NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి నిర్లక్ష్యం ; చంటిబిడ్డ మృతదేహంతో స్కూటీపై 120కిలోమీటర్లు ప్రయాణం
    తదుపరి వార్తా కథనం
    విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి నిర్లక్ష్యం ; చంటిబిడ్డ మృతదేహంతో స్కూటీపై 120కిలోమీటర్లు ప్రయాణం
    చంటిబిడ్డ మృతదేహంతో స్కూటీపై 120కిలోమీటర్లు ప్రయాణం

    విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి నిర్లక్ష్యం ; చంటిబిడ్డ మృతదేహంతో స్కూటీపై 120కిలోమీటర్లు ప్రయాణం

    వ్రాసిన వారు Stalin
    Feb 16, 2023
    04:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాస్పత్రుల దయనీయ స్థితికి అద్దం పట్టే సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం కుమడలో జరిగింది. విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి వైద్యలు, సిబ్బంది బాధ్యతారాహిత్యం కారణంగా చంటిబిడ్డ మృతదేహంతో దాదాపు 120 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణించారు తల్లిదండ్రులు.

    కుమడలో గ్రామానికి చెందిన దంపతులు తమ చంటిబిడ్డ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో చేర్చించారు. అయితే చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయింది.

    ఈ క్రమంలో చిన్నారి మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయడంలో ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా అంబులెన్స్‌ కోసం ఏంతో ప్రాధేయపడ్డారు. అయితే ఆస్పత్రి సిబ్బంది కనికరించలేదు.

    ఆంధ్రప్రదేశ్

    మానవతా దృక్పథంతో స్పందించిన పాడేరు సిబ్బంది

    బిడ్డను కోల్పోయిన దుఃఖంలో ఆ తల్లిదండ్రులు చేసేదేమీ లేక, చంటిబిడ్డ మృతదేహంతో దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరు వరకు స్కూటీపై వెళ్లారు.

    విషయం తెలుసుకున్న పాడేరు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది మానవతా దృక్పథంతో అంబులెన్స్ ఏర్పాటు చేశారు. దీంతో చిన్నారి మృతదేహాన్ని ఆ తల్లిదండ్రులు పాడేరు నుంచి ముంచింగిపుట్టు మండలం కుమడకు అంబులెన్స్‌లో వెళ్లారు.

    కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించిన విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆస్పుత్రుల్లో వైద్యం ఎలాగూ అందదు, చనిపోయిన వారిపట్ల కనీసం గౌరవం లేకపోవడంపై మండిపతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం
    ఆంధ్రప్రదేశ్
    ప్రభుత్వం

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    విశాఖపట్టణం

    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్
    ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్! వై.ఎస్.జగన్
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ

    ఆంధ్రప్రదేశ్

    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? తెలంగాణ
    చంపేస్తామని మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక.. గుడివాడలో దుండగుల హల్‌చల్ చంద్రబాబు నాయుడు
    2022లో మహిళలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులు ఇవే.. భారతదేశం
    ఏపీఎస్ఆర్టీసీ కార్గో ఆదాయం అదుర్స్.. మొదటి మూడు త్రైమాసికాల్లో ఎంత వచ్చిందంటే? భారతదేశం

    ప్రభుత్వం

    'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా? భారతదేశం
    BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లు నిషేదించిన ఢిల్లీ ప్రభుత్వం భారతదేశం
    బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు బడ్జెట్
    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025