NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి నిర్లక్ష్యం ; చంటిబిడ్డ మృతదేహంతో స్కూటీపై 120కిలోమీటర్లు ప్రయాణం
    భారతదేశం

    విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి నిర్లక్ష్యం ; చంటిబిడ్డ మృతదేహంతో స్కూటీపై 120కిలోమీటర్లు ప్రయాణం

    విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి నిర్లక్ష్యం ; చంటిబిడ్డ మృతదేహంతో స్కూటీపై 120కిలోమీటర్లు ప్రయాణం
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 16, 2023, 04:23 pm 0 నిమి చదవండి
    విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి నిర్లక్ష్యం ; చంటిబిడ్డ మృతదేహంతో స్కూటీపై 120కిలోమీటర్లు ప్రయాణం
    చంటిబిడ్డ మృతదేహంతో స్కూటీపై 120కిలోమీటర్లు ప్రయాణం

    ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాస్పత్రుల దయనీయ స్థితికి అద్దం పట్టే సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం కుమడలో జరిగింది. విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి వైద్యలు, సిబ్బంది బాధ్యతారాహిత్యం కారణంగా చంటిబిడ్డ మృతదేహంతో దాదాపు 120 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణించారు తల్లిదండ్రులు. కుమడలో గ్రామానికి చెందిన దంపతులు తమ చంటిబిడ్డ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో చేర్చించారు. అయితే చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయింది. ఈ క్రమంలో చిన్నారి మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయడంలో ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా అంబులెన్స్‌ కోసం ఏంతో ప్రాధేయపడ్డారు. అయితే ఆస్పత్రి సిబ్బంది కనికరించలేదు.

    మానవతా దృక్పథంతో స్పందించిన పాడేరు సిబ్బంది

    బిడ్డను కోల్పోయిన దుఃఖంలో ఆ తల్లిదండ్రులు చేసేదేమీ లేక, చంటిబిడ్డ మృతదేహంతో దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరు వరకు స్కూటీపై వెళ్లారు. విషయం తెలుసుకున్న పాడేరు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది మానవతా దృక్పథంతో అంబులెన్స్ ఏర్పాటు చేశారు. దీంతో చిన్నారి మృతదేహాన్ని ఆ తల్లిదండ్రులు పాడేరు నుంచి ముంచింగిపుట్టు మండలం కుమడకు అంబులెన్స్‌లో వెళ్లారు. కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించిన విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆస్పుత్రుల్లో వైద్యం ఎలాగూ అందదు, చనిపోయిన వారిపట్ల కనీసం గౌరవం లేకపోవడంపై మండిపతున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    ఆంధ్రప్రదేశ్
    ప్రభుత్వం
    విశాఖపట్టణం

    ఆంధ్రప్రదేశ్

    కర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య  కర్నూలు
    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    అరకులోయ కాఫీ పంటకు ఆర్గానిక్ సర్టిఫికేట్, వివరాలివే  భారతదేశం
    గుడ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    ప్రభుత్వం

    చలామణిలో ఎక్కువగా రూ.500 నోట్లు.. ధ్రువీకరించిన ఆర్బీఐ రిపోర్టు ప్రధాన మంత్రి
    గోదావరి జలాలు కావేరికి.. మొగ్గు చూపుతున్న కేంద్రం తెలంగాణ
    వడగళ్ల వాన పడినా గింజ రాలదు.. పంట స్థిరంగా ఉంటుంది తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్‌కు రూ.10వేల కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్

    విశాఖపట్టణం

    విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్ వరకు పొడిగింపు  రైల్వే శాఖ మంత్రి
    విశాఖ చరిత్ర తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి వైజాగ్
     హై స్పీడ్‌తో హైదరాబాద్-విశాఖపట్నం రహదారి నిర్మాణం; 56 కి.మీ తగ్గనున్న దూరం హైదరాబాద్
    పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్  ఆంధ్రప్రదేశ్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023