NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్: త్వరలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ: ఆ మంత్రులపై వేటు తప్పదా?
    తదుపరి వార్తా కథనం
    ఆంధ్రప్రదేశ్: త్వరలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ: ఆ మంత్రులపై వేటు తప్పదా?
    త్వరలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ

    ఆంధ్రప్రదేశ్: త్వరలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ: ఆ మంత్రులపై వేటు తప్పదా?

    వ్రాసిన వారు Stalin
    Feb 18, 2023
    04:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 175 సీట్లను కైసవం చేసుకోవాలని సీఎం జగన్ భావిస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రోడ్డెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్న నేపథ్యంలో పార్టీని మరోసారి విజయతీరాలకు చేర్చేందుకు సీఎం జగన్ ఇప్పటి నుంచి వ్యూహ రచన చేస్తున్నారు.

    క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దేందుకు త్వరలో సీఎం జగన్ కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించనున్నట్లు తెలుస్తోంది.

    వచ్చే నెలలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఆయన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు వెళ్లే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

    ఇప్పటికే ముగ్గురు నుంచి నాలుగు మంత్రులు కేబినెట్‌లో స్థానం కోల్పోవచ్చనే ప్రచారం జరుగుతోంది.

    ఆంధ్రప్రదేశ్

    చరిత్రలో తొలిసారిగా మంత్రివర్గంలో 'కమ్మ' సామాజికవర్గానికి దక్కని ప్రాతినిధ్యం

    గత ఏడాది ఏప్రిల్‌లో జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. కొందరు మంత్రుల పరితీరు ఆశాజనకంగా లేకపోవడంతో ఏడాదిలోపే జగన్ తన మంత్రివర్గాన్ని రెండోసారి పునర్వ్యవస్థీకరించేదుకు సిద్ధమయ్యారు.

    కేబినెట్‌లోకొందరు అసమర్థ నేతలు ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు జగన్ కూడా అదే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.

    రోజా, అంబటి రాంబాబు, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్‌, జోగి రమేష్‌లు రిస్క్‌ జోన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

    ఒకవేళ పునర్వ్యవస్థీకరణ జరిగితే కొడాలి నాని, పేర్ని నాని, బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా తమ అవకాశాలను అందిపుచ్చుకుంటారు.

    ప్రస్తుత మంత్రివర్గంలో కమ్మ ప్రాతినిధ్యం లేదు. ఇలా జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. మరి జగన్ ఆ సామాజికవర్గంలో ఎవరినైనా చేర్చుకుంటారో లేదో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    వై.ఎస్.జగన్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఆంధ్రప్రదేశ్

    ఏపీఎస్ఆర్టీసీ కార్గో ఆదాయం అదుర్స్.. మొదటి మూడు త్రైమాసికాల్లో ఎంత వచ్చిందంటే? భారతదేశం
    అసైన్డ్ భూముల్లో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టులో విచారణ.. మంత్రి రజనీకి నోటీసు హైకోర్టు
    'తెలంగాణ తీరుతో మా హక్కులను కోల్పోతున్నాం'.. కేంద్రానికి జగన్ ఫిర్యాదు వై.ఎస్.జగన్
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు

    వై.ఎస్.జగన్

    మూడు రాజధానులు V/S ఒక రాజధాని..! చంద్రబాబు నాయుడు
    విదేశాల్లో సేవా కార్యక్రమాలు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి
    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025