NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్: త్వరలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ: ఆ మంత్రులపై వేటు తప్పదా?
    భారతదేశం

    ఆంధ్రప్రదేశ్: త్వరలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ: ఆ మంత్రులపై వేటు తప్పదా?

    ఆంధ్రప్రదేశ్: త్వరలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ: ఆ మంత్రులపై వేటు తప్పదా?
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 18, 2023, 04:41 pm 1 నిమి చదవండి
    ఆంధ్రప్రదేశ్: త్వరలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ: ఆ మంత్రులపై వేటు తప్పదా?
    త్వరలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ

    వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 175 సీట్లను కైసవం చేసుకోవాలని సీఎం జగన్ భావిస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రోడ్డెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్న నేపథ్యంలో పార్టీని మరోసారి విజయతీరాలకు చేర్చేందుకు సీఎం జగన్ ఇప్పటి నుంచి వ్యూహ రచన చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దేందుకు త్వరలో సీఎం జగన్ కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఆయన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు వెళ్లే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు నుంచి నాలుగు మంత్రులు కేబినెట్‌లో స్థానం కోల్పోవచ్చనే ప్రచారం జరుగుతోంది.

    చరిత్రలో తొలిసారిగా మంత్రివర్గంలో 'కమ్మ' సామాజికవర్గానికి దక్కని ప్రాతినిధ్యం

    గత ఏడాది ఏప్రిల్‌లో జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. కొందరు మంత్రుల పరితీరు ఆశాజనకంగా లేకపోవడంతో ఏడాదిలోపే జగన్ తన మంత్రివర్గాన్ని రెండోసారి పునర్వ్యవస్థీకరించేదుకు సిద్ధమయ్యారు. కేబినెట్‌లోకొందరు అసమర్థ నేతలు ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు జగన్ కూడా అదే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. రోజా, అంబటి రాంబాబు, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్‌, జోగి రమేష్‌లు రిస్క్‌ జోన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పునర్వ్యవస్థీకరణ జరిగితే కొడాలి నాని, పేర్ని నాని, బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా తమ అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ప్రస్తుత మంత్రివర్గంలో కమ్మ ప్రాతినిధ్యం లేదు. ఇలా జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. మరి జగన్ ఆ సామాజికవర్గంలో ఎవరినైనా చేర్చుకుంటారో లేదో చూడాలి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    వై.ఎస్.జగన్
    ఆంధ్రప్రదేశ్

    వై.ఎస్.జగన్

    ఫిబ్రవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు కన్నుమూత ఆంధ్రప్రదేశ్
    విశాఖపట్నంలో 'గ్లోబల్ టెక్ సమ్మిట్'- వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్ విశాఖపట్టణం
    కడప: జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన వైఎస్‌ జగన్‌ కడప

    ఆంధ్రప్రదేశ్

    కర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య  కర్నూలు
    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    అరకులోయ కాఫీ పంటకు ఆర్గానిక్ సర్టిఫికేట్, వివరాలివే  భారతదేశం
    గుడ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023