం జరగనున్న ఈ ఈవెంట్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఫార్మా, వ్యవసాయ రంగాల ఆవిష్కరణలపై చర్చించనున్నారు. ఉదయం 10గంటలకు సీఎం జగన్‌ వర్చువల్‌గా ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు.

15 Feb 2023

కడప

కడప: జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు.

ఆంధ్రప్రదేశ్: పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్

పర్యాటకుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పర్యాటక ప్రదేశాల్లో ప్రత్యేక టూరిస్టు పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసింది. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 26 టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను జెండా ఊపి ప్రారంభించారు.

11 Feb 2023

దిల్లీ

దిల్లీ లిక్కర్ కేసు: వైసీపీ ఎంపీ కుమారుడు రాఘవ రెడ్డి అరెస్ట్

దిల్లీ మద్యం కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు వేగం పెంచడంతో అరెస్టుల పర్వం కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్: అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలు- సాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డిపై బదిలీ వేటు

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి బదిలీ అయ్యారు. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయాలని బదిలీ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్!

ఆంధ్రప్రదేశ్‌కి విశాఖపట్నం కొత్త రాజధాని కానుందని ఇటీవల నిర్వహించిన ప్రపంచ పెట్టుబడుల సదస్సు సన్నాహక సమావేశంలో సీఎం జగన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో తాను విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్: మూడు రాజధానుల అంశంపై ఈనెల 23న సుప్రీంకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల కేసు విచారణను ఈనెల 23వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. మూడు రాజధానుల అంశాన్నిఅత్యవసర ప్రాతిపదికన విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాది నిరంజన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. దీంతో 23న విచారిస్తామని జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నతో కూడిన ధర్మానసం వెల్లడించింది.

ఫోన్ ట్యాపింగ్‌: వైసీపీ వర్సెస్ కోటంరెడ్డి మధ్య డైలాగ్ వార్- మోదీ జోక్యం చేసుకుంటారా?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వర్సెస్ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్‌కు ముగింపు పడే అవకాశం కనిపించడం లేదు. శుక్రవారం ఇరు‌వర్గాల మధ్య ఢీఅంటేఢీ అనేలా మాటల తూటాలు పేలాయి.

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి విశాఖపట్నం కొత్త రాజధాని కానుందని సీఎం జగన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో తాను విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు వెల్లడించారు. మార్చి 3, 4 తేదీల్లో కొత్త రాజధాని విశాఖలో పెట్టుబడుల సదస్సును ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. సదస్సుకు వ్యాపారవేత్తలు, పెట్టబడిదారులను ఆహ్వానించారు.

వచ్చే ఏడాది నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ తరగతులు: సీఎం జగన్

డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదులను డిజిటల్‌గా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతి గదుల్లో డిజిటల్‌ స్క్రీన్‌లు, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌ డిస్‌ప్లే (ఐఎఫ్‌పిడి) ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. డిజిటల్‌ స్క్రీన్‌లతో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

సలహాదారుల నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

వివిధ శాఖలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారులను నియమించడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం సలహాదారులను నియమించే అధికారం ఉందా? లేదా? అనే దానిపై లోతుగా విచారణ జరపాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని డివిజన్‌ ​​బెంచ్‌ పేర్కొంది.

చంద్రబాబు సభల ఎఫెక్ట్: రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ సర్కారు నిషేధం

రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పవన్ భార్యలపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఒక పార్టీపై ఇంకో పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. వ్యక్తిగత విమర్శలు చేయడానికి కూడా వెనకాడటం లేదు.

'తెలంగాణ తీరుతో మా హక్కులను కోల్పోతున్నాం'.. కేంద్రానికి జగన్ ఫిర్యాదు

దిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్.. బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీళ్ల పంచాయితీని కేంద్రం వద్దకు తీసుకెళ్లారు. ముఖ్యంగా జగన్.. తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్‌ఎంబీ) ఆపరేషనల్‌ ప్రోటోకాల్స్‌, ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని కేంద్ర పర్యావరణ,అటవీ,వాతావరణ మార్పుల శాఖమంత్రి భూపేంద్ర యాదవ్‌‌కు జగన్ ఫిర్యాదు చేశారు.

చంపేస్తామని మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక.. గుడివాడలో దుండగుల హల్‌చల్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది.. రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నా.. అందరి చూపు మాత్రం గుడివాడ పైన ఉందని చెప్పాలి. 2024 ఎన్నికల్లో గుడివాడలో ఎలాగైనా వైసీపీని ఓడించాలని కంకణం కట్టుకుంది. తాజాగా నియోజకవర్గంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యమలో మరోసారి వార్తల్లో నిలిచింది గుడివాడ.

టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా?

వైసీపీ నేత, మాజీ మంత్రి, మైదుకూరు నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, కడప రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన నాయకుడు డీఎల్ రవీంద్రారెడ్డి చేసి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు

ఏపీ సీఎం జగన్‌పై సంచనల ఆరోపణలు చేశారు కడప జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి. పీకల్లోతు నష్టాల్లో ఉన్న బైజూస్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. అంతేకాకుండా అందులో అవినీతి కోణం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. బైజూస్ తో ఒప్పందం విషయంలో జగన్ అవినీతికి పాల్పడ్డారని, ఫలితంగా రూ. 1400 కోట్లు వృథా అవుతోందని సంచలన ఆరోపణపు చేశారు.

విదేశాల్లో సేవా కార్యక్రమాలు

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో పెద్ద ఎత్తున అభిమానులు చేపట్టారు. సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు వైసీపీ క్యాడర్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.

మూడు రాజధానులు V/S ఒక రాజధాని..!

ఏపీలో అప్పుడే రాజకీయ వేడీ మొదలైంది. ఎన్నికలకు సమయం ఉన్నా.. అప్పుడే ముందస్తు హడావుడి కనిపిస్తోంది. ఏపీలో ప్రధానంగా రెండు నియోజకవర్గాలపైనే వైసీపీ, టీడీపీ, జనసేన దృష్టి సారించాయి.